నీటి లెక్క తేలుతుందా?
కృష్ణా బేసిన్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకొనేందుకు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) తుది సమావేశం శనివారం జరగనుంది.
నేడు శ్రీశైలం, సాగర్ నిర్వహణపై ఆర్ఎంసీ సమావేశం
ఈనాడు హైదరాబాద్: కృష్ణా బేసిన్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకొనేందుకు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) తుది సమావేశం శనివారం జరగనుంది. కృష్ణా నదీ యాజమాన్యబోర్డులో కీలక అధికారి రవికుమార్ పిళ్లై నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల, జెన్కో చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. పవర్హౌస్ల నిర్వహణ, వరద నీటి వినియోగం, రిజర్వాయర్ల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకొనేందుకు ఆరు నెలల క్రితం బోర్డు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు అయిదు సమావేశాలు జరగ్గా, ఆరో సమావేశం 3వ తేదీన జరగనుంది. గత సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకాలేదు. ఈ చివరి సమావేశానికీ హాజరుకాని పక్షంలో ఓ అభిప్రాయానికి రాలేకపోయామని బోర్డుకు నివేదించే అవకాశం ఉంది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న పిళ్లై సమావేశంలో చర్చించాల్సిన విద్యుదుత్పత్తి, రూల్కర్వ్, వరద నీటి వినియోగం, నీటిమట్టాల నిర్వహణపై ముసాయిదాను ఇప్పటికే రెండు రాష్ట్రాల అధికారులకు పంపారు. దీని ప్రకారం జులై 1 నుంచి అక్టోబరు 31 వరకు శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు పైనే ఉండాలి. మిగిలిన సమయంలో విద్యుత్తు అవసరాలకు తగ్గట్లుగా దిగువన నీటిని తీసుకోవచ్చు... కానీ తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ 815 అడుగుల కంటే దిగువకు నీటిని తీసుకోకూడదు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండి గేట్లు ఎత్తినపుడు తీసుకొనే నీటిని మిగులు జలాలుగా పరిగణిస్తారు. వీటిని వివిధ రిజర్వాయర్లకు మళ్లించవచ్చు. ఈ నీటిని ఏ రాష్ట్రం ఎంత మళ్లించిందీ లెక్కల్లోకి తీసుకొంటారు. శ్రీశైలం, నాగార్జునసాగర్లో పవర్హౌస్ల నిర్వహణపై కూడా పలు కీలక ప్రతిపాదనలు ముసాయిదాలో ఉన్నాయి. దిగువన సాగు, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయాలని ప్రతిపాదించింది. శ్రీశైలంలో ఉన్న రివర్సబుల్ టర్బైన్స్ వల్ల ఎడమగట్టు విద్యుత్తు కేంద్రంలో 13 శాతం నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని, దిగువన ఒక టీఎంసీ నీరు అవసరమైతే ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 0.531 టీఎంసీ, కుడివైపు నుంచి 0.469 టీఎంసీ నీటితో విద్యుదుత్పత్తి జరుగుతుందని పేర్కొంది. ఈ అంశాలపై రెండు రాష్ట్రాలు అంగీకరించి సంతకాలు చేస్తే అమలులోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
వైకాపా ఎన్నికల ప్రచారం చేసిన ఆర్టీసీ వైఎస్ఆర్ యూనియన్ నేత!
ఆర్టీసీలోని వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తన పుట్టినరోజు వేడుక పేరిట కార్యక్రమం నిర్వహించి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. -
సంక్షిప్త వార్తలు
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె