శ్రీకాళహస్తిలో తొక్కిసలాట..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం జరిగిన చొక్కాణి ఉత్సవం చివరలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భక్తులు పరుగులు తీశారు.

Published : 07 Dec 2022 05:15 IST

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం జరిగిన చొక్కాణి ఉత్సవం చివరలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భక్తులు పరుగులు తీశారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాటలో పలువురు భద్రతా ఉద్యోగిని ఒకరి చేతికి కాలిన గాయాలు కాగా, మరొకామె శ్వాస ఆడక అస్వస్థతకు గురైంది. ఇంకొక ఉద్యోగిని చెయ్యి బెణికింది. నిప్పు రవ్వలు భక్తులపై పడటం, ఓ ప్రణాళిక లేకుండా చొక్కాని మానును వెలిగించడం వల్ల ప్రమాదం జరిగింది. రాహు కేతు మండపంపై పడిన నిప్పురవ్వలను భద్రతా సిబ్బంది ఆర్పివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని