చేదోడుకు గడువు గండం
జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీస గడువునూ ఇవ్వలేదు. మూడో విడత సాయం మంజూరు విషయంలో దరఖాస్తుకు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ మూడే రోజుల సమయమిచ్చింది.
దరఖాస్తుకు సమయమిచ్చింది 3 రోజులే
నిర్దేశిత సమయానికి 80 వేల మంది ధ్రువీకరణ పత్రాలు సమర్పించని వైనం
లబ్ధిదారుల్లో ఆందోళన
ఈనాడు డిజిటల్, అమరావతి: జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీస గడువునూ ఇవ్వలేదు. మూడో విడత సాయం మంజూరు విషయంలో దరఖాస్తుకు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ మూడే రోజుల సమయమిచ్చింది. పాత లబ్ధిదారుల నుంచి వేలిముద్రల సేకరణ ఇదే సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తుల పరిశీలనకు గ్రామ, వార్డు సచివాలయాలకు శుక్రవారం మధ్యాహ్నం వరకూ గడువిచ్చింది. గతంలో ఈ ప్రక్రియ పూర్తికి వారం నుంచి 10 రోజుల సమయం ఇచ్చేది. మరోవైపు పాత లబ్ధిదారులు, కొత్త దరఖాస్తుదారులు కలిపి గురువారం రాత్రి 7 గంటల సమయానికి 80వేల మంది ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లబ్ధిదారులు, కొత్త దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. దరఖాస్తుకు గడువు పొడిగించాలని వారు కోరుతున్నారు.
3 రోజుల్లో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తెచ్చేదెలా?: చేదోడు పథకం కింద దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఏటా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో రెండో విడత కింద 2.85 లక్షల మందికి సాయం అందించింది. మూడో విడత సాయాన్ని ఈ నెల 30న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. పాత లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసినవారు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, లేబర్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంది. ఉన్న మూడు రోజుల గడువులోనూ గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయాలకు సెలవు. ఇక రెండు రోజుల్లో వీటిని పొందేది ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేసుకున్నా మరికొందరు అర్హులు లబ్ధిని కోల్పోయే అవకాశాలున్నాయని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. పైగా మీసేవా కేంద్రాల నుంచి తీసుకున్నవి పథకానికి వర్తించబోవని లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయ అధికారులు చెబుతున్నారు. పాత లబ్ధిదారులు, కొత్త దరఖాస్తుదారులు కలిపి గురువారం రాత్రి 7 గంటల సమయానికి 2.92 లక్షల మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 1.79 లక్షల మంది దరఖాస్తులు సచివాలయాల స్థాయిలోనే పెండింగ్లో ఉన్నాయి. ఎంపీడీవో లాగిన్లో 27వేలు, జిల్లా బీసీ సంక్షేమశాఖ ఈడీ లాగిన్లో 5,500 వరకూ ఉన్నాయి. వీటన్నింటినీ కలెక్టరు ఆమోదించిన తర్వాత రాష్ట్ర స్థాయికి చేరతాయి. అక్కడ వారి వద్ద ఉన్న సమాచారంతో తనిఖీ చేసిన తర్వాతే అర్హుల సంఖ్య తేలుతుంది. ఇంకా 80వేల మంది ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై