పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్‌.ఐ./కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో జేడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.

Published : 07 Dec 2022 03:50 IST

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్‌.ఐ./కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో జేడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ‘హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థ ఐ.ఎ.సి.ఇ. భాగస్వామ్యంతో శిక్షణ తరగతులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తాం. ఈ నెల 11న ఉదయం 9.30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 38 కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. అందులో ప్రతిభ చూపిన వెయ్యి మందిని ఎంపిక చేసుకుంటాం. 21 పరీక్ష కేంద్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు సెల్‌ నంబరు 7093651037కు ‘హాయ్‌’ అని ఆంగ్లంలో వాట్సప్‌ చేయాలి. మరిన్ని వివరాలకు 9533200400 నంబరులో సంప్రదించాలి’ అని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని