ఆక్వా రైతుకు అండ ఏదీ!
రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన రైతులకు.. ఇప్పుడు ఎన్నడూ లేని కష్టం వచ్చింది. ఉత్పత్తిని కొనేవారు లేక పడరాని పాట్లు పడుతున్నారు.
స్థిరీకరణ ‘నిధి’ నుంచి ఆదుకోవచ్చు
పట్టించుకోని ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన రైతులకు.. ఇప్పుడు ఎన్నడూ లేని కష్టం వచ్చింది. ఉత్పత్తిని కొనేవారు లేక పడరాని పాట్లు పడుతున్నారు. గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని రెండు, మూడు నెలలుగా గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం సాచివేత ధోరణికే పరిమితమవుతోంది. ధరల స్థిరీకరణ ‘నిధి’ని బయటకు తీయడం లేదు. ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు చర్యలూ చేపట్టడం లేదు. ఇప్పుడే కాదు, ధరలు దక్కడం లేదని, నష్టపోతున్నామని కూరగాయ పంటల్ని సాగు చేసే రైతులు తమ పొలాల్ని పశువులకు వదిలేస్తున్నా.. తక్షణం భరోసా అందించే చర్యలు కొరవడ్డాయి. అధికశాతం రైతులు తమ పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని నష్టపోయాకే.. కొనుగోలుకు అనుమతిస్తోంది. 2019 సంవత్సరంలో సెనగ రైతులకు సాయం నుంచి.. ఇప్పుడు ఆక్వా సంక్షోభం వరకు ప్రతిచోటా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పేరుకే రూ.3వేల కోట్ల స్థిరీకరణ అంటూ మాటలు తప్పితే.. ఆదుకుందామనే ఆలోచనే కొరవడిందని రైతులు మండిపడుతున్నారు. పంట ఉత్పత్తుల సేకరణలో ముందస్తు సన్నద్ధత అనేదే లేదని, అరకొర సాయంతో సరిపెట్టే ధోరణితోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందనే అసంతృప్తి వారిలో వ్యక్తమవుతోంది.
ఆదుకోలేని ‘నిధి’ ఎందుకు?
ధరల పతనం, దాణా ధరల పెరుగుదల తదితర సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం మంత్రులతో సాధికార కమిటీ ఏర్పాటు చేసింది. వారు వంద కౌంట్ రొయ్యను కిలోకి రూ.210 చొప్పున కొనాలంటున్నా.. రైతుకు రూ.170 నుంచి రూ.190 కూడా దక్కడం లేదు. ఆ ధరకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. రొయ్య ఎక్కువ రోజులు చెరువులో ఉంటే.. ఖర్చు పెరగడంతోపాటు వ్యాధులు ఆశిస్తే మొత్తం పెట్టుబడే కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే రైతులకు కిలోకు రూ.100 వరకు నష్టపోతున్నారు. ఆక్వా రంగానికి గతంతో పోలిస్తే రాయితీలు తగ్గిపోయాయని, విద్యుత్తు భారమూ పెరిగిందని.. ధరల స్థిరీకరణ నిధి కింద ఆర్థిక సహకారం అందిస్తే కొంతైనా నష్టాలు తగ్గే వీలుంటుందని ఆక్వా రైతులు చెబుతున్నారు.
ఏటా కేటాయింపులే...
ధరల స్థిరీకరణ నిధికి ప్రభుత్వం 2019-20లో రూ.3వేల కోట్లు కేటాయించి రూ.351 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అందులో సెనగ రైతులకు సాయం కింద అందించిన రూ.120 కోట్లు, ఆయిల్పామ్ రైతులకు ధరలో తేడా కింద రూ.80 కోట్లు మినహాయిస్తే.. పంటల కొనుగోలుకు రూ.151 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2020-21లోనూ రూ.3వేల కోట్లు కేటాయించి రూ.524 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పంట ఉత్పత్తుల కొనుగోలుకు మార్క్ఫెడ్కు ఇవ్వాల్సిన మొత్తమూ ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంది. ఇంకా రూ.650 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. రైతులకు స్థిరీకరణ నిధి ద్వారా ఎలాంటి ప్రయోజనాలందుతున్నాయో చెప్పేందుకు సెనగ రైతులకు సాయమే ఉదాహరణ. 2019లో ధర వ్యత్యాస పథకం కింద రూ.330 కోట్లు కేటాయించింది. క్వింటాకు రూ.1,500, ఎకరాకు 6 క్వింటాళ్ల చొప్పున ఒక్కో రైతుకు గరిష్ఠంగా ఐదెకరాల వరకు సాయం చేస్తామని ప్రకటించింది. అంటే ఒక్కో రైతుకు రూ.45వేల వరకు అందుతాయి. అయితే తర్వాత రకరకాల నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టింది. రూ.120 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా