Cyclone Mandous: తుపాను బీభత్సం
మాండౌస్ తుపాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తీవ్రమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. వైయస్ఆర్ జిల్లాలో వర్షాలకు గోడ కూలి ఒక మహిళ మృతిచెందారు. జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండి, పొంగి పొర్లాయి.
మాండౌస్ ప్రభావంతో పలు జిల్లాల్లో గాలులు.. వానలు
ఉద్ధృతంగా పొంగిన వాగులు.. వంకలు
నీట మునిగిన పొలాలు.. నేలకూలిన వృక్షాలు
వైయస్ఆర్ జిల్లాలో గోడ కూలి మహిళ మృతి
రాకపోకలకు తీవ్రంగా అంతరాయం
ఈనాడు, ఈనాడు డిజిటల్, న్యూస్టుడే యంత్రాంగం
మాండౌస్ తుపాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తీవ్రమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. వైయస్ఆర్ జిల్లాలో వర్షాలకు గోడ కూలి ఒక మహిళ మృతిచెందారు. జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండి, పొంగి పొర్లాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. చాలా జిల్లాల్లో రహదారులపై నీళ్లు ప్రవహించడంతో శనివారం రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభావిత జిల్లాల్లో ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. పంటనష్టాల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రధానంగా వరితో పాటు ఉద్యానపంటలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుపతి, చిత్తూరు, వైయస్ఆర్, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ తదితర జిల్లాలపై ఎక్కువ ప్రభావం కనిపించింది. తిరుపతి జిల్లాపై మాండౌస్ తుపాను ఎక్కువ ప్రభావం చూపించింది. అనేక ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు, కాజ్వేలు నీటమునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగి విద్యుత్తు లైన్లు, స్తంభాలపై పడ్డాయి. శనివారం ఉదయం తర్వాత వర్షం కొంతమేరకు తెరిపి ఇచ్చింది. శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ప్రాంతాల్లోని వరి నీటమునిగింది. కేబీపురం మండలంలోని కాళంగి జలాశయానికి భారీగా నీరు చేరడంతో పది గేట్లు ఎత్తి 16,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఆరు గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పుడిసికేపురం-ఎంఏ రాజులకండ్రిగ మధ్య కాజ్వే కొట్టుకుపోయింది. రేణిగుంట మండలం మల్లెమడుగు జలాశయం 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీకాళహస్తి-తడ మార్గంలో సున్నపుకాల్వపై బస్సు ఇరుక్కుపోగా, ప్రయాణికులను పోలీసులు సురక్షితంగా కిందకు దించారు. వాతావరణం అనుకూలించక హైదరాబాద్-రేణిగుంట-విశాఖ ఇండిగో విమానాన్ని రద్దుచేశారు. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడటంతో అధికారయంత్రాంగం వెంటనే వాటిని పూడ్చేసింది.
భక్తులపైనా ప్రభావం..
వర్షం కారణంగా తిరుమల శ్రీవారి భక్తులు ఇబ్బందిపడ్డారు. మొదటి ఘాట్రోడ్డులోని మలుపువద్ద వృక్షాలు కూలడంతో ట్రాఫిక్కు ఇబ్బంది ఏర్పడింది. కొండపై చెట్టు కూలి, పారిశుద్ధ్య కార్మికురాలికి స్వల్ప గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు శ్రీవారి మెట్టుమార్గం వైపునుంచి భక్తులను అనుమతించలేదు.
కూలిన ఇళ్లు.. తడిసిన ధాన్యం
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో భారీ కెరటాలు ఎగసిపడి తీరప్రాంత గ్రామాలపైకి వచ్చాయి. ఇళ్లు నేలకూలి.. మత్స్యకారులు పరుగులు తీశారు. ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం, కోనపాపపేట గ్రామాలపై కెరటాల ప్రభావం ఎక్కువగా పడింది. ఇళ్లు నేలకూలి సముద్రగర్భంలో కలిసిపోయాయి. బీచ్రోడ్డు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. దీనికి ఇటీవలే రూ.50లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టారు. కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిచిపోయింది.
సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు
సముద్రంలో వేటకు వెళ్లిన బాపట్ల జిల్లా చీరాల వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం తీరానికి రెండు కి.మీ. దూరంలో వారిని గుర్తించిన అధికారులు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఆరురోజుల క్రితం వేటకు వెళ్లారు. తుపాను ప్రభావంతో సిగ్నళ్లు లేక దారితెలియక గల్లంతయ్యారు. సిగ్నల్ రాగానే మెరైన్ పోలీసులకు చెప్పడంతో.. సహాయక చర్యలు మొదలుపెట్టారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒడ్డుకు చేర్చడం వీలుకాలేదు.
నీటమునిగిన పంటలు
నెల్లూరు నగరంతో పాటు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 13 వేల ఎకరాల్లో వరినాట్లు, పత్తి, వేరుశనగ, మినుము పంటలు నీటమునిగాయి. బొప్పాయి, అరటి, మిరప పొలాల్లోకి నీరు చేరింది. నెల్లూరు నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపైనా నీరు నిలిచి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గోడకూలి మహిళ మృతి
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం దర్జిపల్లిలో వర్షానికి ఓ ఇంటిగోడ కూలిపోవడంతో ఓ మహిళ మృతిచెందారు. దవంతరంపల్లికి చెందిన కొమ్ము పద్మావతి (42), తన భర్త చిన్ననాగయ్యతో కలిసి శుక్రవారం దర్జిపల్లిలోని తల్లి శంకరమ్మ ఇంటికి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం వంట చేస్తుండగా గోడ కూలిపోయింది. పద్మావతిపై గోడ రాళ్లు పడి.. ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.
నాయుడుపేటలో 28.1 సెం.మీ. వర్షం
ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: ఆరు జిల్లాల్లోని 32 మండలాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంది. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైయస్ఆర్, ప్రకాశం జిల్లాల్లో రెండురోజులుగా భారీ నుంచి అత్యంత భారీవర్షాలు కురిశాయి. రాయలసీమలోని శ్రీసత్యసాయి జిల్లాతోపాటు మిగిలిన జిల్లాల్లోనూ శనివారం వానలు కురిశాయి. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 మధ్య రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో 281 మి.మీ., బాలాయపల్లి మండలం హస్తకావేరిలో 241.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా పరిధిలో 30 గ్రామాలపై వర్షప్రభావం ఉండగా.. 3 పట్టణాలు, 10 గ్రామాలు ముంపుబారిన పడ్డాయని అధికారులు తెలిపారు. 160 ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
* శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8గంటల వరకు అత్యధికంగా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో 133 మి.మీ., ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లిలో 119.5, పీసీపల్లి మండలం పెద్ద అలవాలపాడులో 116 మి.మీ. వర్షపాతం నమోదైంది. 266 మండలాల్లో సగటున 10 మి.మీ. పైబడి వర్షం కురిసింది.
కోస్తాలో వీడని ముసురు
శనివారం ఉదయం నుంచి కోస్తావ్యాప్తంగా ముసురుపట్టింది. సాయంత్రం నుంచి చిరుజల్లులు మొదలయ్యాయి. కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి.
అల్పపీడనంగా బలహీనం.. నేడూ వర్షాలు
మాండౌస్ తుపాను తీవ్ర వాయుగుండంగా... తర్వాత వాయుగుండంగా మారి శనివారం సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురుస్తాయి. రాయలసీమలో అనేక చోట్ల తేలికపాటి వర్షాలు భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఉండొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
708 మందిని ఖాళీ చేయించాం
లోతట్టుప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 33 సహాయశిబిరాలను ఏర్పాటుచేశామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్ తెలిపారు. విపత్తుసంస్థ కార్యాలయంలో ఎండీ అంబేడ్కర్తో కలిసి ఆయన తుపాను సహాయచర్యలను సమీక్షించారు. ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
తమిళనాడులో భారీ వర్షాలు.. నలుగురి మృతి
ఈనాడు, చెన్నై: మాండౌస్ తుపాను తమిళనాడులోని పలు జిల్లాల్లో తీవ్రప్రభావం చూపుతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో తీరాన్ని తాకింది. శనివారం వేకువజామున గాలులు 65- 85కి.మీ. వేగంతో వీచాయని తమిళనాడు వాతావరణ విభాగం వెల్లడించింది. మామల్లాపురంలో చెట్లు నేలకూలాయి. చెన్నైలో 350పైగా భారీ వృక్షాలు నేలకూలి, కార్లు ధ్వంసమయ్యాయి. చెన్నైలో 30వేల మంది సిబ్బంది సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు. 10వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. శనివారం ఉదయం పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. కాశిమేడు ఫిషింగ్ హార్బర్లో పలు కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆ ప్రాంతంలో నష్టాన్ని పరిశీలించారు. మడిప్పాక్కంలో వర్షాలకు గుడిసె కూలడంతో లక్ష్మి (45), ఆమె అన్న కుమారుడు (25) మృతిచెందారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరు సమీపంలో పిళ్లైపాక్కంలో తుపాను ప్రభావంతో శుక్రవారం రాత్రి విద్యుత్తు తీగలు తెగి కిందపడ్డాయి. గమనించకుండా వాటిని తాకడంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు మరణించారు.
సహాయ చర్యలు చేపట్టండి
కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశం
భారీవర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది రాకుండా సహాయచర్యలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. శనివారం ఆయన తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షించారు. ప్రభావితప్రాంతాల్లో పరిస్థితులపై అక్కడి అధికారులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, సీఎంఓ ప్రత్యేక ప్రధానకార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టర్లు రెండురోజుల పాటు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. తిరుపతిలో వరదనీరు త్వరితగతిన దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తుపాను బాధితులను ఆదుకోవాలి: చంద్రబాబు
మాండౌస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచి, అవసరమైన మేర సహాయ సహకారాలు అందించాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవసరం మేరకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘‘విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు సాయం చేయాలి. తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మత్స్యకారుల్ని అప్రమత్తం చేయాలి...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అసలే పల్లెవెలుగు బస్సు. కుయ్యో.. మొర్రోమంటూ వెళ్తున్న అది కాస్తా ఇలా కూరుకుపోయింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని తాత్కాలిక ఆర్టీసీ బస్టాండులో పరిస్థితి ఇదీ!
ఈనాడు డిజిటల్, కడప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా