పట్టువిడుపులతోనే పరిష్కారం
మనమంతా ఒకదేశంలో ఉన్నామని, అంతర్రాష్ట్ర వివాదాలపై రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు పలికింది.
అంతర్రాష్ట్ర వివాదాలపై ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉండాలి
పోలవరం కేసులో ప్రభావిత రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హితవు
పనులను ఆపాలన్న ఒడిశా వినతిని అంగీకరించని కోర్టు
నిర్మాణంపై అభ్యంతరం లేదన్న తెలంగాణ
2నెలల్లో సీఎంల సమావేశం నిర్వహిస్తామన్న కేంద్రం
ఈనాడు, దిల్లీ: మనమంతా ఒకదేశంలో ఉన్నామని, అంతర్రాష్ట్ర వివాదాలపై రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు పలికింది. మధ్యవర్తిత్వం నడిచేటప్పుడు పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టంచేసింది. పోలవరం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒడిశా దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ సంజయ్కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రాజెక్టు పనులను ఆపేయాలన్న ఒడిశా వినతిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) ఐశ్వర్యభాటి వాదనలు వినిపిస్తూ... సమస్య పరిష్కారానికి ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించామని, రాష్ట్రాలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలిపాయన్నారు. తమకు సమయమిస్తే 2 నెలల్లోగా ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించి, కోర్టుకు తుది నివేదిక సమర్పిస్తామన్నారు. ఒడిశా తరఫు సీనియర్ న్యాయవాది అరుణ్కట్పాలియా అభ్యంతరం వ్యక్తంచేస్తూ... ‘సెప్టెంబరులో తొలి సమావేశం జరిగింది. అక్టోబరులో సాంకేతిక అంశాలపై మరో సమావేశం నిర్వహించారు. అందరి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా చెప్పాలన్నారు. అక్టోబరు 19న మా అభ్యంతరాలను సమర్పించాం. తర్వాత ఏ స్పందనా రాలేదు. మరోవైపు ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. వరద వచ్చినప్పుడు వెనుకజలాలు మమ్మల్ని ముంచెత్తుతాయి. పనులను నిలిపేయండి. అత్యవసరమైన అంతర్రాష్ట్ర వివాదంలో అక్టోబరు నుంచి ఎలాంటి పురోగతి లేదు’ అని వాదించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని జస్టిస్ సంజయ్కిషన్ కౌల్ ప్రశ్నించారు. ఏఎస్జీ స్పందిస్తూ ‘డిసెంబరు 2న సీడబ్ల్యూసీ నివేదిక వచ్చింది. రాష్ట్రాల నుంచీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటిపై మేం నివేదిక సమర్పించాక కోర్టు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు’ అని అన్నారు. ఛత్తీస్గఢ్ న్యాయవాది స్పందిస్తూ... తమ అభిప్రాయాలను నవంబరు 4న సమర్పించామని, ఒడిశా విధానానికి తామూ కట్టుబడి ఉన్నామన్నారు. జస్టిస్ సంజయ్కిషన్ కౌల్ స్పందిస్తూ... ‘ఒక్కో రాష్ట్రం ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తే పరిష్కారాలు సాధ్యంకావు. మనమంతా ఒకే దేశంలో ఉన్నాం. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.
రక్షణ గోడలు నిర్మించండి: తెలంగాణ
తెలంగాణ తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ కల్పించుకుని... ‘మేం పోలవరం నిర్మాణం కొనసాగాలని కోరుకుంటున్నాం. ముంపు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలి. ఇదివరకు గరిష్ఠ వరదను 36 మిలియన్ క్యూసెక్కులుగా అంచనా వేస్తే ఇప్పుడది 50 లక్షల క్యూసెక్కులకు చేరిన విషయాన్ని గుర్తించాలి’ అని తెలిపారు. ఏపీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జైదీప్గుప్తా స్పందిస్తూ... కేసుకు ధర్మాసనం వద్ద పరిష్కారం లభించకుంటే, ట్రయల్ ఆన్ ఎవిడెన్స్కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అయితే మధ్యవర్తిత్వం నడవాలని కోరారు. జస్టిస్ సంజయ్కిషన్ కౌల్ స్పందిస్తూ... ‘మధ్యవర్తిత్వం కొనసాగడంతోపాటు సమస్యకు పరిధులను నిర్ధారించాలి. ప్రతి ఒక్కరూ తమ వాదనలకే కట్టుబడి ఉంటే ఎప్పటికీ ఏమీ జరగదు. అంతిమంగా సీడబ్ల్యూసీయే పరిష్కారం చూపాలి. సీఎంల సమావేశం ఏర్పాటుచేసి, సమస్యను తగ్గించేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే అంతిమంగా కోర్టు ఈ విషయాన్ని చూస్తుంది’ అని స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఇంతవరకు ప్రజాభిప్రాయ సేకరణే చేపట్టలేదన్నారు. అందుకు ఒడిశా న్యాయవాది స్పందిస్తూ... ప్రాజెక్టు ముంపు ఎంతవరకు ఉంటుందన్నది తెలియనప్పుడు అభిప్రాయ సేకరణ ఎలా చేపడతామని ప్రశ్నించారు. అసలీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులేలేవని పునరుద్ఘాటించారు. అందరి వాదనలను విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..