ఆరోగ్య పథకాలకు యాప్లు
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న చికిత్సల వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రత్యేకంగా యాప్లు రూపొందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ సేవలపైనా రూపొందించండి
అధికారులకు సీఎం జగన్ ఆదేశం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న చికిత్సల వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రత్యేకంగా యాప్లు రూపొందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి? వాటిల్లో ఎన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంది? వాటి లొకేషన్ వంటి వివరాలను తెలుసుకునేలా యాప్ ఉండాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకంపైనా యాప్ను తయారు చేయాలన్నారు. ఈమేరకు గురువారం వైద్యారోగ్య శాఖ పనితీరును సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ప్రస్తుత ఆరోగ్యశ్రీ కార్యాలయ సాఫ్ట్వేర్ మరింత మెరుగుపడాలి. ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏమైనా తప్పులు జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సేవల్లో లోపం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలి. ‘ఫ్యామిలీ డాక్టర్’పై పర్యవేక్షణకు రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయిల్లో అధికారులను నియమించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి. ఆరోగ్య రంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలి. ఈ నంబరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ సంబంధిత గ్రామాలకు వెళ్లినప్పుడు ‘రియల్ టైం డేటా’ను రికార్డు చేయాలి. ఈ పథకం అమలులో మహిళా, శిశు సంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలి. పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను గుర్తించి వివరాలను మహిళా, శిశు సంక్షేమ శాఖకు అందచేయాలి. ఇందుకు అనుగుణంగా పౌష్ఠికాహారం పంపిణీ జరగాలి. ఆరోగ్య శాఖలోని ఆశావర్కర్ స్థాయి వరకు ట్యాబులు/సెల్ఫోన్లను పంపిణీ చేయాలి. వచ్చే ఉగాది నాటికి విలేజ్ క్లినిక్కుల నిర్మాణాలు పూర్తి చేయాలి’ అని స్పష్టంచేశారు.
7.86 లక్షల మందికి సేవలు: అధికారులు
ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు కొత్తగా 260 అంబులెన్సులు ఈ నెలలోనే అందుబాటులోనికి రానున్నాయి. ఈ పథకం ద్వారా నవంబరులో 7,166 విలేజ్ క్లినిక్కులకు రెండుసార్లు చొప్పున, 2,866 క్లినిక్కులకు ఒకసారి చొప్పున వాహనం వెళ్లింది. నెల రోజుల వ్యవధిలో 7,86,226 మందికి సేవలు అందాయి. వీరిలో రక్తపోటులో బాధపడేవారు 1,78,387 మంది, చక్కెర వ్యాధి బాధితులు 1,25,948 మంది ఉన్నట్లు గుర్తించాం. వీరందరికీ ఉచితంగా మందుల పంపిణీ జరుగుతోంది. పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీల్లోని పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనతను గుర్తించి... చికిత్స అందిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ పథకం అమలులో సిబ్బంది భాగస్వామ్యం పెరిగింది’ అని సీఎం జగన్కు అధికారులు వివరించారు. సమావేశంలో మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు
తలా రూ.500 నోటు. మగవారికి మద్యం సీసా. బిర్యానీ పొట్లం. ఊరూరా జనాన్ని తరలించేందుకు 1,200 బస్సులు. -
మండుతున్న ఆంధ్రప్రదేశ్.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. -
త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన
ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు కోటి చినరాజు, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య వాపోయారు. -
‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి
ఎన్నికల ప్రచారానికి విశాఖ జిల్లా పద్మనాభం వచ్చిన వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలకు మంగళవారం రాత్రి విచిత్ర పరిస్థితి ఎదురైంది. -
డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు
స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
సివిల్స్లో ర్యాంకు సాధించిన మాజీ కానిస్టేబుల్
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
వేకువనే పోలీసు పంజా
పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
జగన్ హయాంలో పెరిగిన శిరోముండనం ఘటనలు
జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని శిరోముండనం ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. -
ఏపీఈఏపీ సెట్కు 3,54,235 దరఖాస్తులు
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
వెబ్సైట్లో పాలిసెట్ హాల్టికెట్లు
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు హాల్టికెట్లు బుధవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
కొయ్.. రాజా.. కొయ్!
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట. -
క్షేత్రస్థాయికి ఎన్నికల నిఘా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసేందుకు పనిచేస్తున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) సంస్థను క్షేత్రస్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
చర్మకారులకు ఏమిటీ ఖర్మ?
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్