పరీక్ష ఇలా.. చదవండి బాగా!
ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది.
పోలీసు ఉద్యోగాల ఎంపికకు 4 దశలు
తొలుత ప్రాథమిక రాత పరీక్ష
అర్హత మార్కులు సాధిస్తే పీఎంటీ, పీఈటీకి ఎంపిక
ఆ తర్వాత తుది రాత పరీక్ష
ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. నాలుగేళ్ల తర్వాత నియామక నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి మొత్తం 4 దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
దశ-1: ప్రాథమిక రాత పరీక్ష
సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు..
* సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహిస్తారు.
* ప్రశ్నపత్రం: 200 మార్కులకు 200 బహుళైఛ్చిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలుంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
సివిల్, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు..
* సివిల్, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహిస్తారు.
* ఒక్కోటి 100 మార్కుల చొప్పున మొత్తం 2 పేపర్లు 200 మార్కులకు ఉంటాయి. బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలుంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
అర్హత మార్కులు
* మహిళలు- 40 శాతం, బీసీలు, ఈడబ్ల్యూఎస్లు-35 శాతం, ఎస్సీ, ఎస్టీలు, మాజీ సైనికోద్యోగులు-30 శాతం మార్కులు సాధించాలి. పోటీ ఎక్కువైతే కటాఫ్ మార్కులు పెడతారు.
* కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను తదుపరి దశలో శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), దేహ దారుఢ్య పరీక్షలకు (పీఈటీ) ఎంపిక చేస్తారు.
దశ-2: శారీరక కొలతలపరీక్ష (పీఎంటీ)
* ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడేవారు శారీరక కొలతల పరీక్షలో (పీఎంటీ) అర్హత కోసం పురుషులు 167.6 సెంటిమీటర్లు, మహిళలు 152.5 సెంటిమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండకూడదు.
* పురుషుల ఛాతీ చుట్టుకొలత 86.3 సెంటిమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. శ్వాస పీల్చినప్పుడు ఛాతీ 5 సెంటిమీటర్ల మేర విస్తరించాలి.
* మహిళలు బరువు 40 కిలోల కంటే తక్కువ ఉండకూడదు.
దశ-3: దేహ దారుఢ్య పరీక్షలు (పీఈటీ)
సివిల్ ఎస్సై, సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారు
* దేహ దారుఢ్య పరీక్షల్లో పురుషులైతే 8 నిమిషాల్లో, మహిళలైతే 10 నిమిషాల 30 సెకన్లలో 1,600 మీటర్ల పరుగు పూర్తి చేయాలి.
* 100 మీటర్ల పరుగు, లాంగ్జంప్ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత సాధిస్తే చాలు. నిర్దేశిత సమయంలో అవి పూర్తి చేయాలి.
* సివిల్ ఎస్సై, సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇది కేవలం అర్హత పరీక్షే. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ఏపీఎస్పీ ఆర్ఎస్సై, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారు
* 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్జంప్లో అర్హత సాధించాలి. మహిళలు ఈ పోస్టుకు పోటీపడే అవకాశం లేదు.
* ఏపీఎస్పీ ఆర్ఎస్సై, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడే వారికి 1600 మీటర్ల పరుగుకు 40, 100 మీటర్ల పరుగుకు 30, లాంగ్జంప్కు 30 చొప్పున 100 మార్కులకు దేహ దారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు.
* నిర్దేశించిన సమయం కంటే ఎంత ముందు గమ్యాన్ని చేరుకుంటే అన్ని ఎక్కువ మార్కులు అభ్యర్థులకు లభిస్తాయి. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
దశ-4: తుది రాత పరీక్ష
సివిల్ ఎస్సై ఉద్యోగాలకు పోటీపడేవారికి..
* పేపర్-1: ఆంగ్లం,
* పేపర్-2: తెలుగు.. వందేసి మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు వివరణాత్మక విధానంలో (డిస్క్రిప్టివ్) ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.
* పేపర్-3: అర్థమేటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ,
* పేపర్-4: జనరల్ స్టడీస్ రెండేసి వందల మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో (ఆబ్జెక్టివ్) ఉంటాయి. ఈ రెండు పేపర్లలో కలిపి 400 మార్కులకుగానూ అభ్యర్థులు సాధించిన మార్కులనే ఉద్యోగ ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
ఆంగ్లం, తెలుగు పేపర్లలో అర్హత సాధించకపోతే మిగతా రెండు పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.
మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుంటాయి.
ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు పోటీపడేవారికి..
* పేపర్-1, పేపర్-2లు సివిల్ ఎస్సై అభ్యర్థులకు ఉన్నట్లే వందేసి మార్కులకు ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.
* పేపర్-3, పేపర్-4లను వందేసి చొప్పున 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లలో అభ్యర్థి సాధించిన మార్కులను, 100 మార్కులకు నిర్వహించిన దేహ దారుఢ్య పరీక్షల్లో అభ్యర్థి సాధించిన మార్కులకు కలుపుతారు. మొత్తం 300 మార్కులకుగానూ అత్యధిక మార్కులు సాధించిన వారిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
తుది రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినవారే విజేత
* సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడే వారికి 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. అత్యధిక మార్కులు సాధించినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
* ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడే వారికి 200 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు ఉంటుంది. 100 మార్కులకు నిర్వహించిన దేహ దారుఢ్య పరీక్షల్లో ఆయా అభ్యర్థులు సాధించిన మార్కులను వీటికి కలుపుతారు. మొత్తం 200కు అత్యధిక మార్కులు వచ్చిన వారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు
ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం, మద్దిపాడు, చిత్తూరులలో ఏర్పాటు చేసే ఐఆర్ బెటాలియన్లలో ఒక్కోచోట 630 చొప్పున మొత్తం 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM