సంక్షిప్త వార్తలు (13)
రాష్ట్రంలోని 11.02 లక్షల మంది విద్యార్థులకు జులై-సెప్టెంబరు త్రైమాసిక ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన రూ.694 కోట్లను మదనపల్లెలో బుధవారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
విద్యా దీవెన నాలుగో విడత నిధులు జమ నేడు
ఈనాడు,అమరావతి: రాష్ట్రంలోని 11.02 లక్షల మంది విద్యార్థులకు జులై-సెప్టెంబరు త్రైమాసిక ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన రూ.694 కోట్లను మదనపల్లెలో బుధవారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2017 నుంచి ఉన్న బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రూ.12,401 కోట్లు సాయం అందించినట్లు పేర్కొంది. పేదలు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య విద్య తదితర కోర్సుల విద్యార్థులు తాము కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించింది.
ఏబీ వెంకటేశ్వరరావు వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం కొట్టివేత
ఈనాడు, అమరావతి: హైకోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు జీత భత్యాలు చెల్లించలేదంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. కోర్టు ఆదేశాలను సీఎస్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు తాము భావించడం లేదంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
లిక్కర్ హోలోగ్రామ్స్ టెండర్లలో అవకతవకలపై విచారణకు కమిటీ
ఈనాడు, అమరావతి: మద్యం హోలోగ్రామ్స్ తయారీ కోసం యంత్ర పరికరాల సరఫరాకు జారీచేసిన టెండరు ప్రకటనపై వచ్చిన ఆరోపణల పరిశీలనకు రాష్ట్రప్రభుత్వం కమిటీని నియమించింది. ఏపీటీడీసీ ఎండీ ఛైర్మన్గా, సాధారణ పరిపాలనశాఖ అదనపు కార్యదర్శి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ అదనపు కార్యదర్శి సభ్యులుగా ఈ కమిటీని నియమిస్తూ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ భార్గవ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
‘ఆరోగ్యశ్రీ’ ప్యాకేజీలు పెంచాలి: ఐఎంఏ
విజయవాడ (గవర్నర్పేట), న్యూస్టుడే: పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీలనూ పెంచాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికృష్ణ డిమాండ్ చేశారు. ఆధునిక చికిత్సల కోసం వినియోగించే పరికరాలు, వ్యాధి నిర్ధారణ పరికరాల ధరలు పెరిగాయని వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి మంగళవారం విజయవాడకు వచ్చిన ఆయన ఐఎంఏ హాల్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ సౌకర్యానికి ప్రస్తుతమున్న 50 పడకల నిబంధనను 20 పడకల వసతి కలిగిన ఆసుపత్రులకూ వర్తింపజేయాలని కోరారు.
‘సమగ్ర గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి’
ఈనాడు, అమరావతి: సమగ్ర గ్రామీణాభివృద్ధికి వీలుగా 2023-24కి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర పంచాయతీరాజ్శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ ప్రేమనగర్ రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఒక రోజు పర్యటన కోసం వచ్చిన ఆయన మంగళవారం కానూరులోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థలో గ్రామీణాభివృద్ధి ప్రణాళికల తయారీపై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే పథకాలను గ్రామీణాభివృద్ధి ప్రణాళిక తయారీలో చేర్చాలి. ప్రత్యేకంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్య, రహదారులు వంటి ముఖ్యమైన అంశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన మొత్తం 17 అంశాల్లో ముఖ్యమైన తొమ్మిదింటికి గ్రామీణాభివృద్ధి ప్రణాళికల తయారీలో అత్యధిక ప్రాధాన్యమివ్వాలి...’ అని ఆయన సూచించారు.
వైద్యులకు ప్రత్యేక బదిలీలు
ఈనాడు-అమరావతి: రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు వైద్యులకు ప్రత్యేక బదిలీలు జరగబోతున్నాయి. ఈ ఏడాది మార్చి/ఏప్రిల్ నెలల్లో సివిల్ సర్జన్ స్పెషలిస్టు, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ ఆర్.ఎం.ఒ. పోస్టులకు పదోన్నతులతో కూడిన బదిలీలు జరిగాయి. అప్పటి ఉత్తర్వులు అనుసరించి వీరికి (ద్వితీయ శ్రేణి గెజిటెడ్) స్థానిక జిల్లాలో పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వీరి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ప్రత్యేక బదిలీలు చేపట్టేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆసక్తి కలిగిన వైద్యుల నుంచి ఇప్పటివరకు వంద వరకు దరఖాస్తులు వచ్చాయి.
ఆయుష్ ఇన్ఛార్జ్ కమిషనర్గా జె.నివాస్
ఈనాడు-అమరావతి: ఆయుష్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కమిషనర్గా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కమిషనర్ కల్నల్ శ్రీరాములు మాతృ సంస్థకు వెళ్లారు.
హేచరీస్ స్థాపనకు 280 ఎకరాలు
ఈనాడు-అమరావతి: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం దిండి గ్రామ పరిధిలోని పారిశవారిపాలెంలో సముద్రతీరాన పండుగప్ప, పీతల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 280 ఎకరాలను కేటాయించింది. ఈ మేరకు భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలపై విద్యార్థులకు శిక్షణ
ఈనాడు-అమరావతి: అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, యూఎస్ కాన్సులేట్ నిర్ణయించినట్లు డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. యూఎస్ కాన్సులేట్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి ఆధ్వర్యంలోని బృందం మంగళవారం డీజీపిని కలిసింది. పాస్పోర్టు, వీసా మోసాలు, మానవ అక్రమ రవాణా తదితర సమస్యలపై ఈ సందర్భంగా చర్చించినట్లు డీజీపీ వివరించారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం పలువురు విద్యార్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తూ పట్టుబడ్డారని, ఈ విషయమై రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించామన్నారు. విశ్వవిద్యాలయాలకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పంపే సమయంలో విద్యార్థులు కొంత రుసుముగా చెల్లించాల్సి వస్తోందని, దీనివల్ల వారిపై అదనపు భారం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని మాఫీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పీజీసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఈనాడు, అమరావతి: ప్రొస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఈనెల 30 నుంచి డిసెంబరు 2, ఆన్లైన్ ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 1-3, వెబ్ఐచ్ఛికాల నమోదు డిసెంబరు 4-6, సీట్ల కేటాయింపు 8న పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
పోర్టు ఏర్పాటుకు సర్వే!
ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్టణం మండలంలో పోర్టు ఏర్పాటు చర్యల్లో భాగంగా 4గ్రామాల సరిహద్దు, బంగాళఖాతానికి మధ్యన ఉన్న సుమారు 1,700 ఎకరాల భూమిని సర్వే చేయబోతున్నారు. మంగినపూడిలో 788.07 ఎకరాలు, తవిసిపూడి- 326.90 ఎకరాలు, గోపువాణిపాలెం-477.12 ఎకరాలు, కర్రఅగ్రహారంలో 138.23 ఎకరాల్లో ఈ సర్వే జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల సంచాలకులు సిద్ధార్థ్జైన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
రూ.386.81 కోట్ల ఉపాధి నిధుల విడుదల
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులకు హాజరయ్యే కూలీలకు వేతనాల చెల్లింపుల నిమిత్తం 2022-23 సంవత్సరానికి ఆరో విడతగా రాష్ట్రానికి రూ.386.81 కోట్లు విడుదలైనట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
461 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ!
రాష్ట్రంలో 461 స్టాఫ్ నర్సుల పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. పూర్తి వివరాలు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సీఎఫ్డబ్ల్యూ వెబ్సైట్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?