తెలంగాణకు అమరరాజా
ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.
లిథియం అయాన్ బ్యాటరీల గిగా కర్మాగారం, పరిశోధన కేంద్రం ఏర్పాటు
రూ.9,500 కోట్ల పెట్టుబడి.. 4,500 మందికి ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
అన్ని విధాలా అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం: గల్లా జయదేవ్
ఈనాడు, హైదరాబాద్: ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. మహబూబ్నగర్లోని దివిటిపల్లి పారిశ్రామిక పార్కులో రూ.9,500 కోట్ల పెట్టుబడులతో దీనిని స్థాపించి, ప్రత్యక్షంగా 4,500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ తరఫున ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గల్లా జయదేవ్, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, అమరరాజా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేనిలు ఒప్పందంపై సంతకాలు చేశారు. త్వరలోనే కర్మాగారానికి శంకుస్థాపన చేస్తామని, రెండేళ్లలో మొదటి దశ పూర్తిచేసి ఉత్పత్తులను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ వెల్లడించారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం సంచాలకుడు సుజయ్ కారంపురి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, అమరరాజా విద్యుత్ విభాగం అధ్యక్షుడు సముద్రాల విజయానంద్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్తూరు బయట తొలి కర్మాగారమిదే
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గల్లా జయదేవ్ మాట్లాడారు. ‘‘ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 37 సంవత్సరాలుగా అమరరాజా పరిశ్రమలు నడుస్తున్నాయి. దాని బయట ఏర్పాటుచేయబోయే మొదటి పరిశ్రమ గిగా కారిడార్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. పెట్టుబడులకు తెలంగాణ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతం. ఈ రాష్ట్రంతో ఎప్పట్నుంచో అనుబంధం ఉంది. మా కార్పొరేటు కార్యాలయం హైదరాబాద్లోనే ఉంది. ఈ సర్కార్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. గత ఏడాది రూపొందించుకున్న ‘ఎనర్జీ అండ్ మొబిలిటీ’ రోడ్ మ్యాప్నకు అనుగుణంగానే తాజా ముందడుగు వేశాం. ఎనర్జీ అండ్ మొబిలిటీలో భవిష్యత్ సాంకేతికతల కోసం ఆర్అండ్డి, ఇంక్యుబేషన్, టెస్టింగ్, తయారీలతో కూడిన గిగా కారిడార్తో పటిష్ఠ భారతీయ పర్యావరణ వ్యవస్థ (ఎకోసిస్టమ్)ను అభివృద్ధి చేయాలనేది మా ఆకాంక్ష.
ఇక్కడి యువతకు ఉపాధి
నూతన సాంకేతికతతో ఏర్పాటుకాబోయే బ్యాటరీల తయారీ యూనిట్ అందరి ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నాం. పదేళ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా వెంటనే నిర్మాణ పనులు చేపడతాం. తద్వారా కర్మాగార సమీపంలోని గ్రామీణులతోపాటు రెండు, మూడో తరగతి పట్టణాల్లో వలసలను నివారించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తాం.
ఇతర సంస్థలకూ ఉపయోగకరం
శంషాబాద్ వద్ద ఏర్పాటయ్యే సాంకేతిక కేంద్రం మెటీరియల్ రీసెర్చ్, ప్రొటోటైపింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనాలిసిస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డిమాన్స్ట్రేషన్ కోసం అధునాతన ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతులను కలిగిఉంటుంది. విద్యుత్, వాహన రంగాల్లోని సంస్థలకు పలు రకాల సదుపాయాలను అందిస్తుంది. ఇప్పటికే అమరరాజా ఇ-హబ్ను ఏర్పాటుచేసింది. ఆసక్తి ఉన్న ఇతర సంస్థలతో కలసి ఇది పని చేస్తుంది. గత నెల 3న అమర రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటుచేసి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం.
చిత్తూరులోని పరిశ్రమలు యథాతథం
తెలంగాణలో కొత్త పరిశ్రమ ప్రారంభించినా...ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మా పరిశ్రమలు యథాతథంగా కొనసాగుతాయి. ఏపీతో పారిశ్రామిక అనుబంధం కొనసాగుతుంది. అక్కడ ఉన్న అమరరాజా పరిశ్రమల వద్ద ఎలాంటి కాలుష్య సమస్యల్లేవు. పరిశ్రమలు నిర్వహిస్తున్న స్థలంలోనే ఎప్పటి నుంచో మా కుటుంబం నివసిస్తోంది. అక్కడ కాలుష్యం ఉంటే మా కుటుంబంపైనే ఆ ప్రభావం పడేది. పరిశ్రమల వద్ద కాలుష్య సమస్యలు లేకుండా మేము ముందే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం’’ అని జయదేవ్ తెలిపారు.
ఎనిమిదేళ్ల కృషి ఫలించింది: మంత్రి కేటీఆర్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తమ ఎనిమిదేళ్ల కృషి ఇప్పటికి ఫలించిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన గల్లా జయదేవ్కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘అమరరాజాకు గొప్ప చరిత్ర ఉంది. జయదేవ్ నాకు సన్నిహితుడు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇక్కడ పరిశ్రమను స్థాపించాలని కోరుతున్నా. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇప్పటికే తెలంగాణ విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానం తెచ్చింది. ఈ రంగంలో భారీ పెట్టుబడులను సమీకరిస్తోంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో అభివృద్ధికి, గామీణ ప్రాంత యువతకు ఉపాధికి ఊతమివ్వడంతోపాటు దేశంలో ఈవీ విప్లవానికి నాంది పలుకుతుందని’’ కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ కోరిక మేరకే
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఇప్పటికి ఆ ప్రయత్నం ఫలించింది. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి గిరాకీ ఉంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలను విశ్లేషించాం. ఈవీ వాహనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఒప్పందం అమరరాజాకు కీలక ముందడుగు.
అత్యాధునిక సాంకేతికతతో కర్మాగారం
తెలంగాణలో నెలకొల్పబోయే పరిశ్రమ 16 జీడబ్ల్యూహెచ్ లిథియం సెల్, 5 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ యూనిట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దానికి అనుబంధంగా ఆధునిక అభివృద్ధి, పరిశోధన కేంద్రం ఉంటుంది. శంషాబాద్ వద్ద రూ.800 కోట్లతో సాంకేతిక కేంద్రాన్నీ ఏర్పాటుచేస్తాం. అందులో 800 మందికి ఉపాధి కల్పిస్తాం.
- గల్లా జయదేవ్, సీఎండీ, అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్
ఈవీ తయారీ హబ్గా రాష్ట్రం
దేశంలోనే తొలి లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని తెలంగాణలో నెలకొల్పడం జయదేవ్ దార్శనికతకు నిదర్శనం. ఈ పరిశ్రమ పెట్టుబడుల పరంగానేగాక అత్యాధునిక సెల్ సాంకేతికతలోనూ దేశంలో మొదటిది. తెలంగాణ ఈవీ తయారీ హబ్గా మారేందుకు అమరరాజా కర్మాగారం దోహద పడుతుంది.
- మంత్రి కేటీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!