ISB: ఫలించిన దార్శనికత
అంతర్జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యను అభ్యసించేందుకు వార్టన్, బూత్, కెల్లాగ్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి విదేశీ విద్యా సంస్థలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. అటువంటి ప్రమాణాలను మనదేశంలో ఆవిష్కరించిన ఘనత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు (ఐఎస్బీ) దక్కుతుంది.
అగ్రశ్రేణి మేనేజ్మెంట్ విద్యా సంస్థగా ఎదిగిన ఐఎస్బీ
ఎన్నో రాష్ట్రాలు పోటీపడినా హైదరాబాద్లో ఏర్పాటు
రెండు దశాబ్దాల ఘన ప్రస్థానం
నేడు ద్వి దశాబ్ది వేడుకల ముగింపు
ముఖ్య అతిథిగా పాల్గొననున్న చంద్రబాబు
ఈనాడు, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యను అభ్యసించేందుకు వార్టన్, బూత్, కెల్లాగ్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి విదేశీ విద్యా సంస్థలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. అటువంటి ప్రమాణాలను మనదేశంలో ఆవిష్కరించిన ఘనత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు (ఐఎస్బీ) దక్కుతుంది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ విద్యా సంస్థ దినదిన ప్రవర్థమానమవుతూ, హైదరాబాద్కు ఎంతో ప్రతిష్ఠ తీసుకు రావడంతో పాటు దేశానికే గర్వకారణంగా ఎదిగింది. తాజాగా ఎఫ్టీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్- 2022లో ఐఎస్బీ 32వ స్థానాన్ని సంపాదించింది. ఆసియా- ఎఫ్టీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్- 2022లో 4వ స్థానంలో నిలిచింది. మనదేశంలో రీసెర్చ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉంది. ప్రజలకు మేలు చేసే పలు సామాజిక పరిశోధనా ప్రాజెక్టులపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో; కొన్ని వర్తక సంఘాలతో కలిసి పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మేనేజ్మెంట్ విద్యావేత్తలు, పలు వ్యాపార సంస్థల ప్రతినిధులను ఆకర్షిస్తూ, స్థానికంగా వ్యాపార నైపుణ్యాల విస్తృతికి కృషి చేస్తోంది. మనదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ఎన్నో ఏళ్లుగా ఉన్నత మేనేజ్మెంట్ విద్యను అందిస్తున్నాయి. కానీ అతి తక్కువ సమయంలో అత్యున్నత ప్రమాణాలను సాధించి, అంతర్జాతీయంగా మనదేశానికి గుర్తింపు తెచ్చిన ఘనత ఐఎస్బీకి దక్కుతుంది.
ఇంతటి కార్యాచరణతోనే
ఇంతటి అగ్రగామి సంస్థ మనదేశానికి రావడం, అదీ హైదరాబాద్లో ఏర్పాటు కావడం అత్యంత అరుదైన అవకాశమనే చెప్పాలి. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు దార్శనికతే ఇందుకు కారణం. మనదేశంలో అంతర్జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యా సంస్థను నెలకొల్పాలనే ఆలోచన మెకిన్సే అండ్ కంపెనీ చీఫ్ రజత్ గుప్తాది. రాహుల్ బజాజ్, ఆది గోద్రెజ్, అంబానీ.. వంటి కార్పొరేట్ అగ్రజులు రజత్ గుప్తా ఆలోచనను సమర్థించారు. 1997లో ఐఎస్బీ గవర్నింగ్ బోర్డు ఏర్పాటైంది. ఈ విద్యాసంస్థను ఎక్కడ స్థాపించాలనే ప్రశ్న వచ్చినప్పుడు.. సహజంగానే దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబయి వైపు గవర్నింగ్ బోర్డు మొగ్గుచూపింది. కానీ మరిన్ని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు రావడంతో, తుది నిర్ణయం తీసుకునే ముందు ఆయా రాష్ట్రాలలో పరిశీలించాలని బోర్డు భావించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు దీనికోసం పోటీ పడ్డాయి. ఇతర రాష్ట్రాలకు బోర్డు సభ్యులు వెళ్లినప్పుడు అక్కడి పాలకులు, అధికారులు కొంత తాత్సారం చేశారు. చంద్రబాబు మాత్రం చొరవ తీసుకుని, గవర్నింగ్ బోర్డు సభ్యులను స్వయంగా ఆహ్వానించి హైదరాబాద్లో ఐఎస్బీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలు వేగంగా విస్తరిస్తున్నందున ఐఎస్బీ వంటి అత్యున్నత స్థాయి మేనేజ్మెంట్ విద్యాసంస్థ ఏర్పాటైతే నగర ప్రతిష్ఠ ఇంకా పెరుగుతుందని ఆయన ఎంతో భావించారు. ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో గవర్నింగ్ బోర్డు హైదరాబాద్ను ఎంచుకుంది. 1999 డిసెంబరు 20న భవన నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2001 డిసెంబరు 2న అప్పటి ప్రధాని వాజ్పేయీ చేతుల మీదుగా ఐఎస్బీ ప్రారంభమైంది.
మే నెలలో ప్రారంభ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ
రెండు దశాబ్దాలు తక్కువ సమయం ఏమీ కాదు. గతాన్ని సమీక్షించుకుని, భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకోడానికి ఇదొక ముఖ్యమైన సందర్భం. అందువల్ల ద్వి దశాబ్ది వేడుకలను ఐఎస్బీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మే నెలలో ప్రారంభ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై, ఐఎస్బీ ప్రత్యేకతలను కొనియాడారు. లాభాపేక్షతో పాటు సమాజానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ఐఎస్బీ విద్యార్థులకు సూచించారు. తదుపరి ఎన్నో చర్చాగోష్ఠులనూ ఐఎస్బీ ఏర్పాటు చేసింది. ద్వి దశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగనుంది. దీనికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఐఎస్బీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు, ఫ్యాకల్టీ, ఇతర ముఖ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఐఎస్బీ వ్యవస్థాపక డీన్ డా.ప్రమత్ రాజ్ సిన్హా కూడా హాజరుకానున్నారు.
ప్రస్తుత పోస్ట్గ్రాడ్యుయేషన్ కోర్సులు ఇలా..
పీజీపీ: గ్లోబల్ ఎంబీఏకు సమానం. 2-25 ఏళ్ల అనుభవం కలిగిన వృత్తి నిపుణులకు ఏడాది శిక్షణ
పీజీపీ మ్యాక్స్: 10-25 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు 15 నెలల పోస్ట్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.
పీజీపీ ప్రో: 5+ అనుభవంతో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు పోస్ట్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్లో 18 నెలల శిక్షణ
పీజీపీ ఎంఎఫ్ఏబీ: కుటంబ వ్యాపారాల్లో 0-5 ఏళ్ల అనుభవం కలిగిన వారికి 15 నెలల శిక్షణ
మారిన రూపురేఖలు
రాయదుర్గం, న్యూస్టుడే: ఐఎస్బీకి శంకుస్థాపన జరిగినప్పుడు నానక్రాంగూడలోని ఈ ప్రాంతం చెట్లు, పొదలతో ఉండేది. చంద్రబాబు చొరవతోనే అమెరికా వెలుపల మైక్రోసాఫ్ట్ తొలి కార్యాలయం హైదరాబాద్లోనే, ఐఎస్బీ చెంతనే ఏర్పాటైంది. ఇదే రోడ్డులో ఇన్ఫోసిస్, విప్రో ప్రాంగణాలున్నాయి. సమీపంలోనే క్యాప్జెమినీ కార్యాలయం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ఐటీ మంత్రిగా కె.టి.రామారావు చొరవతో అమెజాన్ సంస్థ రెండో అతిపెద్ద కేంద్రం కూడా ఐఎస్బీకి కొంత దూరంలోనే ఏర్పాటైంది. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో తమ కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. ఫైనాన్షియల్ జిల్లాలో ఆర్థిక సంస్థలు, ఐసీఐసీఐ బ్యాంక్ టవర్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థలు, స్టార్ హోటళ్లు శరవేగంగా వచ్చాయి. పరిసర ప్రాంతాల్లో విలాసవంత బహుళ అంతస్తుల భవనాలను నెలకొల్పారు. ఐటీ సంస్థలు కొలువుదీరిన వేవ్రాక్, క్యూసిటీ వంటి ఐటీ భవనాలు, పలు సంస్థల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలూ వచ్చాయి. సమీపంలోని కోకాపేటకూ ఐటీ సదుపాయాలు విస్తరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం