Viveka Murder Case: ఎంత పరువు తక్కువ!
రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి ఇంత కంటే తలవంపులు, అప్రతిష్ఠ ఇంకేమీ ఉండవేమో..! ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా జరిగే అవకాశం కనిపించడం లేదంటూ... కేసు విచారణను సుప్రీంకోర్టు పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం రాష్ట్రానికి ఎంత పరువు తక్కువ!
అధికారంలో ఉన్నవారివల్లే దర్యాప్తుపై సుప్రీంకోర్టు అనుమానాలు
సీఎం బాబాయి హత్యకేసు విచారణ పక్క రాష్ట్రానికి వెళ్లడం అప్రతిష్ఠేనంటున్న ప్రతిపక్షాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి ఇంత కంటే తలవంపులు, అప్రతిష్ఠ ఇంకేమీ ఉండవేమో..! ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా జరిగే అవకాశం కనిపించడం లేదంటూ... కేసు విచారణను సుప్రీంకోర్టు పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం రాష్ట్రానికి ఎంత పరువు తక్కువ! బాధితుల పక్షాన నిలబడి, వారికి న్యాయం చేయకుండా.... ప్రభుత్వానికి, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టు. 2003లో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగా... ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ తమిళనాడులో సక్రమంగా జరగదని, కర్ణాటకకు మార్చాలని డీఎంకే నేత కె.అన్బళగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా... సుప్రీంకోర్టు దానికి సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి కాబట్టి, ఆమె నిందితురాలిగా ఉన్న కేసు విచారణ ఆ రాష్ట్రంలో సక్రమంగా జరగదన్న ఉద్దేశంతో వేరే రాష్ట్రానికి మార్చారు. కానీ ఒక హత్య కేసు విచారణను, అది కూడా ముఖ్యమంత్రి సొంత బాబాయి హత్య కేసు విచారణను... అధికారంలో ఉన్నవారి వల్ల సక్రమంగా జరగదేమోనన్న అనుమానంతో పక్క రాష్ట్రానికి మార్చడం ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు.
అప్పుడు రాజకీయం కోసం జగన్ చేసిందే... ఇప్పుడు నిజమైంది
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి ఘటన తర్వాత ఆయన ఇక్కడి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తానని ప్రకటించారు. అప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన రాష్ట్రం పరువు తీయాలని చూశారు. కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు వల్ల రాష్ట్రం పరువు జాతీయస్థాయిలో మంటగలిసింది. ‘వివేకా హత్యకేసు విచారణ ఆంధ్రప్రదేశ్లో గాడి తప్పే ప్రమాదం ఉందని హతుడి భార్య, కుమార్తె వ్యక్తం చేసిన ఆందోళన హేతుబద్ధంగా కనిపిస్తోంది. కేసులోని వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్నా విచారణ నిజాయతీగా, స్వతంత్రంగా జరిగే అవకాశం లేదని భావిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు చెప్పడం రాష్ట్రంలోని పరిస్థితులకు అద్దం పట్టింది. వివేకా హత్య కేసు విచారణ రాష్ట్రంలో సక్రమంగా జరిగే అవకాశం లేదని దేశ అత్యున్నత దర్యాప్తుసంస్థ సీబీఐ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం, వివేకా కుమార్తె సునీత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం రాష్ట్రంలో ఎంత అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయో తెలియజెబుతోంది. కేసు విచారణను దిల్లీకే మార్చేవారిమని, కానీ సాక్షుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్క రాష్ట్రానికి మార్చామని సుప్రీంకోర్టు చెప్పడం... ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసుల వ్యవహారశైలిని అభిశంసించడమేనన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
నాటి పేరు నేడేది?
రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని, ప్రభుత్వం, పోలీసులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారని చెప్పడానికి సుప్రీంకోర్టు నిర్ణయమే పెద్ద నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఎంత తీవ్రమైన అరాచక పరిస్థితులు ఉన్నాయో... సుప్రీంకోర్టు నిర్ణయంతో దేశం మొత్తానికి తెలిసినట్టయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఒకప్పుడు మంచి పేరుండేది. నేర నియంత్రణ, పరిశోధనల్లో వారి నైపుణ్యానికి వివిధ వేదికలపై ప్రశంసలు దక్కేవి. కానీ గత మూడేళ్లలో ఆ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం చెప్పినదానికల్లా తలాడిస్తూ, న్యాయాన్ని, చట్టాల్నితుంగలో తొక్కుతూ... సామాన్యులపై సాగిస్తున్న దాష్టీకాల వల్ల పోలీసు యంత్రాంగం అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయిలోనే వారి పరువు మంటగలిసింది. సామాన్యుల విషయం పక్కన పెడదాం. వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకే బెదిరింపులు ఎదురయ్యాయంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. ‘వివేకా హత్య కేసులో సాక్షులకు, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు ఏపీలో బెదిరింపులు ఎదురవుతున్నందున అక్కడ నిష్పాక్షిక విచారణ, దర్యాప్తు జరుగుతుందని మాకు అనిపించట్లేదు’ అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏపీ పోలీసులు తలదించుకోవాల్సిన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. రాష్ట్ర పోలీసుల ఏకపక్ష, పక్షపాత ధోరణిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించినట్టే ఆ వ్యాఖ్యల్ని పరిగణించాలి. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇంత దారుణంగా విశ్వసనీయతకోల్పోవడం గతంలో ఎన్నడూ లేదు.
అంతటి సీబీఐనే సుప్రీంకోర్టుకు మొరపెట్టుకోవలసి వచ్చిందంటే..
సాధారణంగా సంక్లిష్టమైన, రాష్ట్ర పోలీసుల వల్ల సాధ్యం కాదనుకున్న కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తారు. అలాంటి సీబీఐనే రాష్ట్ర పోలీసులు మూడు చెరువుల నీళ్లు తాగించారంటే ఎంతటి ఘనులో అర్థమవుతోంది. వివేకా కేసులో నిందితుల నుంచి సాక్షులకు ప్రాణహాని ఉందని, వారి సంబంధీకులే దర్యాప్తు అధికారిని బెదిరించారని సుప్రీంకోర్టుకు సీబీఐ విన్నవించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, సాక్షులకు, దర్యాప్తు అధికారులకు కూడా రక్షణ కల్పించలేని స్థితికి ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం దిగజారిపోయిందంటే అంతకంటే పరువు తక్కువ విషయం ఇంకేం ఉంటుంది? ‘వివేకా హత్యకేసు నిందితులతో ఏపీ పోలీసులు కుమ్మక్కయ్యారు. అప్రూవర్గా మారిన దస్తగిరి తన ప్రాణాలకు ముప్పు ఉందని వాపోతున్నారు. సాక్షులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు’ అని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పటం, దానితో ఏకీభవించిన సుప్రీంకోర్టు కేసు విచారణను పక్క రాష్ట్రానికి మార్చడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ