43 నెలల్లో గ్రామ స్వరాజ్యం తెచ్చాం
దేశంలో మరెక్కడా లేని విధంగా 43 నెలల్లో తమ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఇది సాకారమైంది
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈనాడు, అమరావతి: దేశంలో మరెక్కడా లేని విధంగా 43 నెలల్లో తమ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో ఇది సాకారమైందని పేర్కొన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ సంబంధాలతో ప్రమేయం లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సమానావకాశాలను కల్పిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.1.82 లక్షల కోట్లు జమ చేసినట్లు వివరించారు. అణగారిన వర్గాల తలరాతలు మార్చేలా ఇలాంటి ప్రయత్నాలేవీ గతంలో జరగలేదని చెప్పారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... తమది మాటల ప్రభుత్వం కాదని, చేతలదని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు వివరించారు. మహిళా సాధికారత కోసం వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, జగనన్న అమ్మఒడి వంటి పలు పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లోనూ సంక్షేమాధారిత అభివృద్ధిని ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తామని వెల్లడించారు. సీఎం జగన్ సమర్థ నాయకత్వం, మానవీయ దృక్పథంతో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని వ్యాఖ్యానించారు.
పోలవరం పూర్తి చేస్తాం
‘పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధాన డ్యాం, కాలువ పనులు 78.64 శాతం పూర్తయ్యాయి. భూసేకరణ, పునరావాసం పనులు 22.11 శాతం అయ్యాయి. మార్చి నాటికి నాగావళి- వంశధార అనుసంధానం అవుతుంది. జూన్ నాటికి వంశధార ఫేజ్-2, స్టేజ్-2 పనులు పూర్తిచేశాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.15,548 కోట్ల వ్యయంతో బాబూ జగ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టాం. వచ్చే ఏడాదికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను అందుబాటులోకి తెస్తాం.
* 2019 జూన్ నుంచి 2022 డిసెంబరు 31 మధ్య.. రాష్ట్రంలో రూ.54,236 కోట్ల పెట్టుబడులతో 109 భారీ పరిశ్రమల స్థాపన జరిగింది. 71,856 మందికి ఉద్యోగాలు లభించాయి. స్థూల జాతీయోత్పత్తితో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఎక్కువగా ఉంది.
* జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటివరకూ 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,167 కోట్లు అందించాం. 84 లక్షల మంది విద్యార్థులకు మేలు కల్పించాం. ఫలితంగా గత మూడేళ్లలో రాష్ట్రంలో స్థూలప్రవేశాల నిష్పత్తి బాగా పెరిగింది. 4,59,564 మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకు రూ.668 కోట్ల విలువైన ట్యాబ్లు అందించాం. మనబడి-నాడునేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన వంటి పథకాల ద్వారా విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం.
* రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమిస్తోంది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, పెట్టుబడి రాయితీ, పంట ఉత్పత్తుల కొనుగోలు, సున్నా వడ్డీ పంటరుణాలు వంటి పథకాల అమలుకు వీలుగా ఈ-క్రాప్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నాం. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా.. ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. తదనుగుణంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించాం.
* ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.82 లక్షల కోట్లు జమచేశాం. అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో అందించాం’ అని గవర్నర్ పేర్కొన్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. చిత్రంలో సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే