సీఎం జగన్‌ను కలిసిన సీఎస్‌ జవహర్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 02 Dec 2022 05:04 IST

సమీర్‌శర్మ, పూనం మాలకొండయ్య కూడా..

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా, ముఖ్యమంత్రికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పూనం మాలకొండయ్య కూడా సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీఅయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని