ఓటర్ల జాబితాలో మీ పేరుందా?
మీరు ఆంధ్రప్రదేశ్ పౌరుడా? ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి. ‘ఉండకుండా పోతుందా’ అనే భరోసా వద్దే వద్దు.
ఉంటుందిలే అనే భరోసా వద్దే వద్దు
వెంటనే తనిఖీ చేసుకోండి
లేదని నిర్ధారణైతే మళ్లీ దరఖాస్తు చేసుకోండి
అలక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓటేసే అవకాశం కోల్పోయే ప్రమాదం
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
మీరు ఆంధ్రప్రదేశ్ పౌరుడా? ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి. ‘ఉండకుండా పోతుందా’ అనే భరోసా వద్దే వద్దు. మా దగ్గర ఓటరు గుర్తింపు కార్డు ఉందిగా.. జాబితాలో పేరు ఉంటుందిలే అనే ధీమా అసలే వద్దు. ఎందుకంటే ఈసారి ఓటర్ల జాబితాలో పేర్లు చేర్పులు, తొలగింపులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. చాలా మందికి నోటీసులివ్వకుండానే వారి పేర్లు జాబితా నుంచి తీసేశారు. ఈ నేపథ్యంలో జాబితాలో మీ పేరుందో లేదో తనిఖీ చేసుకోవడంలో అలక్ష్యం వహిస్తే రాబోయే ఎన్నికల్లో ఓటేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకోండి. మీ పేరు లేదని తేలితే వెంటనే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండి.
ఓటర్ల జాబితాలో మీ పేరుందా.. లేదా ఎలా చూసుకోవాలంటే..
మార్గం-1
https://ceoandhra.nic.in వెబ్సైట్లోకి వెళితే పై భాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాల ‘ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్-2023’ అనే ఉప విభాగం కనిపిస్తుంది. వాటిపై క్లిక్ చేసి మీ జిల్లా, శాసనసభ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్లో ఉంటాయి. మీరు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తారో చూసుకుని ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి మీ పేరుందా లేదా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోనే పై భాగంలో ‘సెర్చ్ యువర్ నేమ్’ అనే ఉప విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే https://voterportal.eci.gov.in మరో వెబ్సైట్లోకి లింక్ వెళ్తుంది.
మార్గం-2
https://voterportal.eci.gov.in వెబ్సైట్ తెరవగానే..‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి...మీ ‘ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య’ను నమోదు చేస్తే జాబితాలో మీ పేరుందా లేదా, ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది, సీరియల్ నంబర్ వంటి వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య తెలియకపోతే.. ‘అడ్వాన్స్ సెర్చ్’ అనే విభాగంలోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు నమోదు చేసి, జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవచ్చు.
మార్గం-3
www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్లి ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగంపై క్లిక్ చేయాలి. ‘సెర్చ్ బై డిటెయిల్స్’, ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే రెండు ఉప విభాగాలుంటాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు లేదా ఓటరు గుర్తింపుకార్డు సంఖ్యను నమోదు చేసి, జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవచ్చు.
మార్గం-4
ప్లే స్టోర్లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన VoterHelpline అనే మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నంబర్, వివరాలు పొందుపరిచి రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి. యాప్లోకి వెళ్లగానే పై భాగంలో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డిటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే నాలుగు విభాగాలు కనిపిస్తాయి. వీటిలో మొదటి రెండు విభాగాలకు సంబంధించి మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్ కోడ్ను యాప్లో స్కాన్ చేయటం ద్వారా లేదా ఫొటో ఓటరు గుర్తింపుకార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవచ్చు. మీ పేరు, తండ్రి పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపరచటం ద్వారా లేదా ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య పొందుపరచటం ద్వారా కూడా జాబితాలో పేరుందా లేదా నిర్ధారించుకోవచ్చు.
మార్గం-5
ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ స్థాయి అధికారి (బీఎల్వో) ఉంటారు. వారి వద్ద ఉండే ఓటర్ల జాబితాను పరిశీలించి మీ పేరుందా లేదా చూసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శించే ఓటర్ల జాబితాలో కూడా మీ ఓటుందో లేదో పరిశీలించుకోవచ్చు.
ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండిలా...
ఆన్లైన్ ద్వారా
1 www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్లి ముందుగా మీ ఫోన్ నంబర్తో రిజిస్టర్ చేసుకుని, లాగిన్ కావాలి. వెబ్సైట్లోకి ప్రవేశించిన వెంటనే పక్కనే ‘రిజిస్టర్ యాజ్ ఏ న్యూ ఓటర్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ‘ఫారం-6: అప్లికేషన్ ఫాం ఫర్ న్యూ ఓటర్స్’ అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ ఆన్లైన్ దరఖాస్తు వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నీ నింపాలి. తర్వాత మీ ఫోన్ నంబర్కు ఒక రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దాని ఆధారంగా ఈ వెబ్సైట్లో మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్ స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక జాబితాలో మీ పేరు చేరుస్తారు.
2 https://voterportal.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి తొలుత మీ ఫోన్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయ్యి వెబ్సైట్లోకి ప్రవేశించిన వెంటనే ‘న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకుంటూ వెళ్లి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నింపి సమర్పించాలి.
3 భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన VoterHelpline మొబైల్ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్, వివరాలు పొందుపరిచి రిజిస్టర్ చేసుకోవాలి. వాటి ఆధారంగా లాగిన్ కావాలి. ‘ఓటరు రిజిస్ట్రేషన్’ విభాగంలోకి వెళితే ‘న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్’ అని వస్తుంది. దానిపై క్లిక్ చేసుకుంటూ వెళ్లి... అందులో అడిగిన వివరాలన్నీ నింపి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
4 https://ceoandhra.nic.in వెబ్సైట్లోకి వెళ్లి కూడా ఎన్వీఎస్పీ, ఓటర్ పోర్టల్ వెబ్సైట్ లింకుల్లోకి వెళ్లొచ్చు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్లైన్ ద్వారా
1 బూత్ స్థాయి అధికారులకు (బీఎల్వో) నేరుగా ఫారం-6 దరఖాస్తులు సమర్పించొచ్చు.
2 ప్రతి నియోజకవర్గంలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోల) కార్యాలయాల్లోనూ దరఖాస్తులు సమర్పించొచ్చు. ప్రతి మండలంలోనూ తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వో)గా నియమించారు. ఆ కార్యాలయాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు. దరఖాస్తులపై విచారించి ఓటు హక్కు కల్పిస్తారు.
ఎప్పటి వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు?
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు తుది గడువు తేదీ వరకూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ దరఖాస్తు ఎందుకంటే?
ఫాం 6: కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవటానికి.
ఫాం 7: ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లు చేర్చటం లేదా అర్హుల పేర్లు తొలగించటంపై అభ్యంతరాలు తెలియజేసేందుకు.
ఫాం-8: ఓటర్ల జాబితాలో పేరు, ఫొటో, వయసు, ఓటరు గుర్తింపుకార్డు సంఖ్య, చిరునామా తదితర వాటిల్లో మార్పులు, సవరణలకు .
ఫాం 8ఏ: ఒకే నియోజకవర్గంలో ఒకచోట నుంచి మరో చోటుకు ఓటు హక్కును మార్చుకోవడానికి.
సందేహాలుంటే: ఓటు హక్కు నమోదు సహా ఇతరత్రా ఏవైనా సందేహాలుంటే 1950 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె