రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం
రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్.ఎం.సి.) ముసాయిదాలోని ఏ అంశమూ తమ ప్రయోజనానికి తగ్గట్లుగా లేదని, ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావని తెలంగాణ పేర్కొంది.
ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావు
పెండింగ్లో పెట్టాలన్న తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్.ఎం.సి.) ముసాయిదాలోని ఏ అంశమూ తమ ప్రయోజనానికి తగ్గట్లుగా లేదని, ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావని తెలంగాణ పేర్కొంది. ఇప్పుడు జరిగే ఒప్పందం కృష్ణా ట్రైబ్యునల్-2లో తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడింది. ముసాయిదాలోని సిఫార్సులను పెండింగ్లో పెట్టాలని, ఆ మేరకు ఆర్.ఎం.సి. కన్వీనర్కు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. సోమవారం జరిగిన ఆర్.ఎం.సి. సమావేశానికి హాజరుకాని తెలంగాణ.. కృష్ణా నదీ యాజమాన్యబోర్డు ఛైర్మన్కు లేఖ రాసింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఈ లేఖ రాశారు. రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చినట్లు కన్వీనర్ చెప్పారని మీడియాలో వచ్చిందని... ఇది తీవ్ర అభ్యంతరకరం, అవాస్తవమని పేర్కొన్నారు. నీరు, విద్యుత్తు పంపిణీ, క్యారీఓవర్ స్టోరేజి, వరద జలాలను లెక్కించడం తదితర విషయాల్లో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, గతంలో కూడా అనేకసార్లు ఈ విషయమై లేఖలు రాశామని స్పష్టం చేశారు. విద్యుత్తు పంపిణీ 50:50 నిష్పత్తిలో ఉండాలని ఆర్.ఎం.సి. ముసాయిదా పేర్కొందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. శ్రీశైలం జల విద్యుత్తు ప్రాజెక్టు అని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రెండు రాష్ట్రాల తాగు, సాగు అవసరాలకు, ఆవిరయ్యే నీటితో కలిపి 280 టీఎంసీలను విడుదల చేయాల్సి ఉందన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేయాలని 2021 జూన్లో టి.ఎస్.జెన్కోను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చామని, 50:50 నిష్పత్తిలో అనడం పై ఉత్తర్వులకు విరుద్ధమని వివరించారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
854 అడుగులు కాదు 830 ఉండాలి
* శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని ఆర్.ఎం.సి. ముసాయిదా పేర్కొంది. ఇది కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు విరుద్ధం. వాస్తవానికి 830 అడుగులు ఉండాలి.
* కృష్ణా ట్రైబ్యునల్-1 ప్రకారం శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ ట్రైబ్యునల్ అవార్డు నోటిఫై అయ్యాక చెన్నై తాగునీటి సరఫరాకు జులై నుంచి అక్టోబరు వరకు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 1500 క్యూసెక్కులు తీసుకోవడానికి, తర్వాత ఉమ్మడి ఏపీ శ్రీశైలం కుడిగట్టు కాలువకు 19 టీఎంసీలకు ఆమోదం పొందింది. దీన్ని కృష్ణా ట్రైబ్యునల్-2 ఎదుట సవాలు చేశాం. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచడమూ అక్రమం. దీన్నీ సవాలు చేశాం.
* ఎస్సార్బీసీకి 19 టీఎంసీలకు అంగీకరించినా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి వెళ్లాల్సింది 34 టీఎంసీలే. బోర్డు, ఆర్.ఎం.సి.లు ఈ మేరకు మాత్రమే నీటిని తీసుకొనేలా ఆంధ్రప్రదేశ్ను నియంత్రించాలి.
* మిగులుజలాల వినియోగం అంశం ప్రస్తుతం కృష్ణా ట్రైబ్యునల్-2 ముందు ఉంది. రిజర్వాయర్లు పొంగిపొర్లినపుడు వాడుకొనే నీటిని లెక్కలోకి తీసుకోరాదని ట్రైబ్యునల్ ఎదుట ఏపీ అడగలేదు. ఇక్కడ ఒప్పందం ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తోంది. వరదల తర్వాత శ్రీశైలం, సాగర్ల నుంచి తెలంగాణ తీసుకొనే నీటిలో మార్పు చేస్తే తప్ప మిగులు జలాల విషయంలో ఒప్పందం చేసుకోవడానికి కారణం కనిపించడం లేదు.
* నీటి పంపిణీ 66:34 నిష్పత్తిలో కాకుండా 50:50 నిష్పత్తిలో ఉండాలని ఈ ఏడాది మే 6న జరిగిన బోర్డు సమావేశంలో తెలంగాణ కోరింది. మొత్తం 575 టీఎంసీలు అవసరమంటూ బోర్డు ఏకపక్షంగా 66:34 నిష్పత్తిని కొనసాగిస్తూ నోటీసు జారీ చేసింది. దీనికి మా ఆమోదం లేదు. న్యాయపరంగా చెల్లదు. ఈ సంవత్సరం కేటాయించి వినియోగించుకోని నీటిని తదుపరి ఏడాది వాడుకోవడానికి అనుమతించాలని తెలంగాణ తరచూ కోరుతున్నా బోర్డు అంగీకరించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.