గుంతల దారి.. చింతలు తీర్చండి!

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నుంచి పెనుకొండ, అనంతపురానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షాలకు కోతకు గురై భారీ గుంతలు పడ్డాయి.

Published : 09 Dec 2022 03:20 IST

మడకశిర, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నుంచి పెనుకొండ, అనంతపురానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షాలకు కోతకు గురై భారీ గుంతలు పడ్డాయి. కర్ణాటక సరిహద్దు మురారాయనపల్లి వద్ద రోజూ లారీలు ఇరుక్కుపోతున్నాయి. రోడ్డును సరిచేయక రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లారీలు గుంతల్లో ఇరుక్కుపోవడంతో ఈ మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తే అదనంగా 40 కి.మీ. వస్తోంది. మురారాయనపల్లి చెరువు సమీప గుంతల్లో గురువారం లారీలు దిగబడ్డాయి. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మురళి, యువకులు అక్కడికెళ్లి నిరసన తెలియజేశారు. రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని