సీఎం జగన్‌ కడప పర్యటన రద్దు

ముఖ్యమంత్రి జగన్‌ కడప పర్యటన రద్దయింది. కడప పెద్దదర్గా ఉరుసులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్లను సమర్పించడంతో పాటు, ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు మంగళవారం హాజరుకావాల్సి ఉంది. రెండు రోజులుగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Published : 07 Dec 2022 03:50 IST

ప్రతికూల వాతావరణమే కారణమని సమాచారం

ఈనాడు డిజిటల్‌, కడప: ముఖ్యమంత్రి జగన్‌ కడప పర్యటన రద్దయింది. కడప పెద్దదర్గా ఉరుసులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్లను సమర్పించడంతో పాటు, ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు మంగళవారం హాజరుకావాల్సి ఉంది. రెండు రోజులుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.30కు కడప చేరుకోవాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రావట్లేదని, విజయవాడలో దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా కార్యక్రమాన్ని రద్దుచేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సమాచారం ఇచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని