కర్నూలులోనే హైకోర్టు
యువకులు, రైతులు, ఈ ప్రాంత భవిష్యత్తు, గౌరవం నిలబెట్టడానికి ఉద్యమ నిర్ణయం తీసుకున్నాం.. హైకోర్టు సాధించే వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రకటించారు.
త్వరలో జగన్నాథగట్టుపై నిర్మిస్తాం
నలువైపులా పది కి.మీ. పరిధి కనిపించేలా నిర్మాణం
రాయలసీమ గర్జన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన
కర్నూలుకు న్యాయ రాజధాని సబబేనన్న పెద్దిరెడ్డి
ఈనాడు, కర్నూలు: యువకులు, రైతులు, ఈ ప్రాంత భవిష్యత్తు, గౌరవం నిలబెట్టడానికి ఉద్యమ నిర్ణయం తీసుకున్నాం.. హైకోర్టు సాధించే వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రకటించారు. కర్నూలులోని జగన్నాథగట్టుపై త్వరలోనే హైకోర్టు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. ఎటువైపు నుంచి కర్నూలుకు వచ్చినా పది కి.మీ. ముందు నుంచే కనిపించేలా హైకోర్టు కట్టబోతున్నామని వెల్లడించారు. సోమవారం కర్నూలులో నిర్వహించిన ‘రాయలసీమ గర్జన’లో ఆయన ప్రసంగించారు. ‘బాధ్యతగల వ్యక్తిగా జగన్ హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? అభివృద్ధి, పరిశ్రమలు, రోడ్లు అంటూ చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నారు.. ఇవన్నీ వద్దయ్యా! కర్నూలులో హైకోర్టు పెట్టడానికి ఇష్టం ఉందా లేదా చెప్పు అని ఈ వేదిక నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నా. అభివృద్ధి గురించి మాట్లాడితే మేమూ మాట్లాడొచ్చు. ముఖ్యమైన హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు-నగరికి చంద్రబాబు మొదటి విడత సీఎంగా ఉన్నప్పుడు రూ.13-17 కోట్లు కేటాయిస్తే, వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.4 వేల కోట్ల చొప్పున కేటాయించి పనులు పూర్తి చేయడం నిజమా.. కాదా? జగన్ వచ్చాక కర్నూలుకు విమానాశ్రయం కట్టినమాట నిజమా? కాదా? 1972లో స్థాపించిన సిల్వర్ జూబ్లీ కళాశాలకు మరుగుదొడ్లు, సరైన సదుపాయాల్లేకపోతే జగన్నాథగట్టుపై బ్రహ్మాండమైన భవనం కడుతుండటం వాస్తవమా? కాదా’ అని ప్రశ్నించారు. నంద్యాల- జమ్ములమడుగు, చిత్తూరు, అనంతపురంలో రూ.7500 కోట్లతో జాతీయ రహదారులు వైకాపా ప్రభుత్వంలో తెచ్చుకుంటే, 2018-19లో తెదేపా రాష్ట్రానికి తెచ్చింది రూ.250 కోట్లేనన్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. శ్రీకాకుళం- చిత్తూరు వరకు అంతా సమాంతరంగా శాశ్వతంగా అభివృద్ధి చెందాలంటూ జగన్ ఆలోచిస్తున్నారన్నారు. కానీ చంద్రబాబుకు కృష్ణా, గుంటూరు, గోదావరి ఏ ప్రాంతంపైనా ప్రేమ లేదని.. 30 చ.కి.మీ ప్రాంతంలోని పార్టీ, బంధుమిత్రులు, రియల్ ఎస్టేట్ బృందంపై మాత్రమే ప్రేమ ఉందని బుగ్గన ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయలేదు: పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ నుంచి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రవిభజనకు ముందు హైదరాబాద్నే అభివృద్ధి చేశారు తప్ప రాష్ట్రంలో ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. అమరావతిలో రాజధాని వద్దని ముఖ్యమంత్రి చెప్పలేదని, అక్కడా రాజధాని ఉండి శాసనసభ వ్యవహారాలు చూస్తుందన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని అడిగినట్లే, కర్నూలుకు న్యాయరాజధాని ఇవ్వడం సబబన్నారు. అభివృద్ధి చేపట్టినా పరిగణనలోకి తీసుకోకుండా ఎక్కడా అభివృద్ధి జరగలేదని, రాజధాని నిర్మాణానికి డబ్బులెక్కడివని వ్యంగ్యంగా మాట్లాడుతున్న చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా పరిగణించాలని అన్నారు.
పవన్కల్యాణ్.. కర్నూలుకు మద్దతు తెలుపు: గుమ్మనూరు
రాయలసీమ రక్తంతో పుట్టి ఉంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు మద్దతిస్తారని, ఇక్కడ పుట్టలేదంటే వ్యతిరేకిస్తారంటూ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వత్తాసు పలికే పవన్ కల్యాణ్ సహా రాయలసీమ పేరు పెట్టుకుని కర్నూలు జిల్లా ప్రజలు ఇచ్చిన డబ్బులతో రూ.వేల కోట్లు సంపాదించుకున్న సినిమా పరిశ్రమ అంతా ఏకమై కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలన్నారు. చంద్రబాబును బహిష్కరించి, కర్నూలులో న్యాయరాజధానికి మద్దతు పలకాలని అందర్నీ హెచ్చరిస్తున్నానన్నారు.
చీపుర్లు, చెప్పులతో తరిమి కొట్టండి: అంజాద్బాషా
చంద్రబాబు కర్నూలులో పర్యటించి ఇక్కడ ప్రజలు, తెదేపా నాయకులతో ఒకే ప్రాంత అభివృద్ధికి నినాదాలు చేయించడం రాయలసీమ ప్రజలను అవహేళన చేయడమేనని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా అన్నారు. ఒకే ప్రాంత అభివృద్ధిని కోరుతున్న తెదేపా, జనసేన రాయలసీమ నాయకులు మీ ఇంటికి వస్తే మహిళలు చీపుర్లతో, పురుషులు చెప్పులతో తరిమి కొట్టాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
ఉనికి కోల్పోతారని బాబుకు భయం: ఉషశ్రీచరణ్
కర్నూలులో రాజకీయంగా వైకాపా బలంగా ఉందని.. హైకోర్టు ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు, లోకేశ్కు ఎలాంటి ఉనికి ఉండదనే అడ్డుకుంటున్నారని మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. కర్నూలుకు రావద్దంటూ ప్రజలందరూ వారి పర్యటనను అడ్డుకుని బుద్ధి చెప్పారన్నారు. ఉద్యోగాల్లేక రాయలసీమ జిల్లాల నుంచి వలస వెళ్తున్నారని, న్యాయరాజధాని వస్తే చాలా పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. కర్ణాటకలో బెంగళూరు రాజధానిగా ఉన్నప్పటికీ శీతాకాల సమావేశాలు బెళగావిలోని మినీ విధానసౌధలో నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. గోరంట్ల అనే నాకు జ్వరమొస్తే.. బుగ్గనకి ఇంజక్షన్ ఇస్తా, చేపలు, గుడ్లు పెడతా అన్నట్లు ఉందంటూ చంద్రబాబును ఎంపీ గోరంట్ల మాధవ్ ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ