Andhra News: 12వ తేదీ.. అయినా జీతాల్లేవ్
ప్రభుత్వ ఉద్యోగి అంటే ఠంచనుగా ఒకటో తేదీన జీతం.. ఏదైనా డబ్బులు అవసరం పడితే జీపీఎఫ్, పీఎఫ్ నుంచి అడ్వాన్సులు, రుణాలు వెంటనే తీసుకునే సదుపాయం.. అవసరానికి ఆర్జిత సెలవుల డబ్బులు.. ఎప్పటికప్పుడు డీఏలు, పీఆర్సీలతో పెరిగే జీతం.. ఇదంతా ఒకప్పుడు.
ఇంకెన్నాళ్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఎదురుచూపులు
ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆందోళన
నిరసన తెలిపితే నోటీసులు.. ధర్నాలు చేస్తే కేసులతో వేధిస్తున్న ప్రభుత్వం
ఈనాడు - అమరావతి
ప్రభుత్వ ఉద్యోగి అంటే ఠంచనుగా ఒకటో తేదీన జీతం.. ఏదైనా డబ్బులు అవసరం పడితే జీపీఎఫ్, పీఎఫ్ నుంచి అడ్వాన్సులు, రుణాలు వెంటనే తీసుకునే సదుపాయం.. అవసరానికి ఆర్జిత సెలవుల డబ్బులు.. ఎప్పటికప్పుడు డీఏలు, పీఆర్సీలతో పెరిగే జీతం.. ఇదంతా ఒకప్పుడు.
ఎన్నికల ముందు..
ఉద్యోగిలో చిరునవ్వు ఉండాలి..
‘ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగి ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాడు. పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రావాల్సినవన్నీ కూడా సరిగ్గా సమయానికి వచ్చేటట్టుగా.. ప్రతి డీఏ సమయానికి వచ్చేటట్టు చేస్తానని ప్రతి ఉద్యోగికి హామీ ఇస్తున్నా.
ప్రతిపక్ష నేతగా జగన్
అధికారంలోకి వచ్చాక..
ఉద్యోగ సంఘాలకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి
ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి దిగుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తగదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి.
మంత్రి బొత్స
బటన్ నొక్కుడుతో పోల్చుకోవద్దు..
సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుతున్న సీఎం జగన్ తమకూ ఒక బటన్ నొక్కాలంటూ ఉద్యోగులు పోల్చుకోవడం సరికాదు. ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఇలాంటి ఆలోచన ఉంటే తీసేయాలి. సంక్షేమ పథకాలకు రూ.వేల కోట్లు పోతోంది..
సజ్జల
వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లకు నవంబరు నెల జీతం అందలేదు. ఆర్థిక అవసరాలకు డబ్బులు ఇవ్వాలంటూ చేసుకున్న దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో తెలియదు. డీఏ బకాయిలు ఇవ్వకుండానే ఆదాయపు పన్ను మినహాయించేస్తున్న వింత పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు రావల్సివన్నీ సకాలంలో అందిస్తామని ప్రతిపక్షనేతగా సెలవిచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పింఛనర్లు ప్రతి నెలా జీతం కోసం కూడా ఆందోళన పడే పరిస్థితి తెచ్చారు. గతంలో తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేసేవి. ఇప్పుడు జీతాల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రతి నెలా మొదట తారీఖున జీతాలు అందుకొని ఎన్ని నెలలవుతోందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పాలు పోసే వ్యక్తి నుంచి కిరాణా కొట్టులో బాకీ వరకు ప్రతి ఖర్చుకూ ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన పడుతున్నారు. ఒకటో తేదీ జీతం వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది రుణవాయిదాలను ప్రతి నెలా 10వ తేదీలోపే పెట్టుకున్నారు. దాదాపు సగం నెల గడిచే వరకు జీతాలు రాకపోవడంతో వాయిదాలకు వడ్డీ కింద ప్రతి నెలా రూ.600 నుంచి రూ.1,500 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. పింఛనర్లు మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల మందులు కొనుక్కునేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది.
ఆందోళన చేస్తే వేధింపులు
ఒకటో తేదీన జీతం ఇవ్వాలని ఆందోళన చేస్తే ఉపాధ్యాయులకు నోటీసులు ఇస్తున్నారు. అక్టోబరు నెల జీతాలు రాలేదని నవంబరులో విజయనగరం జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు నిరసనలు తెలిపారు. వెంటనే ఆర్జేడీ, డీఈవో, డిప్యూటీ డీఈవోలు ఉపాధ్యాయులపై వేధింపులకు దిగారు. జీతం ఆలస్యమైతే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నించడంతోపాటు ఉపాధ్యాయుల నుంచి వివరణ తీసుకున్నారు. ఇటీవల ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్), రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)లు వేతనాలు, ఇతర సమస్యలపై ఆందోళనలు నిర్వహించాయి. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి ధర్నాకు దిగితే అనుమతి ఇవ్వకుండా ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు. ఆందోళన, నిరసన, ధర్నా దేనికి పిలుపునిచ్చినా పోలీసుల మోహరింపు, ఉద్యోగులపై కేసులు సాధారణమైపోయాయి. జీతాల కోసం ఆందోళనలు చేయడం ఎప్పుడూ చూడలేదని సీనియర్ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
జీతాలు రాకపోవడం ఆందోళనకరం
చాలా మంది ఉపాధ్యాయులకు ఇప్పటికీ జీతాలు పడకపోవడం ఆందోళనకరం. ఆర్థికంగా రాష్ట్రానికి ఏ విధంగా ఇబ్బంది లేదంటూనే.. జీతాలు ఆపడం ఎంతవరకు సమంజసం? ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోతే డీటీఏ కార్యాలయాలను ముట్టడిస్తాం.
లంకలపల్లి సాయి శ్రీనివాస్, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం
పోరాడి సాధించుకోవాల్సి వస్తోంది
నెల రోజులు పని చేయించుకుని ఒకటో తేదీన జీతం ఇవ్వడం యాజమాన్య బాధ్యత. 12వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించకపోవడం అత్యంత దారుణమైన విషయం. పోరాటంతో జీతం సాధించుకోవడం ఎలాంటి ప్రజాస్వామ్యం?
వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, యూటీఎఫ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే