టీచర్లను దూరం పెట్టడంలో మర్మమేంటి?
పీఆర్సీ సహా వివిధ అంశాల్లో గుర్రుగా ఉన్న టీచర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది.
బోధనేతర విధులకు టీచర్లు వద్దంటూ విద్యాహక్కు చట్టానికి సవరణలు
ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చేయడానికే..
ఈటీవీ ప్రతిధ్వని చర్చలో నిపుణులు
ఈటీవీ, అమరావతి: పీఆర్సీ సహా వివిధ అంశాల్లో గుర్రుగా ఉన్న టీచర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. బోధనేతర పనుల్లో ఉపాధ్యాయులు పాల్గొనరాదంటూ విద్యా హక్కు చట్టం నిబంధనలకు కీలక సవరణలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని శాఖల ఉద్యోగులు పాలొన్న తర్వాత అవసరమైతేనే బోధనేతర పనుల్లో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉండాలని ఆదేశించింది. ఎన్నికలకు టీచర్ల సేవలు అవసరం లేదని పరోక్షంగా సూత్రీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక లోగుట్టు ఏంటి? ఎన్నికల విధుల నుంచి తప్పించడమేనా? అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికల విధుల సంగతి అటుంచి ప్రతిరోజూ చికాకు పెట్టే యాప్ల భారం తొలగించాలంటున్న టీచర్ల వాదనను ఎలా చూడాలి? ఇదే అంశంపై బుధవారం ‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చ చేపట్టింది. ఇందులో పాల్గొన్న ప్రముఖులు ఏమన్నారంటే..
ప్రభుత్వ దుర్బుద్ధి బయటపడింది
-షేక్ సాబ్జీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
చట్టసభల నిర్మాణ ప్రక్రియలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ జరుగుతోంది. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతాయుతంగా.. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అధిగమించి పాల్గొంటున్నారు. విద్యాహక్కు చట్టంలోనూ ఎన్నికల నిర్వహణ, పదేళ్లకు ఓసారి జరిగే జనాభా గణన రెండింటినీ ఉపాధ్యాయులు చేయాలని చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వం తమకున్న అధికారంతో బోధనేతర విధుల పేరిట తొలగించింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహా సవరణలు చేయలేదు. ఉపాధ్యాయులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ప్రభుత్వంపై వారికి ఉన్న అసంతృప్తిని బయటపెడతారనే దుర్బుద్ధితోనే ఇలా చేశారని స్పష్టంగా కనిపిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి రావాలంటే టీచర్లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలనేది ఈ ప్రభుత్వ యోచన. వాస్తవానికి పోలింగ్ కేంద్రాల్లో ఏ ఉపాధ్యాయుడూ ఈవీఎంల దగ్గరకు కూడా వెళ్లరు. అన్నిచోట్లా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు ఆమోదిస్తాయనేది చూడాలి. సరిపడినంత మంది సిబ్బంది లేకపోతే ఉపాధ్యాయులను వినియోగించుకుంటామని చట్టసవరణలో మెలిక పెట్టారు. తమకు అనుకూలమైన వారిని విధుల్లో పెడతారా? వ్యతిరేకులను దూరంగా ఉంచుతారా అనేది చూడాలి. కరోనా సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వల్ల సుమారు 976 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడు డీఏ బకాయిలు చెల్లించలేదు. భవిష్యనిధి (పీఎఫ్) మంజూరులో జాప్యం చేస్తోంది. తెలంగాణతో సమానంగా పీఆర్సీలో ఫిట్మెంట్ ఇవ్వాలన్నా నిరాకరించింది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామనే జీవో ఇవ్వడమేంటి? డీఏ ఎరియర్లు ఎప్పుడిస్తారో తెలియదు. పది నెలలుగా సీపీఎస్ కంట్రిబ్యూషన్ చెల్లించడం లేదు. ఉపాధ్యాయులను, ఉద్యోగులను కించపరిచేలా మంత్రులు మాట్లాడుతున్నారు. ఏ ఉద్యోగీ ప్రభుత్వ చర్యలపై సంతృప్తికరంగా లేరు. టీచర్లను దూరం పెట్టాలనే ఆలోచన నుంచి ప్రభుత్వం బయటపడడం కష్టమే అనుకుంటున్నాను. టీచర్లు ప్రశాంతంగా పాఠాలు చెప్పే పరిస్థితులు ఎక్కడా లేవు. 22 రకాల యాప్ల నిర్వహణ భారంతో సతమతమవుతున్నారు. ప్రధానోపాధ్యాయులు మరింత అవస్థలు పడుతున్నారు. గతంలో బయోమెట్రిక్ హాజరు. ఇప్పుడు ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ యాప్. తర్వాత పిల్లల హాజరుకు ఓ యాప్. మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, గుడ్లు, చిక్కీల వివరాల నమోదుకు ఇంకో యాప్. నాడు-నేడు రికార్డుల నిర్వహణకు మరో యాప్. ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడంతా జాబితా ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని యాప్ల నిర్వహణ బాధ్యత నుంచి ఉపాధ్యాయులను తప్పించి వారిని పూర్తిగా తరగతుల్లో పాఠ్యాంశాల బోధనకే పరిమితం చేయాలి.
టీచర్లకు భయపడే చట్టసవరణ
- నాగరాజు పతకమూరు, సీనియర్ పాత్రికేయుడు
ఉపాధ్యాయులను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. అందుకే చట్టసవరణ తీసుకొచ్చింది. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఉపాధ్యాయులకు అయిదారు రోజులకు మించి పని ఉండదు. విద్యా సంస్థలను ఎన్నికల కోసం ఉపయోగిస్తారు కాబట్టి తరగతులకు సెలవులు ఇస్తుంటారు. అంటే బోధనకు అంతరాయం కలుగుతుందనే సమస్య కూడా లేదు. అయినా ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించడం అంటే వారంతా తమపై ఎంతో ఆగ్రహంగా ఉన్నారని ప్రభుత్వం భయపడుతున్నట్లే కనిపిస్తోంది. ఉపాధ్యాయులను ప్రభుత్వం నిత్యం వేధిస్తోంది. ఆందోళనలు చేస్తుంటే నిర్బంధించి, కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఉపాధ్యాయులపై ఇంతగా కక్ష సాధించిన దాఖలాల్లేవు. మిగిలిన ఉద్యోగుల కంటే టీచర్లు చాలా క్రమశిక్షణగా కర్తవ్యాన్ని పాటిస్తారు. కేవలం రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం ఇలా చేసింది. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించడానికే ఈ తంతు అనే వాదన వాస్తవమనే అంగీకరించాలి. మళ్లీ గెలవడానికి తమకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని వైకాపా చూస్తోంది. సచివాలయ వ్యవస్థలో తాము అనుకున్నవారిని కొన్ని వేల మందిని నియమించామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పుడు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి లబ్ధి పొందాలనే ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు