వీఏకే రంగారావు, సుజాతారెడ్డిలకు విశిష్ట పురస్కారాలు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

Updated : 03 Dec 2022 05:39 IST

తెలుగువర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రదానం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని వర్సిటీ ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన కార్యక్రమంలో 2020 సంవత్సరానికి ప్రముఖ సాహితీవేత్త, రచయిత డా.ముదిగంటి సుజాతారెడ్డి... 2021 సంవత్సరానికి సంగీత, సాహిత్య, నృత్య కళావిమర్శకులు, బొబ్బిలి జమీందారు వంశీయులైన వీఏకే రంగారావులకు విశిష్ట పురస్కారాలు అందజేశారు. రూ.లక్ష చొప్పున నగదు, ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో వారిని ఘనంగా సత్కరించారు. తెలుగువర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షత వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని