న్యాయమూర్తుల బదిలీలను నిలిపేయాలి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల ఆకస్మిక బదిలీలను తక్షణం నిలిపివేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

Published : 06 Dec 2022 05:02 IST

హైకోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల ఆకస్మిక బదిలీలను తక్షణం నిలిపివేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి నినాదాలు చేశారు. ఏపీ అడ్వొకేట్స్‌ ఐకాస కన్వినర్లు వై.కోటేశ్వరరావు(వైకే), జడ శ్రావణ్‌కుమార్‌, డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబు, జీవీ శివాజీ, వాసిరెడ్డి ప్రభునాథ్‌ ఆధ్వర్యంలో హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని