కొండగట్టుపై వైకాపా నేతల ఉడుంపట్టు
అది కొండగట్టు ప్రాంతం. రెవెన్యూ దస్త్రాల్లో కొండపోరంబోకుగా ఉంది. దీన్ని గ్రామ అవసరాలు, పశువుల మేతకు వినియోగించాలి.
గోరంత అనుమతులతో కొండంత తవ్వకం
తోటపల్లిలో రూ.కోట్ల అక్రమం
ఈనాడు, అమరావతి: అది కొండగట్టు ప్రాంతం. రెవెన్యూ దస్త్రాల్లో కొండపోరంబోకుగా ఉంది. దీన్ని గ్రామ అవసరాలు, పశువుల మేతకు వినియోగించాలి. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నుపడింది. ఆయన కుమారుడు, మరో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. చకచకా అనుమతులు వచ్చేశాయి. మట్టిని తవ్వే బాధ్యతను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు అప్పగించారు. నేతలకు ఒక లారీకి రూ.2వేల వరకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. జేసీబీలు, వాహనాలన్నీ ఆ సంస్థవే. ఇంకేం... కొన్ని లక్షల ఘనపు మీటర్ల మట్టి (గ్రావెల్)ని తవ్వేశారు. రూ.కోట్ల లబ్ధి పొందారు. ఇదేమిటని అడిగే అధికారులు లేరు. అక్రమాన్ని ప్రశ్నించిన గ్రామస్థులు మాత్రం దాడులకు గురయ్యారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా (ప్రస్తుతం ఏలూరు జిల్లా) పరిధిలోని తోటపల్లిలో అక్రమ తవ్వకాలతో వైకాపా ప్రజాప్రతినిధులు విధ్వంసం సృష్టించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు(నాటి), అధికార పార్టీ నేతలు తమ బినామీలతో రెవెన్యూ శాఖ ద్వారా ఎన్వోసీలు తీసుకుని, గనుల శాఖ నుంచి లీజు ఉత్తర్వులు పొందారు. జలవనరుల శాఖ నుంచి పోలవరం కట్టలకు తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. వాటిని ప్రముఖ సంస్థలకు విక్రయించుకున్నారు. కొందరు తమ సంస్థలతోనే తవ్వకాలు జరిపారు. నిబంధనలకు పాతరేసి, రూ.కోట్లు పోగేశారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో సర్వే నంబరు 02లో 679.23 ఎకరాల కొండగట్టు ప్రాంతం ఉంది. తొలుత సర్వే నంబరు ఆర్ఎస్2లో 30.78 ఎకరాలకు 2020 మే నెలలో ఒక శాశ్వత అనుమతిని పొందారు. ఈ లీజుతో నాలుగేళ్ల అయిదు నెలల వరకు తవ్వుకోవచ్చు. తర్వాత ఈ సర్వే నంబరును 2/1గా మార్చారు. 2022లో తాత్కాలిక అనుమతుల పేరిట 3 ఎకరాల్లో నాలుగు అనుమతులను ఒకే వ్యక్తి పేరిట ఇచ్చారు. ఒక్క అనుమతిని 36,432 ఘనపు మీటర్లకు ఇచ్చారు. అంటే మొత్తం మూడెకరాల్లో 1.46 లక్షల ఘనపు మీటర్ల మట్టిని తవ్వాలి. కానీ... తవ్వకాలను దాదాపు 150 ఎకరాలకు పైగా విస్తరించారు. కొండను నామరూపాలు లేకుండా చేశారు. సాధారణంగా ఒక ఎకరం విస్తీర్ణంలో ఒక మీటరు లోతులో తవ్వితే... 5వేల ఘనపు మీటర్ల మట్టి వస్తుంది. ఇక్కడ లోతు తీవ్రత, కొండ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటే... కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వినట్లు కనిపిస్తోంది. అయినా దీనిపై గనుల శాఖ తనిఖీలు చేయకపోవడం గమనార్హం. ఒక లారీ గ్రావెల్ను రూ.5వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా రెండున్నరేళ్లుగా కొన్ని లక్షల ఘనపు మీటర్ల మట్టి తరలిపోయింది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. నేరుగా వైకాపా నేతల ప్రమేయం ఉండటంతో ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. గ్రామస్థులను బెదిరించి కనీసం అటువైపు కన్నెత్తి చూడనీయలేదు. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ప్రజాప్రతినిధి పక్షమే ఉండటంతో కనీసం ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోయిందని వారు వాపోయారు.
పంటలపై ప్రభావం
నిత్యం వందలాది లారీలు తిరగడంతో దుమ్ముధూళి కమ్మేస్తోంది. సమీపంలోని పంటలపై తీవ్ర ప్రభావం పడింది. పశువుల మేతకు ఇబ్బంది కలిగింది. ధైర్యంచేసి పశువులను మేతకు తీసుకెళితే ప్రైవేటు సైన్యం దాడులు చేసేది. దీంతో గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు.
గ్రామం: తోటపల్లి, ఆగిరిపల్లి మండలం (ఏలూరు జిల్లా)
సర్వే నంబరు: ఆర్ఎస్-02
విస్తీర్ణం: 12.318 హెక్టార్లు (30.78 ఎకరాలు)
కాలపరిమితి: నాలుగేళ్ల 5 నెలలు
సర్వే నంబరు: ఆర్ఎస్-02/1
విస్తీర్ణం: మూడు ఎకరాలు
అనుమతి: 36,423 ఘనపు మీటర్లు
కాలపరిమితి: నాలుగు తాత్కాలిక అనుమతులు
జరిగింది: ఇక్కడ కొండగట్టు మొత్తం విస్తీర్ణం 679.23 ఎకరాలు ఉండగా ఇప్పటికి దాదాపు 150 ఎకరాలకు పైగా తవ్వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
గులకరాయి కేసులో కస్టడీ పిటిషన్పై ముగిసిన వాదనలు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.