తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల శాశ్వత పంపిణీ జరగలేదు
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిని రాష్ట్ర విభజన తర్వాత ఒప్పందాల ద్వారా కానీ, ట్రైబ్యునల్ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య శాశ్వత ప్రాతిపదికన ఇప్పటివరకూ పంపిణీ చేయలేదని కేంద్ర జల్శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు.
విద్యుత్తు ఉత్పత్తిలో ఇరువైపులా నిబంధనల ఉల్లంఘన
కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు వెల్లడి
ఈనాడు, దిల్లీ: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిని రాష్ట్ర విభజన తర్వాత ఒప్పందాల ద్వారా కానీ, ట్రైబ్యునల్ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య శాశ్వత ప్రాతిపదికన ఇప్పటివరకూ పంపిణీ చేయలేదని కేంద్ర జల్శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. ఆయన గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘అంతర్ రాష్ట్ర జల వివాదాల పరిష్కార చట్టం 1956లోని సెక్షన్ 5(3)కింద 1976లో బచావత్ ట్రైబ్యునల్ (కృష్ణా జలవివాద పరిష్కార ట్రైబ్యునల్-1) 75% డిపెండబిలిటీ ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటాలను ఇంతవరకూ ఖరారు చేయలేదు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు 2015-16 జలసంవత్సరంలో పరస్పర అంగీకారంతో తాత్కాలిక ప్రాతిపదికన ఒక కార్యాచరణ ఒప్పందం చేసుకున్నాయి. తర్వాతి సంవత్సరానికి ఆ ఒప్పందాన్ని అపెక్స్ కౌన్సిల్ ఆమోదించింది. 2017-18 నుంచి 2022-23 మధ్యకాలంలో ఏటా అదే ఏర్పాట్లను కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్ఎంబీ) ఆమోదిస్తూ వచ్చింది. ఆ తాత్కాలిక ఒప్పందానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలు నీటిని తీసుకొని వాడుకుంటూ వస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రిజర్వాయర్లుగా పనిచేస్తున్నాయి. అక్కడ 2 రాష్ట్రాలూ జల విద్యుత్తు ఉత్పత్తిచేస్తున్నాయి. 2020-21, 2021-22 సంవత్సరాల్లో రెండు రాష్ట్రాలూ డ్యాంల్లో మిగులు జలాలు లేనప్పుడు పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించాయి. జల విద్యుత్తు ఉత్పత్తిని ఆపేయాలని కేఆర్ఎంబీ పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. విద్యుత్తు ఉత్పత్తికోసం రిజర్వాయర్లను దుర్వినియోగం చేయకుండా కేఆర్ఎంబీ ఒక ఉపకమిటీని ఏర్పాటుచేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్లలోని విద్యుత్తు కేంద్రాల నిర్వహణతోపాటు, రిజర్వాయర్లను తగిన విధంగా నిర్వహించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని రూపొందించడం ఈ కమిటీ బాధ్యత. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీచేసే అధికారం ప్రస్తుత బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్కు ఉంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
9,576 మంది తెలంగాణ వాసులు విదేశాల్లో పనులు..
ఈ-మైగ్రేట్ పోర్టల్లో నమోదయిన లెక్క ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 31 నాటికి 9,576 మంది తెలంగాణ వాసులు విదేశాల్లో పనులు చేస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. తెరాస రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సౌదీ అరేబియాలో అత్యధికంగా 2,215 మంది, అత్యల్పంగా ఇరాక్లో 29 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఈ 9,576 మందిలో అత్యధికంగా నిజామాబాద్ వాసులు 2,476 మంది ఉన్నారన్నారు. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల నుంచి అత్యల్పంగా ముగ్గురు చొప్పున ఉన్నారని వెల్లడించారు.
* దేశవ్యాప్తంగా కేంద్ర పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు 117 ఉండగా అందులో తెలంగాణకు చెందినవి ఆరు ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్చౌబే తెలిపారు. తెరాస ఎంపీ దామోదర్రావు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించాక కనీసం 105 రోజుల గడువు ఉంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్