పొరుగు సేవల ఉద్యోగులపై వేటు
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టింది.
వర్క్స్ అండ్ ఎకౌంట్స్ విభాగంలో 17 మంది తొలగింపు
గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో 350 మంది ఇంటికే
సోమవారం నుంచి హాజరు తీసుకోవద్దని ఆదేశాలు
పంచాయతీరాజ్ శాఖలోనూ అలజడి
కాంట్రాక్టు, పొరుగుసేవల ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టింది. మొదటగా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పదేళ్లలోపు సర్వీసు ఉన్న 17 మందిపై వేటు వేస్తూ డిసెంబర్ 1న మెమో ఇచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో పనిచేస్తున్న సుమారు 300-350 మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగిస్తూ ఆదివారం ఆదేశాలిచ్చింది. సోమవారం నుంచి వారి హాజరు తీసుకోవద్దని స్పష్టంచేసింది. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, స్వీపర్లు, వాచ్మెన్గా పనిచేస్తున్న సుమారు 700 మందిలోనూ అలజడి మొదలైంది. మున్ముందు మిగిలిన విభాగాల్లోనూ పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులను వదులుకునేందుకు అడుగులు పడుతున్నాయని వాపోతున్నారు. వివిధ శాఖల్లో ఇప్పటికే మంజూరైన పోస్టుల రద్దు, ఉద్యోగుల కుదింపుపై ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. తదనుగుణంగా పొరుగుసేవల ఉద్యోగుల తొలగింపు చేపట్టిందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల మంది ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో లక్ష మందిని ప్రభుత్వం ఆప్కాస్ విభాగంలోకి తెచ్చింది. 1.40 లక్షల మంది ఇంకా ఏజెన్సీలు, థర్డ్ పార్టీల ద్వారా సేవలందిస్తున్నారు. మొత్తంగా పదేళ్లలోపు సర్వీసున్న వారు 60వేల వరకు ఉంటారని అంచనా. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరి భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ప్రస్తుతం ఆప్కాస్లో చేర్చిన వారిలోనే 17 మందిపై వేటు పడటం గమనార్హం.
ఖాళీ పోస్టుల రద్దు, పునర్వ్యవస్థీకరణపై కసరత్తు
గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసిన వైకాపా ప్రభుత్వం.. 1.31 లక్షలకు పైగా ఉద్యోగుల్ని, 2.52 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని రద్దుచేసి, శాఖలను పునర్వ్యవస్థీకరిస్తోందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కొంతకాలంగా దీనిపై కసరత్తు జరుగుతోంది. విభాగాల వారీగా చూస్తే రాష్ట్రస్థాయిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, జిల్లాల్లో సీనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు తదితర పోస్టుల్లో చాలా ఖాళీలున్నాయి. కిందిస్థాయిలో అటెండర్లు, జమేదారు, దఫేదారు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం లేదని, రద్దు చేయొచ్చనేది ప్రభుత్వ భావనగా ఉంది. అందుకే కొత్త నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు.
తొలగింపే శరణ్యమని..
ఏదైనా ఒక పోస్టును భర్తీ చేయాలంటే.. అందుకు ప్రభుత్వం నుంచి మంజూరు తప్పనిసరి. అలా ఖాళీగా ఉంటేనే అందులో శాశ్వత నియామకాలు చేపట్టడమో, లేదంటే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులతో భర్తీ చేయడమో సాధ్యం. ఇలా మంజూరైన జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల్లోనే కొన్నాళ్లుగా ఒప్పంద, పొరుగు సేవల కింద డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. శాశ్వత నియామకాలు లేకుండా ఖాళీగా ఉన్న ఈ పోస్టుల్ని రద్దు చేయాలంటే ముందుగా అక్కడ పనిచేస్తున్న వారిపై వేటు తప్పనిసరి. ఈ క్రమంలోనే తొలి వేటు వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలోని 17 మందిపై పడిందని సమాచారం.
* సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గతంలో 1:80 విధానంలో వంటవారు, సహాయకులు, కమాటీలను నియమించేవారు. ఇప్పుడు 1:120కి మార్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 300-350 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని అంచనా.
* పంచాయతీరాజ్ పరిధిలో ఉపాధిహామీ పథకం కింద ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, స్వీపర్లు, వాచ్మెన్గా పలువురిని నియమించారు. వీరంతా ఆప్కాస్లో ఉన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టే నిర్మాణాలకు మంజూరైన నిధుల్లోంచి 3% చొప్పున అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలుగా వసూలు చేస్తారు. అందులో నుంచే వీరికి జీతాలు చెల్లిస్తున్నారు. పదేళ్లలోపు వారిని తొలగిస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది.
పదేళ్ల ప్రామాణికంలో మతలబు?
గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయికి సేవలను చేరువ చేశామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు అదే తరహా సేవలందించే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల అవసరమేంటన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అభిప్రాయం మేరకు వారిపై వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో అధిక శాతం గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే. 2009-2014 మధ్య కూడా కొందరిని తీసుకున్నారు. పదేళ్లకు మించి పనిచేస్తున్న వారికి ప్రస్తుతానికి ఉపశమనం లభించినా.. భవిష్యత్తులో వారికీ ఉద్వాసన తప్పదని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు రాకుండా ఉండేందుకు వర్క్స్ అండ్స్ అకౌంట్స్ విభాగానికే ఈ నిర్ణయాన్ని పరిమితం చేసినట్లుగా ప్రభుత్వం నమ్మిస్తోందని చెబుతున్నారు.
తొలగింపు మెమో భావ్యం కాదు
‘వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పదేళ్లలోపు పనిచేసిన ఉద్యోగులను విధుల్లోంచి తొలగించాలని ఇచ్చిన మెమోపై ఉన్నతాధికారులను సంప్రదించగా.. అది ఆ ఒక్క శాఖలోని వారికి మాత్రమేనని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చామని చెప్పారు. మిగిలిన శాఖల్లోని ఉద్యోగులకు, ఈ మెమోకు సంబంధం లేదన్నారు. కాబట్టి ఆందోళన అవసరం లేదు’ అని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు, ఏపీ కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగుల జేఏసీ నాయకులు కె.సుమన్, భానోజీరావు పేర్కొన్నారు. ‘ఉద్యోగుల తొలగింపు ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఆ విభాగంలో ప్రత్యేక కారణాలుంటే మరో శాఖలో సర్దుబాటు చేయాలి’ అని డిమాండు చేశారు. ‘ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులతో కలిపితే రాష్ట్రంలో పది లక్షల మంది ఉంటారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్లో పనిచేసే ప్రతి ఒక్కరినీ క్రమబద్ధీకరిస్తామని, శాశ్వతంగా నియమిస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇవ్వడంతోనే.. వారంతా ఆయనకు ఓటేసి గెలిపించారు. ఖాళీగా ఉన్న 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చకపోగా.. ఉన్న ఉద్యోగులనే తీసేస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన వారిని తొలగించాలన్నా.. ముందు నోటీసు ఇచ్చి, మూడు నెలల జీతం చెల్లిస్తారు. పదేళ్లు పనిచేసి, వయోపరిమితి కోల్పోయాక ఇప్పుడు బయటకు పంపిస్తే వారు ఎక్కడికి వెళ్లాలి’ అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.హేమంత్కుమార్ పశ్నించారు.
ఉద్యోగ సంఘాల ఆగ్రహం
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వస్తే ఒక్క ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగినీ తొలగించబోమని హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి.. అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. దీనిపై పోరాటానికి సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. ‘చాలీచాలని జీతాలతో ఎనిమిదేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగుల్ని, వారి కుటుంబాల్ని రోడ్డున పడేయటం మంచిది కాదు. తక్కువ మంది ఉద్యోగులతోనే కోర్టు కేసులు, అధిక పనిభారాన్ని మోస్తున్నాం. మిగతా శాఖలకు లేని నిబంధనలు ఈ శాఖకే ఎందుకు? 17 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ ఇచ్చిన మెమోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. వారిని విధుల్లోకి తీసుకోవాలి. అసోసియేషన్ తరఫున వారికి అండగా నిలుస్తాం’ అని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎస్ హరనాథ్, సీహెచ్వీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ‘ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించాలని ఆదేశాలివ్వడాన్ని ఖండిస్తున్నాం. అన్ని శాఖల్లోనూ ఇదే నిర్ణయం అమలుకు తొలి అడుగు వేసినట్లు భావిస్తున్నాం. తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తాం’ అని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ ఛైర్మన్ ఏవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు