కొత్త సీఎస్ జవహర్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్రెడ్డి నియమితులయ్యారు. 2024 జూన్ వరకు ఈ పోస్టులో కొనసాగనున్నారు. వైయస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలోని కసునూరు గ్రామానికి చెందిన ఆయన 1990లో ఐఏఎస్కు ఎంపికయ్యారు.
సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్య
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్
మధుసూదన్రెడ్డికి వ్యవసాయ, సహకార శాఖలు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్రెడ్డి నియమితులయ్యారు. 2024 జూన్ వరకు ఈ పోస్టులో కొనసాగనున్నారు. వైయస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలోని కసునూరు గ్రామానికి చెందిన ఆయన 1990లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ అనేక కీలక శాఖల్లో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ మొదలైంది. మహబూబ్నగర్, నర్సాపురం అసిస్టెంట్ కలెక్టర్గా, భద్రాచలం ఐటీడీఏ పీవోగా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్గా పని చేశారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు కలెక్టర్గా పని చేశారు. హైదరాబాద్లో మెట్రో వాటర్ సర్వీసెస్ ఎండీగా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీసీగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ కమిషనర్గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 అక్టోబరు నుంచి 2014 ఫిబ్రవరి వరకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం నీటి పారుదల, పంచాయతీరాజ్శాఖలకు ముఖ్య కార్యదర్శిగా, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తితిదే కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించారు.
ఆ తర్వాత జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన, 2021 నవంబరు 20 నుంచి ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
సీఎంవోకి పూనం మాలకొండయ్య
రాష్ట్ర ప్రభుత్వం కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న జవహర్రెడ్డిని కొత్త సీఎస్గా నియమించడంతో ఆయన స్థానంలో పూనం మాలకొండయ్యను సీఎంవోకు పంపింది. ఆమె ప్రస్తుతం వ్యవసాయ, సహకారశాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఆమె చూస్తున్న శాఖల్ని... పూర్తి అదనపు బాధ్యతగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా పని చేస్తున్న మధుసూదన్రెడ్డికి అప్పగించింది. ఇప్పటివరకు పూనం పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న పశు సంవర్థక, మత్స్య, పరిశ్రమలు (చక్కెర) శాఖల బాధ్యతనూ మధుసూదన్రెడ్డికే అప్పగించింది. రవాణా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసింది. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బి.రాజశేఖర్ సెలవుపై విదేశాలకు వెళుతున్నారు. సెలవు నుంచి తిరిగొచ్చాక పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆయనకు ప్రభుత్వం సూచించింది. మార్కెటింగ్శాఖ కమిషనర్, మార్క్ఫెడ్ ఎండీగా ఉన్న పి.ఎస్.ప్రద్యుమ్నను రవాణా, రోడ్లు భవనాలశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పాండేని మార్కెటింగ్శాఖ కమిషనర్గా నియమించింది. మార్క్ఫెడ్ ఎండీ పోస్టును ఆయనకు పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది. ఐఎఫ్ఎస్ అధికారి బి.మహ్మద్ దివాన్ మైదీన్ను గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది.
ఆ ముగ్గురూ వైయస్ఆర్ జిల్లావారే
రాష్ట్రంలో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పోస్టుల్లో ఉన్న ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి, ఒకే జిల్లాకు చెందినవారు కావడం విశేషం. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వగ్రామం వైయస్ఆర్ జిల్లాలోని సింహాద్రిపురం మండలం బలపనూరు. కొత్త సీఎస్ జవహర్రెడ్డి అదే మండలానికి చెందినవారు. ఆయనది సింహాద్రిపురం మండలంలోని కసునూరు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి స్వగ్రామం రాజుపాలెం మండలంలోని పల్లంపాడు. ఇలా ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి, పోలీసుశాఖకు సారథులుగా ఉన్న ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి, ఒకే జిల్లాకు చెందినవారవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే... సీఎస్గా జవహర్రెడ్డిని నియమించిన నేపథ్యంలో డీజీపీని మార్చే అవకాశముందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM