అదిరే వాహనంపై అలుపెరగని ప్రయాణం
ఈయన పేరు సమీర్ఖాన్ అలియాస్ రైడర్ శామ్. ముంబయిలోని గోరేగాం నివాసి. వృత్తిరీత్యా ఈవెంట్ మేనేజర్.
ఈయన పేరు సమీర్ఖాన్ అలియాస్ రైడర్ శామ్. ముంబయిలోని గోరేగాం నివాసి. వృత్తిరీత్యా ఈవెంట్ మేనేజర్. ప్రవృత్తి బైక్ రైడింగ్. దేశంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చినా ఈ బైక్పైనా వెళ్తుంటారు. ప్రయాణంలో సౌలభ్యం కోసం వాహనానికి అదనపు హంగులు ఏర్పాటు చేయించారు. రియర్వ్యూ మిర్రర్పైన, హ్యాండిల్ చివర ఇండికేటర్లు, ప్రయాణ సమయాల్లో సంగీతం వినడానికి వీలుగా నాలుగు స్పీకర్లతో కూడిన స్టీరియో పెట్టించారు. ‘‘గుజరాత్, రాజస్థాన్లోని అజ్మేర్ తదితర ప్రాంతాలకు ఈ బైకుపైనే వెళ్లాను. మరో నాలుగు నెలల్లో లద్దాఖ్ వెళ్లాల్సి ఉంది. భారీ శబ్దాలు చేస్తూ వాహనాలను నడిపితే వృద్ధులకు, పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రమాదాలూ జరిగే అవకాశం ఉంది. నా ప్రయాణంలో భాగంగా దీనిపై అవగాహన కల్పిస్తుంటాను’’ అని శామ్ తెలిపారు. హైదరాబాద్లో ఓ వివాహం నిర్వహణకు వచ్చిన ఆయన ‘ఈనాడు’ కెమెరాకు చిక్కారు.
ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల దారుణహత్య
-
Crime News
కుమార్తెలను చదివించేందుకు అప్పులు.. తీర్చలేక అమ్మ బలవన్మరణం
-
India News
బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్గా..
-
Ap-top-news News
Taraka Ratna: తారకరత్నకు మరిన్ని వైద్య పరీక్షలు
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం