శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉంది.

Published : 05 Dec 2022 03:28 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. శనివారం శ్రీవారిని 63,931 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.48 కోట్ల హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

తిరుమలలో భద్రతా తనిఖీలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సందర్భంగా తిరుమలలోని పలు ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు ఆదివారం తనిఖీలు నిర్వహించాయి. శ్రీవారి ఆలయం ఎదుట, ప్రధాన రహదారులు, పార్కుల్లో తనిఖీలు చేపట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని