ఏపీలో జల క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి: రామ్మోహన్ నాయుడు
తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో జల క్రీడల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెదేపా లోక్సభ పక్షనేత రామ్మోహన్ నాయుడు కోరారు.
ఈనాడు, దిల్లీ: తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో జల క్రీడల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెదేపా లోక్సభ పక్షనేత రామ్మోహన్ నాయుడు కోరారు. క్రీడాభివృద్ధిపై లోక్సభలో చేపట్టిన చర్చలో గురువారం ఆయన మాట్లాడుతూ... ‘దేశంలో భారీ స్టేడియాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మనం క్షేత్రస్థాయిలో ప్రతిభను పట్టించుకోకపోవడంతో ఎందరో క్రీడాకారులు పశువుల కాపర్లుగానే మిగిలిపోతున్నారు. ఖేలో ఇండియా కింద జిల్లా స్థాయిలోనే వసతులు కల్పిస్తున్నారు. దాన్ని పాఠశాలల స్థాయికి తీసుకెళ్లాలి. మా నియోజకవర్గానికి చెందిన పట్టి భాగ్యచంద్ర యాదవ్ నేపాల్లో కర్రసాము పోటీలకు వెళ్లి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి’ అని సూచించారు.
బంధుప్రీతితోనే క్రీడారంగం పతనం: మార్గాని భరత్
బంధుప్రీతి, ముఠా రాజకీయాలతోనే దేశంలో క్రీడా రంగం పతనమైందని వైకాపా ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. క్రీడాభివృద్ధిపై లోక్సభలో చేపట్టిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘బెంగాల్లో ఫుట్బాల్, పంజాబ్లో హాకీ, ఆంధ్రప్రదేశ్లో బ్యాడ్మింటన్ ప్రసిద్ధి చెందాయి. ఆయా రాష్ట్రాల్లో వీటిని కేంద్రం ప్రోత్సహిస్తే అక్కడకు క్రీడా పర్యాటకులు పెరుగుతారు. అంతర్జాతీయ స్థాయి శిక్షకులు, స్టేడియాలు లేకుండా మనం ఒలింపిక్స్ పతకాలను సాధించలేం. ఒలింపిక్స్లో స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ఒక్కడే 28 పతకాలు సాధించారు. మనం కలలోనైనా అలాంటి క్రీడాకారులను తయారు చేయగలమా?’ అని ప్రశ్నించారు.
* నరసరావుపేటకు ఇండోర్ స్టేడియం కేటాయించారని, అలానే దేశంలోని ప్రతి నియోజకవర్గాలకు కేటాయించాలని వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.
* పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ ఇవ్వాలని తెదేపా లోక్సభ పక్షనేత రామ్మోహన్నాయుడు కోరారు. లోక్సభ జీరో అవర్లో గురువారం ఆయన మాట్లాడారు. జీఐ ట్యాగ్ ఇవ్వాలని తాను 2021లోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చానని, 2022లో ఆ ప్రక్రియ ప్రారంభమైందని సమాధానం ఇచ్చారన్నారు. జీఐ ట్యాగ్ ఇస్తే కార్మికులకు ఆదాయం పెరుగుతుందన్నారు.
* మహిళల భద్రత, సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేక స్లీపర్ క్లాస్ రైళ్లు ఏర్పాటు నడపాలని అమలాపురం ఎంపీ చింతా అనూరాధ కోరారు. లోక్సభ జీరో అవర్లో ఆమె మాట్లాడారు.
* కార్మికుల నియామకంలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించాల్సి ఉందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సూచించారు. లోక్సభలో గురువారం ఆమె మాట్లాడారు. వివిధ విభాగాల్లో మహిళల నియామకాలకు కోటాలు ఇవ్వాలని, ప్రోత్సాహకాలు పెంచాలని కేంద్రానికి విన్నవించారు.
రూ.12 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధికి 2022-23లో రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్సభలో వైకాపా ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.20,208 కోట్ల విలువైన హైవేల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని లక్ష్యంగా ఉందన్నారు. ఈ ఏడాది రహదారుల నిర్వహణకు రూ.213 కోట్లు, సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.408 కోట్లు కేటాయించామన్నారు. ఇందులో రూ.345 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం