Andhra News: సర్వం అమూల్‘పాలు’
సహకార డెయిరీలను పునరుద్ధరించి చూపిస్తానని, లీటరుకు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు శపథం చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక దానికి చాపచుట్టేసి అమూల్ జపం చేస్తున్నారు.
99 ఏళ్లు లీజుకివ్వడమే పునరుద్ధరణా?
డెయిరీలకు రూ. 3,000 కోట్ల విలువైన ఆస్తులు
నామమాత్రపు ధరతో అమూల్కు అప్పగింత
లీటరుకు రూ. 4 బోనస్ హామీకి మొండిచేయి
మూడున్నరేళ్లకు రూ. 1,108 కోట్లు ఇవ్వాలి
హామీలపై మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్
ఈనాడు - అమరావతి
అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 చొప్పున రాయితీ ఇస్తాం.
2019 మార్చి 24న ప్రస్తుత బాపట్ల జిల్లా రేపల్లెలో జగన్మోహన్రెడ్డి
చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తాం. ఆ డెయిరీకి పాలు పోసిన ప్రతి రైతుకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్గా ఇస్తామని చెబుతున్నా..
2018 జనవరి 3న ప్రస్తుత అన్నమయ్య జిల్లా పీలేరులో జగన్మోహన్రెడ్డి
* డెయిరీలను పునరుద్ధరించడమంటే వందల కోట్ల విలువైన ఆస్తుల్ని 99 ఏళ్ల లీజుకు అప్పనంగా కట్టబెట్టడమా? నడుస్తున్న ఒంగోలు డెయిరీని కావాలనే మూయించేయడమా? 99 ఏళ్ల లీజు అంటే హక్కుల్ని పూర్తిగా వదులుకున్నట్లు కాదా?
* పాడి రైతులందరికీ లీటరుకు రూ.4 బోనస్ అనే ఊసే లేదు. అమూల్ ద్వారా లీటరుకు రూ.10 వరకు ఎక్కువ ధర ఇప్పిస్తున్నాం.. అదే గొప్ప అన్నట్లుంది ముఖ్యమంత్రి తీరు. ప్రైవేటు డెయిరీలతో పోలిస్తే అంత గొప్ప ధరలేమీ దక్కడం లేదన్నది రైతుల వాదన.
సహకార డెయిరీలను పునరుద్ధరించి చూపిస్తానని, లీటరుకు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు శపథం చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక దానికి చాపచుట్టేసి అమూల్ జపం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సొంత బ్రాండ్ ‘విజయ’ డెయిరీని పక్కకు నెట్టేసి గుజరాత్ సహకార సంఘాలకు పెద్దపీట వేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూతపడిన డెయిరీలతోపాటు నడుస్తున్న వాటినీ మూయించి అమూల్కే అప్పగించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలితో భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో డెయిరీ అనేదే ఉండదు. అంతా అమూల్మయమే. అప్పుల భారం, వాటిని చెల్లించే బాధ్యతను ఏపీ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ దశాబ్దాల పాటు మోయాల్సి వస్తుంది. అమూల్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు, కట్టబెట్టేందుకు సై అంటున్న ముఖ్యమంత్రికి.. బోనస్ ఇచ్చేందుకు మాత్రం మనసు రావడం లేదు. రాష్ట్రంలో ఏపీడీడీసీఎఫ్ పరిధిలోని డెయిరీలకు రూ. 3,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అంచనా. సుమారు 700 ఎకరాల వరకు భూములు ఉండగా.. వాటి విలువే రూ. 1,500 కోట్ల వరకు ఉంటుంది. ఒంగోలు, అనంతపురం, హిందూపురం, రాజమహేంద్రవరం, కంకిపాడు, పులివెందుల, ఏలూరు జిల్లా కొత్తపల్లిలో డెయిరీలు ఉన్నాయి.
మూతపడిన, పనిచేస్తున్న డెయిరీల్లో మొత్తం 141 బల్క్మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8 పాల ప్రాసెసింగ్ ప్లాంట్లు, రెండు మిల్క్ చిల్లింగ్ కేంద్రాలు, మదనపల్లెలో యూహెచ్టీ ప్లాంట్తోపాటు ఒంగోలులో 3,000 టన్నుల సామర్థ్యంతో పాలపొడి ప్లాంట్ ఉన్నాయి. వీటన్నింటికి కలిపి ప్రభుత్వం గతంలో నిర్ణయించిన లీజు ధర రూ. 3.38 కోట్లు మాత్రమే. ఏడాదికి 3% చొప్పున పెంచుతామని ప్రతిపాదించారు.
అప్పనంగా కట్టబెట్టడమే లక్ష్యంగా
వైకాపా ప్రభుత్వం సహకార డెయిరీల పునరుద్ధరణ అనే పదాన్నే మరచిపోయింది. ఒక్క డెయిరీని కూడా నిర్వహణలోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అన్నీ అమూల్కు కట్టబెట్టే దిశగా చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె యూహెచ్టీ ప్లాంట్ను అమూల్కు అప్పగించింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్లాంట్కు రూ.15 కోట్ల వ్యయంతో యంత్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా మూతపడిన చిత్తూరు డెయిరీని 99 ఏళ్ల లీజుకు ఇస్తూ డిసెంబరు 13న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో ఒంగోలు డెయిరీతోపాటు మిగిలిన వాటిని కూడా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అమూల్ సంస్థ వద్దనడంతోనే కొన్నిటిని పక్కన పెట్టింది. లేదంటే ఇప్పటికే అన్నిటికి లీజులు పూర్తయ్యేవని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి.
గతంలో.. సర్కారు చేయూత ఇలా!
రుణభారం పెరిగిపోయి.. బకాయిల్ని చెల్లించలేని స్థితికి చేరుకున్న డెయిరీలకు గతంలో ప్రభుత్వం ఆర్థిక భరోసా అందించింది. సంక్షోభంలో ఉన్న విజయ డెయిరీని కాపాడేందుకు 1998లో అప్పటి సీఎం చంద్రబాబు.. ఎన్డీడీబీ ద్వారా రూ.4 కోట్లు, ప్రభుత్వం నుంచి రూ.4 కోట్లు, ఆప్కాబ్ ద్వారా రుణం రూ.4 కోట్లు కలిపి మొత్తం రూ.12 కోట్లు సమకూర్చారు. దీంతో విజయా డెయిరీ మనుగడ సాధ్యమైందని అధికారులు పేర్కొంటున్నారు. 2017లోనూ ఒంగోలు డెయిరీ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు రూ.35 కోట్లు మంజూరు చేశారు.
బోనస్గా మూడున్నరేళ్లకు రూ. 1,108 కోట్లు
సహకార డెయిరీలకు రోజూ 22 లక్షల లీటర్ల పాలు పోస్తున్నట్లు అంచనా. వీరందరికి లీటరుకు రూ.4 చొప్పున బోనస్గా ఇస్తే రైతులకు నెలకు రూ.26 కోట్లు చొప్పున మూడున్నరేళ్లలో రూ.1,108 కోట్లు చెల్లించాలి. అమూల్ ద్వారా అధిక ధర వచ్చేలా చేస్తున్నామంటున్న సీఎం.. తానిచ్చిన హామీకి నీళ్లొదిలారు.
రెండు పాడి పశువుల రైతుకు రూ.8,000
* వాస్తవానికి 8 నెలల పాడి కాలంలో సగటున ఒక్కో పశువుకు 2,000 లీటర్ల పాలు వస్తాయనుకుంటే.. లీటరుకు రూ.4 చొప్పున బోనస్గా రూ.8,000 అందుతాయి. రెండు పాడి పశువులు ఉన్న కుటుంబానికి రూ. 16,000 వస్తే వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది.
* డెయిరీలను మూసివేయించడం, మూతపడిన వాటిని అమూల్కు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కూడా నామమాత్రపు లీజుపై అప్పనంగా ఇస్తోంది. అమూల్కు సౌకర్యాల కల్పన పేరుతో ఆటోమేటిక్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లకు రూ.3,000కు పైగానే ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇందులో సగం ఖర్చు చేసినా సంక్షోభంలో ఉన్న వాటితోపాటు మూతపడిన పరిశ్రమలను తిరిగి వినియోగంలోకి తెచ్చే వీలుంటుంది. అయితే ప్రభుత్వం ఆ ఆలోచనే చేయడం లేదని పాడిరంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
అన్నా.. అమూల్కే ఇచ్చేయ్
‘అన్నా.. ఆ డెయిరీని అమూల్కు అప్పగించెయ్.. మీరడిగిన సాయం చేస్తా’.. ఏదైనా ఆర్థిక సాయం అందుతుందనే ఆశతో వచ్చిన సొంతపార్టీకే చెందిన ఒక డెయిరీ ఛైర్మన్కు జగన్ సలహా ఇది. దీంతో కంగుతినడం రాయలసీమకు చెందిన ఆయన వంతయింది. సీఎం అంతటితో ఊరుకోలేదు. తన కార్యాలయ అధికారులను పిలిచి ‘అమూల్కు అప్పగించే పని చూడమని’ అప్పగించారు.
‘నీకేం పనిలేదా? ఎందుకు వచ్చావ్.. సరే.. ఇంకెప్పుడూ ఇటు చూడకు..’ అని కొందరు అధికారులే ఆ డెయిరీ ఛైర్మన్కు సలహా ఇచ్చారంటే సీఎం నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.
* సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటామని పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు పేర్కొంటున్నారు. అంటే దాన్ని కూడా తీసుకుని అమూల్కు అప్పగిస్తారా? అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
అమూల్ కోసం ఒంగోలు డెయిరీ మూయించేసింది
వైకాపా అధికారంలోకి వచ్చాక అమూల్ను రాష్ట్రంలోకి ఆహ్వానించింది. వారికి కట్టబెట్టేందుకు ఏకంగా ఒంగోలు డెయిరీ మూసివేతకే కంకణం కట్టుకుంది. అప్పటి వరకు రోజుకు 50,000 లీటర్ల వరకు పాలు వస్తుండగా.. సేకరణ ఆపేయాలని ఆదేశించింది. పాడి రైతులకు బకాయిలతోపాటు, ఉద్యోగుల వీఆర్ఎస్కు సుమారు రూ.80 కోట్లు విడుదల చేసింది. తర్వాత అమూల్కు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. అయితే నిర్వహణ వ్యయం అధికం అవుతుందనే ఆలోచనతో.. అమూల్ దీన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో డెయిరీలోని విలువైన ఆస్తులు నిరుపయోగంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు