Ap High Court: పాత్రికేయుడు అంకబాబుపై కేసులో సీఐడీకి హైకోర్టు షాక్
సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై నమోదు చేసిన కేసులో సీఐడీకి హైకోర్టు గట్టి షాకిచ్చింది.
ఎఫ్ఐఆర్ కొట్టివేత
సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని స్పష్టీకరణ
రెండు గ్రూపుల మధ్య విద్వేషం కలిగించలేదని వెల్లడి
ఈనాడు, అమరావతి: సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై నమోదు చేసిన కేసులో సీఐడీకి హైకోర్టు గట్టి షాకిచ్చింది. నమోదు చేసిన సెక్షన్లు ఆయన విషయంలో వర్తించవని స్పష్టం చేసింది. రెండు గ్రూపుల మధ్య విద్వేషం రేకెత్తించిన ప్రస్తావనే లేదంది. పిటిషనర్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అని చెబుతున్న దాని వల్ల సీఎం కార్యాలయ సిబ్బంది, ఇతర వ్యక్తులకు దురభిప్రాయం/ద్వేషం (ఇల్విల్) లేదా పగ పెంపునకు కారణం అయ్యింది అనుకున్నప్పటికీ.. ఈ విషయంలో సెక్షన్ 153ఏ, 505ఏ వర్తించదని తేల్చి చెప్పింది. అసలు రెండు గ్రూపుల ప్రస్తావనే లేదంది. సీఎంవో కార్యాలయానికి వ్యతిరేకంగా దురభిప్రాయం సృష్టించడం.. రెండు గ్రూపుల మధ్య దురభిప్రాయం లేదా ద్వేషం కలిగించడం కిందకు రాదంది. ఒకవేళ రెండు గ్రూపుల మధ్య విద్వేషం కలిగించారనుకున్నా.. ఇక్కడ అ సెక్షన్ వర్తించదని తెలిపింది. ఎందుకంటే ఇది మతం, తెగల మధ్య శతృత్వం పెంచిన వ్యవహారం కాదంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 153ఏ, 505ఎలు వర్తించవని పేర్కొంది. ఆ రెండు సెక్షన్లు వర్తించకపోతే అసలు 120బి వర్తించే ప్రశ్నే ఉత్పన్నం కాదంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్రావు శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సప్ గ్రూపులో ఫార్వర్డ్ చేశారనే ఆరోపణలతో అందిన ఫిర్యాదు ఆధారంగా 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై సీఐడీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఎంవో కార్యాలయ మేనేజరు తిరుపతి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ అంకబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది టి.శ్రీధర్ వాదనలు వినిపిస్తూ... ‘ఐపీసీ సెక్షన్ 153(ఎ), 505(ఎ) రెడ్విత్ 120బి కింద కేసు నమోదు చేశారు. వివిధ గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. పిటిషనర్పై నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. ఫిర్యాదులోని ఆరోపణలు, రిమాండ్ రిపోర్టులోని అంశాలేవి సెక్షన్ 153ఏ, 505(ఎ) కిందకు రావు. ఇతరులతో కలిసి పిటిషనర్ కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలే లేవు. ఈ నేపథ్యంలో సెక్షన్ 120బి కింద నమోదు చేసిన సెక్షన్ చెల్లదు...’ అని పేర్కొన్నారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు.
సెక్షన్ల మధ్య వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
‘సహజంగా దర్యాప్తు ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి అయిష్టత చూపుతుంది. ఫిర్యాదులోని అంశాలు, దర్యాప్తులో తేలిన అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేసేందుకు జోక్యం చేసుకోవచ్చు. సెక్షన్ 153ఏ, 505ఏ కింద నేరానికి పాల్పడినట్లు తేలితేనే ఐపీసీ సెక్షన్ 120బీని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 153ఏ, 505ఏ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 153ఏ కింద నేరానికి పాల్పడినట్లు నిర్ధారించాలంటే నిందితుడు.. మాటలు లేదా రాతపూర్వకంగా, ఇతర పద్ధతుల్లో వివిధ మతాలు, కులాలు, తెగలు, గ్రూపుల మధ్య శతృత్వం పెంచేలా ఉండాలి. సామరస్యాన్ని దెబ్బతీసేదిగా ఉండాలి. సెక్షన్ 153ఏలోని ఉప క్లాజులు ఏ,బీ,సీల కింద నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు గ్రూపుల మధ్య విరోధానికి కారణమై ఉండాలి. ఒక గ్రూపుపై దురభిప్రాయం/ద్వేషం కలిగి ఉంటే మాత్రం ఈ సెక్షన్ వర్తించదు. విరోధం పెంచాలన్న ఉద్దేశంతో చేసిన పని అయిఉండాలి. కేవలం మతాలు, తెగలు, భాష, కులాల మధ్య శతృత్వానికి దారి తీసినప్పుడు మాత్రమే ఆ సెక్షన్లు వర్తిస్తాయి...’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. సీఐడీ ప్రత్యేక పీపీ శివకల్పనరెడ్డి వాదనలు వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
అశుతోష్ అదరగొట్టినా.. ఉత్కంఠ పోరులో ముంబయిదే విజయం
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య