Nara Brahmani: లద్దాఖ్‌లో నారా బ్రాహ్మణి బైక్‌ యాత్ర

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఇటీవల లద్దాఖ్‌లో బైక్‌ యాత్ర చేశారు. అక్కడి పర్వత సానువుల్లో మోటారు సైకిల్‌పై ఆమె దూసుకెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

Updated : 02 Dec 2022 08:05 IST

ఈనాడు, అమరావతి: హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఇటీవల లద్దాఖ్‌లో బైక్‌ యాత్ర చేశారు. అక్కడి పర్వత సానువుల్లో మోటారు సైకిల్‌పై ఆమె దూసుకెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. యువ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈఓలు సభ్యులుగా ఉన్న యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (వైపీఓ) ఇటీవల ‘ద లడక్‌ క్వెస్ట్‌’ పేరుతో నిర్వహించిన సాహస యాత్రలో బ్రాహ్మణి పాల్గొన్నట్టు సమాచారం.

బ్రాహ్మణి పసుపురంగు బైక్‌ నడిపారు. యాత్రపై ‘జావా యెడ్జీ మోటార్‌ సైకిల్స్‌’ పేరుతో ఒక లఘుచిత్రాన్ని వైపీఓ రూపొందించింది. యాత్రలోని వారంతా తమ అనుభవాల్ని వివరించారు. ‘‘ఇప్పుడు ఉదయం 6.30 గంటలైంది. లద్దాఖ్‌ చాలా అద్భుతంగా, అందంగా ఉంది. ఇప్పుడు మేం థక్‌సే ఆరామానికి బయల్దేరుతున్నాం. మేం అసలు సిసలు ఆధ్యాత్మిక అనుభవం కోసం ఎదురు చూస్తున్నాం. అక్కడ ధ్యానం చేస్తాం’’ అని బ్రాహ్మణి అందులో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని