Seema Garjana: గర్జనకు కొరవడిన స్పందన..ఆసాంతం జగన్ భజన
కర్నూలులో సోమవారం నిర్వహించిన రాయలసీమ గర్జన సభ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని పొగడటానికే పెట్టినట్లు నేతలు వ్యవహరించారు.
నేతల ప్రసంగ సమయంలోనే వెనుదిరిగిన ప్రజలు
ఈనాడు, కర్నూలు: కర్నూలులో సోమవారం నిర్వహించిన రాయలసీమ గర్జన సభ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని పొగడటానికే పెట్టినట్లు నేతలు వ్యవహరించారు. రాజకీయేతర ఐకాస నేతలూ చంద్రబాబును విమర్శించి వైకాపా నేతల మన్ననలు పొందే ప్రయత్నం చేశారు. న్యాయరాజధాని మినహా రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి డిమాండ్లనూ సభలో లేవనెత్తలేదు. నేతలు ప్రసంగిస్తుంటే హాజరైనవారిలో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు. చివరకు మూడు రాజధానుల నినాదం చెప్పి చేతులెత్తించే ప్రయత్నం చేసినా ప్రజల నుంచి ప్రతిస్పందన కరవైంది. రాజకీయేతర ఐకాస నేతలకు 1-2 నిమిషాలకు మించి ప్రసంగించడానికి మైకు ఇవ్వలేదు. వైకాపా నేతలకు ఐదు నిమిషాలకు పైగా సమయమిచ్చినా వారు ప్రసంగాలతో ఆకట్టుకోలేకపోయారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి దాన్ని ప్రారంభించిన విషయం విదితమే. సభలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ విమానాశ్రయం పూర్తి చేసింది జగనే అంటూ చెప్పుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకూ పెద్దపీట వేసినట్లు చెప్పడంతో నిధులిచ్చారా అన్న విమర్శలకు తావిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులయినా సీమ అభివృద్ధికి ఎవరూ ఏమీ చేయలేదన్నారు. అందులో చంద్రబాబు 14 ఏళ్లు ఉండి అన్యాయం చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సీమ నుంచే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేశారని మరిచిపోయారా? లేకపోతే వైఎస్ కూడా సీమకు అన్యాయం చేశారని ఒప్పుకొన్నారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి.
సమీకరణలో చతికిలబడ్డారు
వైకాపా రాయలసీమ గర్జన సభను లక్షమందితో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావించింది. చివరికి తక్కువ సామర్థ్యం ఉన్న ఎస్టీబీసీ మైదానాన్నే నింపలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, మహిళలే లక్ష్యంగా ఆంక్షలతో రప్పించాలని ప్రయత్నించినా విజయవంతం కాలేదు. చిత్తూరు, కడప జిల్లాల నుంచి తక్కువ మందే హాజరయ్యారు. సభకు వచ్చినవారిలో అత్యధిక శాతం ఉమ్మడి కర్నూలు జిల్లావారేనని వైకాపా నాయకులే చెబుతున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి.. కర్నూలు నగరంలో ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ వర్గాలు విడివిడిగా జనసమీకరణ చేసినా సకాలంలో సభ వద్దకు చేర్చలేకపోయారు.
వేచి చూసినా నిండని కుర్చీలు
ఉదయం 10 గంటలకు సభ ప్రారంభించాలని అనుకున్నా.. 11 గంటల వరకు సభలో కుర్చీలు నిండలేదు. వైకాపా నేతల ప్రసంగం మొదలవగానే విద్యార్థులు, మహిళలు వెనుదిరిగారు. ఆ సమయంలో కొన్ని గ్యాలరీల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఎండ ఎక్కువగా ఉండటంతో ప్లకార్డులు నెత్తిన పెట్టుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభ జరుగుతుండగా విద్యార్థులు వెనుదిరుగుతుండటంతో ఇరువైపులా గేట్లు మూసివేశారు. చాలామంది గోడలు దూకి వెళ్లిపోయారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ వేదిక దిగి వారి వద్దకు వచ్చి, వెళ్లొద్దంటూ అభ్యర్థించినా ఫలితం లేకపోయింది.
ఆ నేతలు గైర్హాజరు
ప్రభుత్వ ఉద్యోగులు కూడా గర్జన సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 5వ తేదీ వచ్చినా జీతాలు అందకపోవడంతో చాలామంది ఉద్యోగులు గైర్హాజరయ్యారు. కర్నూలు పార్లమెంట్ వైకాపా అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి సభకు రాలేదు. గర్జనపై ముందు నుంచి సూచనలు చేస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తారనుకున్నా రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్