Andhra News: పొట్టకూటికి ప్రాణాలు పణం
‘తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై’ అన్న కవి అలిశెట్టి హృదయ వేదన ఆ విధి వంచితులకు అచ్చంగా సరిపోతుంది. పొట్టకూటికి వ్యభిచారమనే మురికి కూపంలోకి వారు వెళ్లక తప్పడం లేదు.
మహిళా సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమం
ఏటా 10నుంచి 15శాతం కొత్తగా వృత్తిలోకి..
అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో అధికం
కేంద్ర నివేదిక వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై’ అన్న కవి అలిశెట్టి హృదయ వేదన ఆ విధి వంచితులకు అచ్చంగా సరిపోతుంది. పొట్టకూటికి వ్యభిచారమనే మురికి కూపంలోకి వారు వెళ్లక తప్పడం లేదు. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్లోనూ ఈ జాడలు విస్తరిస్తున్నాయి. దేశంలో మహిళా సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనని కేంద్ర నివేదిక వెల్లడిస్తోంది. వేశ్యా వృత్తిలోకి ప్రవేశించేవారి సంఖ్య రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. ఇది 10నుంచి 15 శాతం వరకు ఉంటోంది. కొత్తగా వృత్తిలోకి వస్తున్నవారి వయసు సరాసరి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటోంది. జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బాధ్యతలు, విలాస జీవితాలకు అలవాటుపడటం వంటి కారణాలు దీనికి కారణమవుతున్నాయి. దేశంలోనే హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో (2.09 లక్షలు) ఉంది. మహారాష్ట్రలో 3.94 లక్షలు, కర్ణాటకలో 2.76 లక్షల మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు.
నేటివ్ సెక్స్వర్కర్లు ఏపీలో ఎక్కువ
వేశ్యా వృత్తి ఆధారంగా స్థానికంగా జీవించే సెక్స్ కార్మికులు (నేటివ్ సెక్స్ వర్కర్లు) ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ (1.33 లక్షల మంది) తొలి స్థానంలో ఉంది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ, సేవా సంస్థల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వీరి సంఖ్య ఎక్కువ. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ ఎక్కువే. ఈ జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి కడప జిల్లాలో వీరి సంఖ్య తక్కువ. కరవు కాటకాలు, జీవనోపాధి దొరక్క సీమలో చాలా మంది ఈ కూపంలో కూరుకుపోతున్నారు. ఈ జిల్లాల మీదుగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్లే జాతీయ రహదారులు ఉండటమూ సంఖ్య పెరిగేందుకు కారణమవుతోంది. ఈ సెక్స్వర్కర్లలో 1,450 మందికి హెచ్ఐవీ సోకినప్పటికీ మందులు వాడుతూ వృత్తిని కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలో నేటివ్ సెక్స్వర్కర్లు 59,785 మంది ఉన్నారు. దిల్లీలో 46,786 మంది, తక్కువగా మిజోరంలో 833 మంది ఉంటున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి వలస
ఏపీకి పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చి వేశ్యా వృత్తిలో ఉన్నవారు 11,639 మంది ఉన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, అసోం, బిహార్, అరుణాచల్ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నిర్మాణ, ఇతర రంగాల్లో పని చేస్తున్న కొందరు వేశ్యావృత్తిని కొనసాగిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వలసవెళ్లి మహారాష్ట్రలో పడుపు వృత్తిలో ఉన్నవారు 6,06,689 మంది ఉండటం గమనార్హం. ఆ తరువాత గుజరాత్లో 2.08 లక్షలు, దిల్లీలో 1.85 లక్షల చొప్పున జీవిస్తున్నారు.
* స్వలింగ సంపర్కులు దేశవ్యాప్తంగా 1,66,844 మంది ఉన్నారు. 25,690 మందితో ఈ జాబితాలో ఏపీది మూడో స్థానం. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. తమిళనాడులో 46,859, కర్ణాటకలో 34,988 మంది చొప్పున స్వలింగ సంపర్కులు ఉంటున్నారు.
* హిజ్రాలు దేశవ్యాప్తంగా 57,934 మంది ఉండగా 4,157 మంది ఉన్న ఏపీది ఐదో స్థానం. దిల్లీలో 9,415, మహారాష్ట్రలో 8,989, తమిళనాడులో 7,872, ఉత్తరప్రదేశ్లో 4,681 మంది చొప్పున జీవిస్తున్నారు.
* జీవనోపాధికి ఇతర రాష్ట్రాలకు వెళ్లే లారీ డ్రైవర్లు, క్లీనర్లు దేశవ్యాప్తంగా 30వేల మంది వరకు సెక్స్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ కేటగిరీలో ఏపీది 15వ స్థానం.
దేశంలో 8,25,055 మంది మహిళా సెక్స్వర్కర్లు
దేశంలో 2021 జనవరి నుంచి అదే ఏడాది సెప్టెంబరు మధ్య చేసిన అధ్యయనం ప్రకారం 8,25,055 మంది మహిళా సెక్స్ వర్కర్లున్నారు. ఇందులో 1,33,447 మంది సెక్స్ వర్కర్లతో ఏపీది తొలి స్థానం. కర్ణాటకలో 1,16,288 మంది, తెలంగాణ 1,00,818, తమిళనాడులో 65,818 మంది చొప్పున ఉన్నారు. 2005లో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ప్రస్తుతమున్న ఏపీ పరిధిలో 65వేల మంది సెక్స్ వర్కర్లు నివసిస్తున్నారు. 2022నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటింది. ఉమ్మడి అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కోచోట 17వేల మందికిపైగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో 13,781, కర్నూలులో 12,709, చిత్తూరు జిల్లాలో 10,296 మంది చొప్పున ఉన్నారు. ప్రకాశం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 6వేల నుంచి 8వేల మధ్యన ఉన్నారు. కడప, విశాఖ, విజయనగరం జిల్లాల్లో 2వేల నుంచి 4వేల మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాస్త తక్కువ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్