బై.. బై.. ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం, వెళ్లిపోయేవరకూ పొగపెట్టడంతో చివరకు అమరరాజా చిత్తూరు జిల్లాలో తమ పరిశ్రమ విస్తరణ ఆలోచనను విరమించుకుంది.
రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్న పరిశ్రమలు
విధానాల లోపమే ప్రధాన కారణం
ఈటీవీ ప్రతిధ్వని చర్చలో నిపుణులు
ఈటీవీ, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం, వెళ్లిపోయేవరకూ పొగపెట్టడంతో చివరకు అమరరాజా చిత్తూరు జిల్లాలో తమ పరిశ్రమ విస్తరణ ఆలోచనను విరమించుకుంది. ఒక్క అమరరాజాయే కాదు... గతంలో లులూ, ఫాక్స్కాన్, జాకీ, రిలయన్స్ ఇలానే రాష్ట్రాన్ని వీడాయి. పెద్ద కంపెనీలు ఎందుకు ఆంధ్రాను వీడుతున్నాయి? ఈ పరిణామాలతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టమేమిటనే అంశంపై శనివారం ‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చ చేపట్టింది. ఇందులో పాలొన్న నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
పారిశ్రామిక విధానంలో దార్శనికత లోపం
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలోనే లోపం ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక విధానంలో దాదాపు ఏడాదికిపైగా స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలను తమకు అవకాశం కల్పించాలని వేడుకునే కాలం పోయింది. ఏ పారిశ్రామికవేత్త అయినా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారిపోతుంటే పెట్టుబడులకు వెనుకాముందూ ఆలోచిస్తారు. రాష్ట్రంలో పన్నులు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధర ఇతర రాష్ట్రాల కంటే రెండు రూపాయలు ఎక్కువ. దీని ప్రతికూల ప్రభావం చాలా ఉంటుంది. ఏ రాష్ట్రం ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తోంది? రాజకీయంగా, మౌలిక సదుపాయాలపరంగా తమకు అనుకూల వాతావరణం ఉందా? అని ఎవరైనా ఆలోచిస్తారు. పారిశ్రామికవేత్తలను తమకు అవి కావాలి, ఇవి కావాలి, తాము చెప్పింది చేయాలనే షరతులు పెట్టి, ఒత్తిళ్లు తెస్తే అంత ఖర్చు చేసేవారి మనోధైర్యం సన్నగిల్లుతుంది. మూడు రాజధానులు, 30 రాజధానులు అంటే కూడా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపరు. రిలయన్స్ వంటి దిగ్గజ పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవాలనుకుంటే చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు ఎలా నిలబడగలరు? పారిశ్రామికవేత్తలు కోరుకునే భూమిని ఓటుబ్యాంకు రాజకీయాలతో పంచిపెడితే భవిష్యత్తులో పరిశ్రమలకు భూమి ఎక్కడ దొరుకుతుంది? రాష్ట్రంలోని రాజకీయాల కారణంగా తెలంగాణ లబ్ధి పొందుతోంది. ప్రముఖ కంపెనీలు రాష్ట్రాన్ని ఎందుకు వీడుతున్నాయనే విషయంలో ప్రభుత్వం అంతర్మథనం చేయాలి. తమిళనాడులోని శ్రీపెరంబదూర్ అటోమొబైల్ హబ్గా తయారైంది. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు. ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం అప్పుల్లో అగ్రస్థానంలో నిలిచిన తొలి ఐదు రాష్ట్రాలు పారిశ్రామికంగా వెనుకబడ్డాయని తేలింది. అప్పులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు పారిశ్రామికంగా ముందజంలో ఉంటున్నాయి.
ఎస్.అనంత్, ఆర్థికరంగ విశ్లేషకుడు
పెట్టుబడి వాతావరణమే దెబ్బతింది
రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. సుమారు రూ.10వేల కోట్ల పెట్టుబడిని అమరరాజా తెలంగాణలో పెడుతుంటే పదేళ్లలో భారీగా జీఎస్టీని రాష్ట్రప్రభుత్వం కోల్పోయినట్టే. నిర్మాణరంగ దిగ్గజాలైన ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాయి. ఓ పరిశ్రమ వేరేచోటకు వెళ్లిపోయిందంటే.. ఆ ఒక్క పెట్టుబడినే లెక్కగా చూడకూడదు. అనేక అనుబంధరంగాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 10వేల మందికి ఉపాధి చూపించే పరిశ్రమ వల్ల పరోక్షంగా మరో 40వేల మందికి ఉపాధి వస్తుంది. ఆ ప్రాంతంలో అనేక వసతులు, సౌకర్యాలు సమకూరుతాయి. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా పరిశ్రమలు రావాలి. అవి రాష్ట్రానికి శాశ్వత సంపదగా మారాలి. కులం, రాజకీయం, పార్టీల ముద్రవేసి కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. నియంతృత్వ విధానాల వల్ల తాత్కాలిక ప్రయోజనమే తప్ప దీర్ఘకాల ఉపయోగం లేదనడానికి ఇరాక్, లిబియా, ఉత్తరకొరియా దేశాలు ఉదాహరణగా చెప్పొచ్చు. జీడీపీ ఆదాయం ఎక్కువగా వచ్చే పరిశ్రమలు తరలిపోతే ఖజానా ఆదాయం తగ్గిపోతుంది.
ఓ.నరేశ్కుమార్, ఐటీ రంగ నిపుణుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?