కోడుమూరు ఎమ్మెల్యే మోసం చేశారు
కర్నూలులో ఓ స్థలం వ్యవహారంలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయితీ చేస్తానంటూ తమకు తెలియకుండానే వేరేవారికి అమ్మి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రూ.10 కోట్ల భూమి సెటిల్ చేస్తానంటూ అమ్మేశారు
కర్నూలుకు చెందిన వజహద్ అలీ, ఇమ్రాన్ల ఆరోపణ
ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు తీసేశారంటూ ఆవేదన
ఈనాడు, కర్నూలు: కర్నూలులో ఓ స్థలం వ్యవహారంలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయితీ చేస్తానంటూ తమకు తెలియకుండానే వేరేవారికి అమ్మి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులను, న్యాయస్థానాన్ని ఇప్పటికే ఆశ్రయించామని, తమకు ప్రాణహాని ఉందని వాపోతున్నారు. జరిగిన మోసాన్ని ‘ఈనాడు-ఈటీవీ’తో మొర పెట్టుకున్నారు.
కర్నూలుకు చెందిన బాధితులు వజహద్ అలీ, ఇమ్రాన్ తెలిపిన వివరాల మేరకు... కర్నూలు మండలం మామిదాలపాడు పరిధిలోని సర్వే నంబరు 203-సి1ఏ1లో 93 సెంట్ల స్థలం ఉంది. దీన్ని ఇర్షాద్, మరో నలుగురికి రూ.7.50 కోట్లకు అమ్మేందుకు 2020 సెప్టెంబరులో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో కొంత మొత్తం ఇచ్చారు. రిజిస్ట్రేషన్కు ముందే ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో రద్దు చేసుకోవాలనుకున్నట్లు బాధితులు తెలిపారు. ఎగ్రిమెంట్ చేసుకున్న ఇర్షాద్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి, భూమి రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని తమపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని వాపోయారు. దీంతో తాము కోడుమూరు ఎమ్మెల్యేను ఆశ్రయించామని, అక్కడే అసలు కథ మొదలైందని చెబుతున్నారు.
కమీషన్కు భరోసాగా అగ్రిమెంట్
‘పంచాయితీ చేసినందుకు రూ.30లక్షలు కమీషన్ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. అందుకు భరోసాగా ఏదైనా స్థలం ఇవ్వాలన్నారు. దీంతో ఉలిందకొండలో ఉన్న 96సెంట్ల స్థలాన్ని సేల్డీడ్ చేశాం. ఇర్షాద్ బృందం ముందుగా చెల్లించిన రూ.4.20 కోట్లకు మరో రూ.2.35 కోట్లు కలిపి మొత్తం రూ.6.55 కోట్లు తిరిగి ఇచ్చేలా ఎమ్మెల్యే సుధాకర్, 38 వార్డు కార్పొరేటర్ గిప్సన్తో కలిసి పంచాయితీ చేశారు. లాక్డౌన్ సమయంలో డబ్బులు సమకూరకపోవడంతో ఎమ్మెల్యేను మూడు నెలలు గడువు కావాలని కోరారు. ఇర్షాద్ బృందానికి కట్టాల్సిన నగదును వడ్డీకి ఇప్పించి, ఏడాది సమయం ఇస్తానంటూ ఫుల్ రిజిస్ట్రేషన్ చేయించాలని ఎమ్మెల్యే తెలిపారు. 2021 జులై 15న ఆయన అనుచరులైన రఘునాథ్రెడ్డి, రవికుమార్ పేర్లపై సాయంత్రం 6.30కి హడావుడిగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇర్షాద్ బృందానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా.. మొత్తం భూమిని ఇర్షాద్ బృందంలోని నలుగురి పేర్లతో 2021 జులై 30న రిజిస్ట్రేషన్ చేయించారు’ అని తెలిపారు. ఇందులో సుమారు రూ.3.50 కోట్లు ఎమ్మెల్యే జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు.
ఫిర్యాదు చేస్తే పేరు తప్పించారు
రూ.10 కోట్ల స్థలాన్ని సెటిల్మెంట్ పేరుతో అమ్మేసి, ఎమ్మెల్యే మోసం చేసినట్లు తొలుత గతంలో పనిచేసిన ఎస్పీ సుధీర్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశామని వజహద్ అలీ, ఇమ్రాన్ తెలిపారు. హైకోర్టులో వేసిన పిటిషన్లోనూ ఎమ్మెల్యే పేరు పెట్టామన్నారు. తాలూకా స్టేషన్లో 2022 జులై 30న ఫిర్యాదుచేయగా ఎమ్మెల్యే పేరు తీసేసి మిగిలినవారిపై ఎఫ్ఐఆర్ చేశారన్నారు. అనంతరం కేసును పక్కన పెట్టేశారన్నారు. ఇదే సమయంలో స్థలంతో తనకు సంబంధం లేదని, రూ.4.20 కోట్లు అప్పుగా ఇచ్చానని, మొత్తం వడ్డీతో చెల్లించాలంటూ ఇర్షాద్.. న్యాయస్థానంలో తమపై పిటిషన్ వేశారన్నారు.
నేను సెటిల్మెంట్ చేయలేదు
నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నేను సెటిల్మెంట్ చేయలేదు. అగ్రిమెంట్ చేయడం, ఆపై రద్దు చేయడం.. ఇలా రెండుసార్లు చేసి మూడోసారి స్టేషన్లో కేసు పెట్టారు. ఆ సమయంలో ఇమ్రాన్ నా దగ్గరకు వచ్చారు. సమయం ఇస్తే సెటిల్మెంట్ చేసుకుంటామని కోరారు. నష్టపోతున్నామని బాధపడితే సాయం చేద్దామని అనుకుని, తర్వాత ఎవరెవరో మధ్యవర్తులు కలగజేసుకోవడంతో నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సుధాకర్, కోడుమూరు ఎమ్మెల్యే
మాకు ప్రాణహాని ఉంది
కర్నూలులో ఉన్నత కుటుంబాల్లో మాది ఒకటి. ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది. న్యాయం కోసం వెళ్తే ఎమ్మెల్యే మమ్మల్నే మోసం చేశారు. గత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. హైకోర్టులో పిటిషన్ వేయడంతోపాటు, రిజిస్ట్రేషన్ రద్దుచేయాలని జిల్లా కోర్టులో కేసు వేశాం.
వజహద్ అలీ, ఇమ్రాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు