సామాజిక మాధ్యమాల్లో స్నేహాలపై తస్మాత్‌ జాగ్రత్త

ప్రేమను నిరాకరించిందని తపస్విని ప్రేమోన్మాది జ్ఞానేశ్వర్‌ హత్య చేయడం దారుణమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు.

Published : 07 Dec 2022 05:15 IST

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సూచన

నగరంపాలెం (గుంటూరు), న్యూస్‌టుడే: ప్రేమను నిరాకరించిందని తపస్విని ప్రేమోన్మాది జ్ఞానేశ్వర్‌ హత్య చేయడం దారుణమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. శవాగారంలో ఉన్న తపస్వి మృతదేహాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో స్నేహాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. జ్ఞానేశ్వర్‌ తగిన శిక్ష అనుభవిస్తాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తపస్వి తల్లిదండ్రులు సీతారత్నం, మహేష్‌కుమార్‌ కుమార్తె మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. వాసిరెడ్డి పద్మ వారిని ఓదార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని