తుపానుపై అప్రమత్తంగా ఉండండి
తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
సమీక్షలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి తుపాను ప్రభావంపై ఆయన సమీక్షించారు. రైతులకు సహాయంగా నిలవాలని, పంట నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
విపత్తు సహాయ బృందాలను సిద్ధం చేశాం
మాండౌస్ తుపాను ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రికి పుదుచ్చేరి, మహాబలిపురం, శ్రీహరికోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం నుంచి ఆయన తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశంలో మాట్లాడారు. 10వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అర్ధరాత్రి తీరం దాటనున్న తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య శుక్రవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్.స్టెల్లా తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 65 కి.మీ. నుంచి 85 కి.మీ. వరకు ఉండవచ్చని వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్.స్టెల్లా అన్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను కారణంగా శుక్రవారం సముద్రం అల్లకల్లోలంగా ఉండొచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)