ఆరంభించి.. అర్ధంతరంగా ఆపేసి

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ పరిధి కొటిపిలో నిరుపేదల కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో సుమారు 2,700 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

Published : 05 Dec 2022 03:28 IST

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ పరిధి కొటిపిలో నిరుపేదల కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో సుమారు 2,700 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో కొన్ని భవనాలు సగం వరకు నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి సగం కాంక్రీటులో.. సగం గాల్లో తేలిన ఇనుప చువ్వలు తుప్పుపట్టిపోతున్నాయి. కంప చెట్లు పెరిగి అక్కడో నిర్మాణం చేపట్టారనే ఛాయలూ కనిపించడం లేదు. ఇటీవలి వర్షాలకు పునాదుల్లో నీరు చేరింది. ఆ ప్రాంతమంతా చిట్టడవిని తలపిస్తోంది. కొన్ని చోట్ల టిడ్కో ఇళ్లను వచ్చే ఏడాది జనవరిలో అందజేస్తామంటూ అధికారులు చర్యలు తీసుకుంటుంటే ఇక్కడి పరిస్థితేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

ఈనాడు, అనంతపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని