Viveka murder case:వివేకా హత్యకేసు తెలంగాణకు బదిలీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్లో న్యాయమైన విచారణ, స్వేచ్ఛగా జరిగే అవకాశం కనిపించనందున దాని వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని వెలికితీసేందుకు కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో న్యాయమైన విచారణ, స్వేచ్ఛాయుత దర్యాప్తుపై అనుమానం
ఈ కేసులో విస్తృత కుట్రకోణాన్ని వెలికితీయాలి
తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
ఈనాడు - దిల్లీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్లో న్యాయమైన విచారణ, స్వేచ్ఛగా జరిగే అవకాశం కనిపించనందున దాని వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని వెలికితీసేందుకు కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో కేసు విచారణ గాడి తప్పే ప్రమాదం ఉందని హతుడి భార్య, కుమార్తె వ్యక్తం చేసిన అనుమానాలు హేతుబద్ధంగా కనిపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని సొంతింట్లోనే వివేకా హత్యకు గురయ్యారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా, స్థానికంగా రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు సాక్షులను బెదిరిస్తూ విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని, అందువల్ల తెలంగాణకు గానీ, మరేదైనా రాష్ట్రానికి గానీ బదిలీచేయాలని వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించింది. ‘ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విచారణ నిజాయతీగా, స్వతంత్రంగా జరిగే అవకాశం లేదని, సంఘటన స్థలంలో జరిగిన సాక్ష్యాల ధ్వంసం, హత్య వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు తదుపరి చేపట్టాల్సిన దర్యాప్తు సజావుగా జరగదేమోనని హతుడి భార్య, కుమార్తె వ్యక్తం చేసిన అనుమానాలను కాదనలేం. ఇందులో పిటిషనర్లు హతుడి కుమార్తె, భార్య కాబట్టి న్యాయం పొందే ప్రాథమిక హక్కు వారికి ఉంటుంది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా హత్య కేసు విచారణ నిజాయతీగా, నిష్పాక్షికంగా జరగాలని వారు ఆశించడం న్యాయమే. ఈ నేపథ్యంలో మొత్తం దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి ఇది సరైన కేసుగా మేం భావిస్తున్నాం. న్యాయసూత్రాల ప్రకారం న్యాయం చేయడమే కాదు... న్యాయం జరిగినట్లు కనిపించడం ముఖ్యం. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం న్యాయమైన, స్వేచ్ఛాయుత విచారణ జరగడం ముఖ్యం. ఆ విచారణ పక్షపాతంగా జరిగితే న్యాయవ్యవస్థ, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలు ప్రమాదంలో పడటంతోపాటు, వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం దెబ్బతింటుంది. పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాల్సి ఉన్నందున.. వారికి ఇబ్బంది కలగకూడదని ఈ కేసును దిల్లీకి బదులు హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయాలని నిర్ణయించాం. అందువల్ల కడప సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో అన్ని వివరాలనూ హైదరాబాద్ కోర్టుకు బదిలీ చేయాలి. ఛార్జిషీట్లు, సప్లిమెంటరీ ఛార్జిషీట్లు వెంటనే అక్కడికి పంపాలి. ఈ కేసులో విస్తృత కుట్ర దాగి ఉందని, సాక్ష్యాల ధ్వంసం జరిగిందని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో సీబీఐ సాధ్యమైనంత త్వరగా ఎలాంటి వివక్షకు తావులేకుండా ఆ అంశాలపై స్వతంత్రంగా దర్యాప్తు పూర్తిచేయాలి’ అని జస్టిస్ ఎంఆర్ షా స్పష్టం చేశారు.
కేసు విచారణ బదిలీకి కోర్టు చెప్పిన కారణాలివీ..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న అయిన వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద రీతిలో మరణించారు. మరణించిన వ్యక్తి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత ఈ కేసును కడప సీబీఐ కోర్టు నుంచి దిల్లీ లేదా హైదరాబాద్కు బదిలీచేసి నిర్దిష్ట గడువులోగా సీబీఐ విచారణ పూర్తిచేసేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.
* ఈ కేసులోని ప్రధాన సాక్షులకు ప్రాణాపాయం ఉందని, కొందరు సాక్షులు ఇప్పటికే ప్రభావితమయ్యారన్నది పిటిషనర్ల ప్రధాన అనుమానం. ఈ కేసులోని నిందితుడు, రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం ప్రభావం కారణంగా ఈ హత్యవెనుక ఉన్న కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసంపై తదుపరి దర్యాప్తు న్యాయంగా, నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదన్నది వారి అభిప్రాయం.
* జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండుసార్లు సిట్ మార్పు: 2019 మార్చి 14-15 తేదీల మధ్య రాత్రి వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఆ వెంటనే రాష్ట్రప్రభుత్వం సిట్ వేసింది. తర్వాత సునీత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేసు దాఖలు చేశారు. 2019 మే 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రెండుసార్లు సిట్ను పునరుద్ధరించారు. కానీ దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. మారిన పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో దాఖలుచేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ హైకోర్టు మాత్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ ఛార్జిషీట్లు, అనుబంధ ఛార్జిషీట్లు దాఖలుచేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ఉన్న విస్తృత కుట్ర, సాక్ష్యాల ధ్వంసంపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులకు వ్యతిరేకంగా కేసులు నమోదుచేయగా, హైకోర్టు స్టే ఇచ్చింది. సీబీఐ తదుపరి దర్యాప్తు కొనసాగించకుండా వారిని వేధించడానికే ఇలా తప్పుడు, నకిలీ కేసులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి ప్రస్తుత దర్యాప్తు ఏమాత్రం స్వేచ్ఛగా కొనసాగే అవకాశం లేదని అనిపిస్తోంది.
* ముఖ్యసాక్షులు షేక్ దస్తగిరి, రంగన్న ఇప్పటికే పోలీసు భద్రత పొందుతున్నారు. ప్రాణాపాయంఉందన్న కారణంతో వారికి రక్షణ కల్పిస్తూ సెషన్స్ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
* ఒక సాక్షి సీఆర్పీసీ 164 కింద స్టేట్మెంట్ ఇవ్వడానికి అంగీకరించి, తర్వాత మాటమార్చారు. అతని సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడమే ఆ వ్యక్తి మాట మార్చడానికి కారణం.
* కె.గంగాధర్రెడ్డి అనే ముఖ్యసాక్షి కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి అంగీకరించారు. తర్వాత దాన్నుంచి వెనక్కు తగ్గడంతోపాటు, సీబీఐ తనను వేధిస్తోందని మీడియా ముందు చెప్పారు. తర్వాత అతను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో ఈ కేసు తదుపరి దర్యాప్తు స్వేచ్ఛగా జరగకపోవచ్చన్న బాధితుల అనుమానాలను కొట్టిపారేయలేం.
అవినాశ్రెడ్డిపై అనుమానం
సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పులో సునీత తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీబీఐ తరఫు న్యాయవాది నటరాజన్ చేసిన వాదనలను ప్రస్తావించింది. - ఛార్జిషీటులో అధికారపార్టీకి చెందిన ఎంపీ అవినాశ్రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది. అతన్ని అనుమానితుడిగా పేర్కొన్నారు. సాక్ష్యాల ధ్వంసంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు, వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని తప్పుడు వార్తలు ప్రచారంలో పెట్టినట్లు పేర్కొన్నారు. వైఎస్ అవినాశ్రెడ్డిని ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. రాష్ట్రంలో అధికార ప్రభావం ఉన్నవారు వైఎస్ అవినాశ్రెడ్డి, అతని అనుచరుడు డి.శివశంకర్రెడ్డిని రక్షించాలని.. దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టారు. దాంతో వారు స్టే కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఫిర్యాదు పెండింగ్లో ఉండటంతో సీబీఐ అధికారులు దర్యాప్తు ఆపి ఏపీని వదిలిపెట్టిపోయారు. దర్యాప్తు పునఃప్రారంభిస్తే నిందితులు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారి జోక్యంతో మరిన్ని కేసులు పెడతారేమోనన్న భయంతో సీబీఐ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టలేదు.
* ఈ నేరంలో పాల్గొన్నవారిని రక్షించడానికి అధికారంలో ఉన్నవారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సాక్షులను, దర్యాప్తును, న్యాయప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
* ఈ కేసులో సాక్షులను డి.శివశంకర్రెడ్డి అనచరులు బెదిరిస్తున్నారు. ముగ్గురు ప్రధాన సాక్షులు ఇప్పటికే శివశంకర్రెడ్డి, ఇతరకుట్రదారుల ప్రభావంలో ఉన్నారు.
* ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో ఇద్దరు ప్రధాన సాక్షులకు ఇప్పటికే పోలీసు భద్రత కల్పించారు. దీన్నిబట్టి సాక్షులను ప్రభావితం చేయడానికి, సాక్ష్యాధారాలను చెరిపేయడానికిఅవకాశాలున్నాయి. సీబీఐ సిబ్బందిపై ఒత్తిడి తేవడంతోపాటు, వారిని బెదిరిస్తూ చివరకు తప్పుడు కేసులు పెడుతున్నందున తదుపరి దర్యాప్తు న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!