Hindupuram: అన్నం పెట్టరు.. పెట్టేవారికి చోటివ్వరు!

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ ఆసుపత్రి ప్రాంగణంలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్‌ను నిర్మించింది.

Published : 11 Dec 2022 08:22 IST

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ ఆసుపత్రి ప్రాంగణంలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్‌ను నిర్మించింది. అక్కడ రోజు 1,000 మంది ఆకలి తీర్చుకునేవారు.ఏపీలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్‌ను మూసివేసింది. ఆ భవనాన్ని వార్డు సచివాలయంగా మార్చింది. పేదల ఆకలి తీర్చాలనే తపనను మాత్రం అడ్డుకోలేకపోయింది. దాతలు మాత్రం తమ సేవా పథాన్ని మొబైల్‌ అన్న క్యాంటీన్‌ రూపంలో కొనసాగిస్తున్నారు. సిద్ధం చేసిన భోజనాన్ని వాహనంలో ఆసుపత్రి వద్దకు తెస్తున్నారు. ప్రధాన రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో వాహనం నిలిపి అవసరమైన వారికి వడ్డిస్తున్నారు. కూర్చొని తినేందుకు చోటు లేక అక్కడికొచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రూ.2లకే రోజుకు 1,000 మందికి భోజనం పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని