నిరక్షరాస్యులూ.. పట్టభద్ర ఓటర్లే!
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగుచూస్తున్నాయి.
3, 5, 10 చదివినవారికీ ఓటు
ఒకే వ్యక్తి పేరు రెండు, మూడుసార్లు
శాసనమండలి పట్టభద్రుల ఓటర్ల జాబితాలో భారీగా అవతవకలు
వాలంటీర్లే సూత్రధారులు
నిమ్మకు నీరెత్తినట్లు ఎన్నికల సంఘం
ఈనాడు - అమరావతి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు లక్ష్యాలు విధించటంతో.. వాలంటీర్లు చెలరేగిపోయారు. నిరక్షరాస్యులు, 3, 5, 10, ఇంటర్ విద్యార్హతలున్నవారినీ పట్టభద్రులేనంటూ దరఖాస్తులు చేసేశారు. ఒకరి పేరుతోనే నాలుగైదు అర్జీలు పెట్టేశారు. ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే వారందరికీ జాబితాలో చోటు కల్పించేసింది. ఫలితంగా ముసాయిదా జాబితాలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు బయటపడుతున్నాయి. ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువసార్లు జాబితాలో కనిపిస్తున్నాయి.
విశాఖ జిల్లాలోనే 10 వేల మందికి పైగా
శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలో ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే డిగ్రీ విద్యార్హత లేని 2,163 మంది అనర్హులను ఓటరుగా నమోదు చేశారని, 8,486 మంది పేర్లు జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉన్నాయంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తాజాగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కడప- అనంతపురం- కర్నూలు, ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోనూ ఇదే పరిస్థితి. ఈ మూడు నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైకాపా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లకు లక్ష్యాలు విధించి భారీ ఎత్తున ఓటర్లను చేర్పించింది. వాలంటీర్లు గంపగుత్తగా ఎన్ని దరఖాస్తులిచ్చినా సరిగ్గా క్షేత్ర పరిశీలన కూడా చేయకుండానే ఆమోదించేశారని, అందువల్లే ముసాయిదా జాబితాలో పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వాలంటీర్లపై ఫిర్యాదులందినా చర్యలేవి?
ఓటరు నమోదు సహా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పనులూ వాలంటీర్లకు అప్పగించొద్దంటూ ఎన్నికల సంఘం నాలుగైదుసార్లు ఆదేశాలిచ్చింది. కానీ అమలయ్యేలా చూడలేదు. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలమైన వారి ఓట్లే చేర్పిస్తున్నారని, ప్రతిపక్షాల సానుభూతిపరులు, మద్దతుదారుల దరఖాస్తులను పరిగణనలోకి కూడా తీసుకోనివ్వడం లేదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందినా చర్యల్లేవు. ‘వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి. వైకాపా అభ్యర్థులను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలి’ అంటూ స్వయంగా మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలే సమావేశాలు పెట్టి మరీ ప్రకటించినా ఎన్నికల సంఘం వారి నుంచి కనీసం సంజాయిషీ కూడా కోరలేదు. ఇదే అలుసుగా వాలంటీర్లు పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్పించారన్న విమర్శలున్నాయి.
ఆన్లైన్లో ఇష్టారాజ్యంగా..
పట్టభద్రుల ఓటు ఆన్లైన్లోనూ నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించి డిగ్రీ పట్టాను అప్లోడ్ చేయాలి. చాలా మంది డిగ్రీ పట్టాకు బదులుగా ఏదో ఒక పత్రాన్ని లేదంటే వేరేవారి డిగ్రీ పట్టాను అప్లోడ్ చేసేశారు. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ధ్రువపత్రాలన్నీ చూసి అర్హులైతేనే ఓటర్లుగా అవకాశం కల్పించాలి. ఆ ప్రక్రియ సరిగ్గా జరగలేదు. చాలా చోట్ల బీఎల్వోలు ఈ పనిని వాలంటీర్లకు వదిలేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఓటు కోసం చివరి రోజున భారీగా వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం అనర్హులేవనన్న ఆరోపణలున్నాయి.
ఒకే వ్యక్తి పేరు.. ఒకటికి మించి పలుమార్లు
* విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని 220వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలోని సీరియల్ నంబర్ 125, 126, 127లలో ‘హారిక వెన్నెల’ అనే ఒకటే పేరు ఉంది. విద్యార్హత ఇంటర్మీడియటే.
* వైయస్ఆర్ జిల్లా ముద్దనూరు 52వ నంబర్ పోలింగ్ కేంద్రంలోని గొర్లె కిషోర్ (తండ్రి పేరు ఓబులేశు గొర్లె), ఖాదర్ మొహియుద్దీన్ షేక్, వెంకటరమణమ్మ బబ్బూరి, అట్లా బాల ఓబులేసు, చింతా అనిల్కుమార్రెడ్డి పేర్లు రెండేసిసార్లు ఉన్నాయి.
* ముసాయిదా జాబితాలో ఇలాంటి ఉదంతాలు వేల సంఖ్యలో ఉన్నాయి.
నిరక్షరాస్యులకూ ఓటు.. నిదర్శనాలివే
* విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడలోని 205వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో 705 వరుస సంఖ్యలో ఉన్న రాజారావు ముంజేటి, కణితిలోని 210వ నంబర్ పోలింగ్ కేంద్రంలో వరుస సంఖ్య 744లో ఉన్న చిత్రాడ మోహన్ నిరక్షరాస్యులు.
* రేగిడి ఆమదాలవలస మండలం ఉంగరాడమెట్టలోని 26వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో శాంతకుమార్ పెద్ద అనే పేరుంది. విద్యార్హత 5వ తరగతి.
* సంతకవిటి మండలంలోని 38వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితా వరుస సంఖ్య 300లో సుధీర్ ఇల్లిపిల్లి అనే పేరుంది. విద్యార్హత 3వ తరగతి.
* వైయస్ఆర్ జిల్లా కలసపాడులోని 1వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితా సీరియల్ నంబర్ 66లో ఉన్న బొమ్ము పెద్ద వీరయ్య విద్యార్హత పదో తరగతి.
అనర్హులను చేర్పించారు
వాలంటీర్లను ఉపయోగించుకుని వైకాపా అనర్హులను కూడా పెద్ద ఎత్తున పట్టభద్ర ఓటర్లుగా చేర్పించింది. విశాఖపట్నం జిల్లా జాబితాలోనే 11 వేల మందికి పైగా అనర్హులు ఉన్నట్లు మా పరిశీలనలో తేలింది. ఎన్నికల సంఘం సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఈ జాబితాలపై సమగ్ర విచారణ జరిపించాలి.
అజశర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
వాలంటీర్లతో చేయించిన దరఖాస్తుల్లో ఎక్కువ నకిలీవే
వాలంటీర్ల ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం నకిలీవే. ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు మండలాల్లోనూ దరఖాస్తు చేయించారు. చివరి నిమిషంలో పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను సరిగ్గా పరిశీలించకుండానే ఆమోదించారు. వీటిపై సమగ్ర విచారణ జరపాలి.
విఠపు బాలసుబ్రమణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా