Mohan babu: ‘పోలీసులు ప్రభుత్వాలకు తొత్తులుగా పనిచేయాల్సి వస్తోంది’
‘పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం, మర్యాదలు ఉన్నాయి. అయితే... అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి పోలీసులు తొత్తులుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది...’ అని సినీనటుడు మోహన్బాబు విమర్శించారు.
‘లాఠీ’ సినిమా వేడుకల్లో సినీ నటుడు మోహన్బాబు
తిరుపతి (జీవకోన), తిరుపతి విద్య, న్యూస్టుడే: ‘పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం, మర్యాదలు ఉన్నాయి. అయితే... అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి పోలీసులు తొత్తులుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది...’ అని సినీనటుడు మోహన్బాబు విమర్శించారు. తిరుపతి నగరంలోని ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన ‘లాఠీ’ సినిమా ముందస్తు విడుదల వేడుకలకు హీరో విశాల్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ.. ‘పోలీసులకే మొదట నిజాలు తెలుస్తాయి. అయినా... సమాజంలో జరుగుతున్న తప్పులను కళ్లారా చూసి కూడా ఇది తప్పు అని చెప్పలేని స్థితిలో వారు ఉన్నారు. ఒకవేళ తప్పును తప్పు అని చెబితే తమ ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం వారిలో ఉంది...’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో సినీనటుడు విశాల్ మాట్లాడుతూ.. తనకు చంద్రబాబునాయుడు అంటే చాలా ఇష్టమని, ఆయనతో పోటీ లేదన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం