తెల్లబోయిన నల్లబల్ల!
ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్దుబాటులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కొన్ని జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పాఠాలు చెప్పేందుకు గురువులే లేకుండాపోయారు.
వివిధ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పరిస్థితి తీవ్రం
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్దుబాటులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కొన్ని జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పాఠాలు చెప్పేందుకు గురువులే లేకుండాపోయారు. నిబంధనల ప్రకారం 70% పదోన్నతులు, 30% నేరుగా నియామకాలు చేపట్టాలి. ఇందుకు విరుద్ధంగా 100% పదోన్నతులతో భర్తీ చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ఎస్జీటీల కొరత ఉంది. ఇలాంటిచోట వందశాతం పదోన్నతులు నిర్వహించడంతో అనేక పాఠశాలలు ఖాళీ అయ్యాయి. పదోన్నతులు, బదిలీలకు సంబంధించి న్యాయస్థానంలో కేసులు ఉన్నందున సర్దుబాటు పేరిట దీన్ని పూర్తి చేస్తున్నారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత బడులకు తరలించింది. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ఎస్జీటీలకు వందశాతం పదోన్నతులు కల్పించారు. ఇప్పుడు చాలా జిల్లాల్లో ప్రాథమిక స్థాయిలో పాఠాలు చెప్పేవారే కరవయ్యారు.
ఎక్కడి నుంచి తెస్తారు?
రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు. ఇందులో 70% పదోన్నతులను గత ఏడాది అక్టోబరులోనే కల్పించారు. అప్పటికీ చాలాచోట్ల సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దాంతో తాజాగా మిగతా 30శాతానికి పదోన్నతులు ఇచ్చారు. వీరందర్నీ 27న కొత్త బడుల్లో చేరిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. తెలుగు, హిందీ పండితుల పదోన్నతులు పెండింగ్లో ఉన్నందున ఇంకా కొన్నిచోట్ల ఉపాధ్యాయులు మిగిలారు. ఈ సబ్జెక్టులకూ పదోన్నతులు కల్పించి ఉంటే మరిన్ని పోస్టులు ఖాళీ అయ్యేవి. ఒకేసారి పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు లేకుండా పోతుండడంతో క్షేత్రస్థాయిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తాత్కాలికంగా సర్దుబాటు చేయాలని, లేదంటే డీఎస్సీ-98 వారికి వెంటనే పోస్టింగులు ఇచ్చి ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు వినతిపత్రాలు సమర్పించాయి. కొన్ని జిల్లాల్లో ఎస్జీటీల కొరత ఉన్నందున ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది.
భారీగా పెరిగిన ఏకోపాధ్యాయ బడులు
ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల తరలింపు, పదోన్నతులు కారణంగా ఏకోపాధ్యాయ బడుల సంఖ్య భారీగా పెరిగింది. 1-5 తరగతులు ఉండే బడుల నుంచి 3, 4, 5 తరగతుల వారు వెళ్లిపోవడంతో విద్యార్థుల సంఖ్యా తగ్గిపోయింది. విద్యార్థులు 20లోపు ఉంటే ఒకే టీచర్ను ఇచ్చారు. దీంతో అప్పటివరకు ఉన్న రెండో పోస్టు పోయింది. ఎస్జీటీలకు పదోన్నతుల కారణంగా కొన్ని బడుల్లో ఒక్కొక్కరే మిగిలారు. రాష్ట్రంలో 2020లో ఏకోపాధ్యాయ బడులు 7,774 ఉండగా.. ఇప్పుడు వీటి సంఖ్య 10వేలకుపైగా చేరింది. ఇలాంటిచోట టీచర్ సెలవు పెడితే పక్కవారిని పంపించడం, లేదంటే బడికి సెలవు ఇవ్వడంలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం బరకాల, కడమలకల్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరేసి సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) ఉండగా.. అందరికీ స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)గా పదోన్నతులు ఇచ్చారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాధపురం, జిల్లెడు బుడకల ప్రాథమిక బడుల్లో ఉన్న ఇద్దరేసి ఉపాధ్యాయులకూ పదోన్నతులు లభించాయి. వీరంతా ఈనెల 27న కొత్త పాఠశాలల్లో చేరిపోనున్నారు. ఇప్పుడా బడుల్లో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులే లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్