YSRCP: పురపాలక సంఘమా.. వైకాపా కార్యాలయమా!?

బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం వైకాపా చీరాల నియోజకవర్గ సమావేశం నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది.

Updated : 06 Dec 2022 06:58 IST

చీరాల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం వైకాపా చీరాల నియోజకవర్గ సమావేశం నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన మురుగుడు హనుమంతరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పురపాలక సంఘం సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. కార్యాలయం మొత్తం అధికార పార్టీ శ్రేణులతో నిండిపోయింది. నినాదాలతో హోరెత్తింది. ఉద్యోగులు, పౌరసేవల నిమిత్తం వచ్చిన సందర్శకులు ఇబ్బంది పడ్డారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ మొదటినుంచీ పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా పోతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, నియోజకవర్గ బాధ్యుడు వెంకటేష్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని