అర్హులకు పథకాలు అందడం లేదు
అర్హత ఉన్నప్పటికీ పలువురికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డీఆర్సీ (జిల్లా సమీక్షా మండలి) సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
ఏలూరు డీఆర్సీలో గళమెత్తిన వైకాపా ఎమ్మెల్యేలు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: అర్హత ఉన్నప్పటికీ పలువురికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డీఆర్సీ (జిల్లా సమీక్షా మండలి) సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రవాణాశాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన ఏలూరు కలెక్టరేట్లో బుధవారం డీఆర్సీ సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశంలో వైకాపా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ఏకరవు పెట్టారు. మొత్తం 7 నియోజకవర్గాలకు చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా మినహా మిగిలిన శాసన సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ పింఛను కానుక పథకాల వర్తింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పలు నిబంధనలతో అర్హులైన్పటికీ ఫలాలు అందడం లేదని వివరించారు. మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏలూరు, దెందులూరు, పోలవరం, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
మూడు నెలల్లో రూ.300 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల విలువైన నగదు, వస్తువులు, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
రాష్ట్రంలో దయనీయ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు
రాష్ట్రంలో అయిదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ సూర్యనారాయణ అన్నారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా
వివేకా హత్య అంశంపై కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
30శాతానికి పడిపోయిన విశాఖ ఉక్కు ఉత్పత్తి
విశాఖలోని ‘అదానీ గంగవరం పోర్టు’లో నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం విశాఖ ఉక్కుపై తీవ్రంగా పడుతోంది. -
బెంబేలెత్తిస్తున్న భానుడు
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్లోనే భానుడు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. శుక్రవారం 61మండలాల్లో తీవ్ర వడగాలులు, 117మండలాల్లో వడగాలులు వీచాయి. -
ఆరు నెలల్లో రూ.47 వేల కోట్ల అప్పులకు సిద్ధం
అప్పు తీసుకుంటే తప్ప అడుగు ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్.. కొత్త అప్పులకు ఆమోదం సాధించింది. -
సినర్జీస్ ఛైర్మన్ మొవ్వా శేఖర్ మృతి
పారిశ్రామికవేత్త, దువ్వాడ వీసెజ్లో ఉన్న సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ మొవ్వా శేఖర్ (59) తీవ్ర అస్వస్థతతో మృతి చెందినట్లు పరిశ్రమ వర్గాలు శుక్రవారం తెలిపాయి. -
తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు
డిపాజిట్ల స్వీకరణకు సంబంధించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై హైదరాబాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందున్న కేసును కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబరు 31న ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను సకాలంలో ఇవ్వకుండా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని డీజీపీ, పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.