భూములు లాక్కుంటే ఉరే!
జీవనాధారమైన భూములు లాక్కుంటే తమకు మిగిలేది ఉరేనని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గిరిజన రైతులు గురువారం ఆందోళన చేశారు.
అనంతగిరి, న్యూస్టుడే: జీవనాధారమైన భూములు లాక్కుంటే తమకు మిగిలేది ఉరేనని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గిరిజన రైతులు గురువారం ఆందోళన చేశారు. చెట్లకు ఉరేసుకున్నట్లుగా వేలాడుతూ వినూత్న నిరసన తెలిపారు. కోనేల, బూరుగ తదితర గ్రామాల్లోని భూములను కొందరు గిరిజనేతర పెద్దలు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఆయా గ్రామాల్లో సుమారు 200 జనాభా ఉండగా, 90 ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. వీటిని లాక్కునేందుకు బడాబాబులు యత్నిస్తుండగా, రెవెన్యూ సిబ్బందీ వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Whatsapp: వాట్సప్.. ఇక చిటికెలో ఫాంట్ను మార్చుకోవచ్చు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
-
Ap-top-news News
AP Constable Exam: అభ్యర్థుల గోడు వినండి.. మొదటి కీలో ఒకలా.. తుది కీలో మరోలా!
-
India News
ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు: ప్రముఖ హృద్రోగ నిపుణుడి వ్యాఖ్యలు
-
India News
NEET PG 2023: ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్షిప్ కటాఫ్ గడువు పెంపు