ఎన్టీఆర్ వంటి నాయకుడు అవసరం
ప్రస్తుత రాజకీయాల్లో ఎన్టీఆర్ వంటి నాయకుడు అవసరమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
హైదరాబాద్, న్యూస్టుడే: ప్రస్తుత రాజకీయాల్లో ఎన్టీఆర్ వంటి నాయకుడు అవసరమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల్లో భాగంగా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో.. సినీ నటుడు, జయభేరి సంస్థల అధినేత ఎం.మురళీమోహన్కు ‘ఎన్టీఆర్ సిల్వర్ క్రౌన్ నట పురస్కారం-2023’, బీమా పాలసీదారులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ గుర్తింపు సాధించిన కౌటికె విఠల్కు ‘ఎన్టీఆర్ శ్రమశక్తి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని స్థాపించిన 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో సీల్వెల్ కార్పొరేషన్ ఛైర్మన్ బండారు సుబ్బారావు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్గుప్తా, దర్శకులు రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా