కోడుమూరు ఎమ్మెల్యే మోసం చేశారు
కర్నూలులో ఓ స్థలం వ్యవహారంలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయితీ చేస్తానంటూ తమకు తెలియకుండానే వేరేవారికి అమ్మి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రూ.10 కోట్ల భూమి సెటిల్ చేస్తానంటూ అమ్మేశారు
కర్నూలుకు చెందిన వజహద్ అలీ, ఇమ్రాన్ల ఆరోపణ
ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు తీసేశారంటూ ఆవేదన
ఈనాడు, కర్నూలు: కర్నూలులో ఓ స్థలం వ్యవహారంలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయితీ చేస్తానంటూ తమకు తెలియకుండానే వేరేవారికి అమ్మి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులను, న్యాయస్థానాన్ని ఇప్పటికే ఆశ్రయించామని, తమకు ప్రాణహాని ఉందని వాపోతున్నారు. జరిగిన మోసాన్ని ‘ఈనాడు-ఈటీవీ’తో మొర పెట్టుకున్నారు.
కర్నూలుకు చెందిన బాధితులు వజహద్ అలీ, ఇమ్రాన్ తెలిపిన వివరాల మేరకు... కర్నూలు మండలం మామిదాలపాడు పరిధిలోని సర్వే నంబరు 203-సి1ఏ1లో 93 సెంట్ల స్థలం ఉంది. దీన్ని ఇర్షాద్, మరో నలుగురికి రూ.7.50 కోట్లకు అమ్మేందుకు 2020 సెప్టెంబరులో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో కొంత మొత్తం ఇచ్చారు. రిజిస్ట్రేషన్కు ముందే ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో రద్దు చేసుకోవాలనుకున్నట్లు బాధితులు తెలిపారు. ఎగ్రిమెంట్ చేసుకున్న ఇర్షాద్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి, భూమి రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని తమపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని వాపోయారు. దీంతో తాము కోడుమూరు ఎమ్మెల్యేను ఆశ్రయించామని, అక్కడే అసలు కథ మొదలైందని చెబుతున్నారు.
కమీషన్కు భరోసాగా అగ్రిమెంట్
‘పంచాయితీ చేసినందుకు రూ.30లక్షలు కమీషన్ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. అందుకు భరోసాగా ఏదైనా స్థలం ఇవ్వాలన్నారు. దీంతో ఉలిందకొండలో ఉన్న 96సెంట్ల స్థలాన్ని సేల్డీడ్ చేశాం. ఇర్షాద్ బృందం ముందుగా చెల్లించిన రూ.4.20 కోట్లకు మరో రూ.2.35 కోట్లు కలిపి మొత్తం రూ.6.55 కోట్లు తిరిగి ఇచ్చేలా ఎమ్మెల్యే సుధాకర్, 38 వార్డు కార్పొరేటర్ గిప్సన్తో కలిసి పంచాయితీ చేశారు. లాక్డౌన్ సమయంలో డబ్బులు సమకూరకపోవడంతో ఎమ్మెల్యేను మూడు నెలలు గడువు కావాలని కోరారు. ఇర్షాద్ బృందానికి కట్టాల్సిన నగదును వడ్డీకి ఇప్పించి, ఏడాది సమయం ఇస్తానంటూ ఫుల్ రిజిస్ట్రేషన్ చేయించాలని ఎమ్మెల్యే తెలిపారు. 2021 జులై 15న ఆయన అనుచరులైన రఘునాథ్రెడ్డి, రవికుమార్ పేర్లపై సాయంత్రం 6.30కి హడావుడిగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇర్షాద్ బృందానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా.. మొత్తం భూమిని ఇర్షాద్ బృందంలోని నలుగురి పేర్లతో 2021 జులై 30న రిజిస్ట్రేషన్ చేయించారు’ అని తెలిపారు. ఇందులో సుమారు రూ.3.50 కోట్లు ఎమ్మెల్యే జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు.
ఫిర్యాదు చేస్తే పేరు తప్పించారు
రూ.10 కోట్ల స్థలాన్ని సెటిల్మెంట్ పేరుతో అమ్మేసి, ఎమ్మెల్యే మోసం చేసినట్లు తొలుత గతంలో పనిచేసిన ఎస్పీ సుధీర్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశామని వజహద్ అలీ, ఇమ్రాన్ తెలిపారు. హైకోర్టులో వేసిన పిటిషన్లోనూ ఎమ్మెల్యే పేరు పెట్టామన్నారు. తాలూకా స్టేషన్లో 2022 జులై 30న ఫిర్యాదుచేయగా ఎమ్మెల్యే పేరు తీసేసి మిగిలినవారిపై ఎఫ్ఐఆర్ చేశారన్నారు. అనంతరం కేసును పక్కన పెట్టేశారన్నారు. ఇదే సమయంలో స్థలంతో తనకు సంబంధం లేదని, రూ.4.20 కోట్లు అప్పుగా ఇచ్చానని, మొత్తం వడ్డీతో చెల్లించాలంటూ ఇర్షాద్.. న్యాయస్థానంలో తమపై పిటిషన్ వేశారన్నారు.
నేను సెటిల్మెంట్ చేయలేదు
నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నేను సెటిల్మెంట్ చేయలేదు. అగ్రిమెంట్ చేయడం, ఆపై రద్దు చేయడం.. ఇలా రెండుసార్లు చేసి మూడోసారి స్టేషన్లో కేసు పెట్టారు. ఆ సమయంలో ఇమ్రాన్ నా దగ్గరకు వచ్చారు. సమయం ఇస్తే సెటిల్మెంట్ చేసుకుంటామని కోరారు. నష్టపోతున్నామని బాధపడితే సాయం చేద్దామని అనుకుని, తర్వాత ఎవరెవరో మధ్యవర్తులు కలగజేసుకోవడంతో నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సుధాకర్, కోడుమూరు ఎమ్మెల్యే
మాకు ప్రాణహాని ఉంది
కర్నూలులో ఉన్నత కుటుంబాల్లో మాది ఒకటి. ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది. న్యాయం కోసం వెళ్తే ఎమ్మెల్యే మమ్మల్నే మోసం చేశారు. గత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. హైకోర్టులో పిటిషన్ వేయడంతోపాటు, రిజిస్ట్రేషన్ రద్దుచేయాలని జిల్లా కోర్టులో కేసు వేశాం.
వజహద్ అలీ, ఇమ్రాన్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్పుర్కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్పై మండిపడుతున్న ఫ్యాన్స్!